News January 28, 2025
జనగామ జిల్లాలో రైతులకు రూ.15.91 కోట్లు జమ

జనవరి 26న రైతుభరోసా పథకం ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో సాగు చేస్తున్న ప్రతి ఎకరానికి రూ.6 వేలు చొప్పున అర్హులైన ప్రతి రైతుకు రైతు భరోసా పథకాన్ని వర్తింపచేస్తున్నట్లు జనగామ జిల్లా వ్యవసాయశాఖ అధికారులు తెలిపారు. సోమవారం ఈ మేరకు రైతు భరోసా నిధులు జిల్లాలో ప్రతి మండలానికి ఒక్కో గ్రామం చొప్పున జనగామ జిల్లాలో 12 మండలాల్లోని 12 గ్రామాలకు చెందిన 12,320 రైతులకు రూ.15.91 కోట్లు జమైనట్లు తెలిపారు.
Similar News
News November 20, 2025
PDPL: ‘ఓటర్ జాబితా ఫిర్యాదులు 22లోపు పరిష్కరించాలి’

రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ ఐ.రాణి కుముదిని జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్లో గ్రామపంచాయతీ ఎన్నికల సన్నద్ధతపై సమీక్షించారు. 3 విడతల్లో ఎన్నికలు, మండలవారీ ప్రణాళికలు సిద్ధం చేయాలని, ఓటర్ జాబితా ఫిర్యాదులను నవంబర్ 22లోపు పరిష్కరించాలి అని సూచించారు. నవంబర్ 23న పోలింగ్ కేంద్రాలు, ఓటర్ జాబితా ప్రచురించాలన్నారు. ఎంసీసీ నిబంధనలు పాటించాలన్నారు. జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష పాల్గొన్నారు.
News November 20, 2025
HNK: సాదారణ ప్రసవాలను ప్రోత్సహించాలి: కలెక్టర్

ఆసుపత్రులలో సాధారణ ప్రసవాలను పెంచాలని, సిజేరియన్లను తగ్గించాలని జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ అన్నారు. జిల్లా కలెక్టరేట్ లో వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ కార్యక్రమాల అమలు తీరుపై వైద్యాధికారులతో కలెక్టర్ సమీక్షా సమావేశం నిర్వహించారు.
12 వారాలలోపు ప్రతి గర్భిణీ వివరాలను ఏఎన్ఎం లు నమోదు చేయాలన్నారు. గర్భిణీలకు తప్పనిసరిగా నాలుగుసార్లు చెకప్ కు వచ్చేలా ఏఎన్ఎంలు, ఆశాలు కృషి చేయాలన్నారు.
News November 20, 2025
HNK: ‘బాలల హక్కుల పరిరక్షణకు సమన్వయం అవసరం’

బాలల హక్కుల పరిరక్షణ కోసం ప్రభుత్వ శాఖలు, స్వచ్ఛంద సంస్థలు సమన్వయంతో కృషి చేయాలని అదనపు కలెక్టర్ ఏ. వెంకట్ రెడ్డి అన్నారు. కలెక్టరేట్లో నిర్వహించిన బాలల హక్కుల వారోత్సవాల ముగింపు కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. బాలలు దేశ సంపద అని, వారిని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిదీ అని అన్నారు. ఈ సందర్భంగా చిన్నారులు ప్రదర్శించిన నృత్యాలను తిలకించి, వారిని అభినందించి బహుమతులు అందించారు.


