News January 27, 2025

జనగామ జిల్లాలో రైతులకు రూ.15.91 కోట్లు జమ

image

జనవరి 26న రైతుభరోసా పథకం ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో సాగు చేస్తున్న ప్రతి ఎకరానికి రూ.6 వేలు చొప్పున అర్హులైన ప్రతి రైతుకు రైతు భరోసా పథకాన్ని వర్తింపచేస్తున్నట్లు జనగామ జిల్లా వ్యవసాయశాఖ అధికారులు తెలిపారు. సోమవారం ఈ మేరకు రైతు భరోసా నిధులు జిల్లాలో ప్రతి మండలానికి ఒక్కో గ్రామం చొప్పున జనగామ జిల్లాలో 12 మండలాల్లోని 12 గ్రామాలకు చెందిన 12,320 రైతులకు రూ.15.91 కోట్లు జైనట్లు తెలిపారు.

Similar News

News October 22, 2025

ఎలాంటి ప్రీమియం లేకుండా రూ.7లక్షల బీమా!

image

కుటుంబ పెద్ద చనిపోతే అతని భార్యాపిల్లలు ఆర్థిక ఇబ్బందులతో ఇబ్బందిపడాల్సిందే. అందుకే ఇలాంటి పరిస్థితి ఎవరికీ రావొద్దని EPFO తన సభ్యులకు EDLI కింద ఆర్థిక భరోసా కల్పిస్తుంది. పీఎఫ్ ఖాతాదారుడు సర్వీస్‌లో ఉండగా మరణిస్తే కుటుంబానికి గరిష్ఠంగా రూ.7లక్షల వరకు ఉచిత బీమా లభిస్తుంది. దీనికి ఎలాంటి ప్రీమియం చెల్లించనవసరం లేదు. PF ఖాతాలో నామినీ వివరాలు అప్డేట్ చేసుకోవడం మరిచిపోకండి. SHARE IT

News October 22, 2025

సదర్.. దద్దరిల్లనున్న నారాయణగూడ

image

సదర్‌కు హైదరాబాద్ సిద్ధమైంది. నారాయణగూడ YMCA చౌరస్తాలో ప్రత్యేకంగా 4 వేదికలు ఏర్పాటు చేశారు. చెప్పల్‌బజార్, కాచిగూడ, ముషీరాబాద్, ఖైరతాబాద్‌తో పాటు నగర నలుమూలల నుంచి యాదవులు వేలాదిగా ఇక్కడికి తరలిరానున్నారు. దేశంలోనే పేరుగాంచిన దున్నరాజులను ప్రదర్శిస్తారు. భారీ లైటింగ్, నృత్యాలు, దున్నరాజులతో యువత విన్యాసాలు సదర్‌ వైభవాన్ని మరింత పెంచుతాయి. అర్ధరాత్రి వరకు డప్పుల మోతతో నారాయణగూడ దద్దరిల్లనుంది.

News October 22, 2025

SECLలో 1,138 పోస్టులు.. అప్లై చేశారా?

image

సౌత్ ఈస్ట్రర్న్ కోల్‌ఫీల్డ్స్ (SECL) 1,138 పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది. Asst ఫోర్‌మెన్(543 ), మైనింగ్ సిర్దార్, Jr ఓవర్‌మెన్(595) పోస్టులు ఉన్నాయి. మైనింగ్ సిర్దార్, Jr ఓవర్‌మెన్ జాబ్‌లకు OCT 30 అప్లైకి ఆఖరు తేదీ కాగా.. Asst ఫోర్‌మెన్ పోస్టులకు NOV 9 లాస్ట్ డేట్. పోస్టును బట్టి డిప్లొమా, BE, బీటెక్ పాసై ఉండాలి.
*మరిన్ని ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం <<-se_10012>>జాబ్స్<<>> కేటగిరీకి వెళ్లండి.