News March 3, 2025
జనగామ జిల్లా కలెక్టర్గా ఏడాది పరిపాలన పూర్తి

జనగామ జిల్లా కలెక్టర్గా షేక్ రిజ్వాన్ బాషా భాధ్యతలు చేపట్టి ఏడాది పరిపాలన పూర్తి అయింది. ఈ ఏడాదిలో విద్యా, వైద్యంపై ప్రత్యేక దృష్టి సారించారు. విధుల పట్ల నిర్లక్ష్యం వహించిన సుమారు 50 మంది ఉద్యోగులపై వేటు వేశారు. పదో తరగతి విద్యార్ధుల కోసం ప్రత్యేకంగా విజయోస్తు కార్యక్రమాన్ని చేపట్టారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో అందుతున్న వైద్య సేవలపై ఆకస్మిక తనిఖీలు చేస్తూ తనదైన శైలిలో ప్రత్యేకత చాటుతున్నారు.
Similar News
News February 28, 2026
బలిజిపేట: పైలేరియా రహిత జిల్లాగా మార్చడమే లక్ష్యం

జిల్లాలో పైలేరియా వ్యాధిని శాశ్వతంగా నిర్మూలించేందుకు వైద్య ఆరోగ్య శాఖ అధికారులు పటిష్ఠమైన చర్యలు చేపట్టాలని కలెక్టర్ డా.ఎన్. ప్రభాకర రెడ్డి ఆదేశించారు. శనివారం బలిజిపేట మండలం పెదపెంకి గ్రామంలో ఆయన పర్యటించారు. జిల్లాలోని పైలేరియా బాధితులందరికీ ఎటువంటి అంతరాయం లేకుండా అవసరమైన మందులను నిరంతరం సరఫరా చేయాలన్నారు. దోమల నివారణకు గ్రామాల్లో పారిశుద్ధ్య పనులపై ప్రత్యేక దృష్టి సారించాలని తెలిపారు.
News February 28, 2026
నరసాపురంలో పెన్షన్ పంపిణీ చేసిన కలెక్టర్

నరసాపురంలోని బొండమ్మ మహిళా వృద్ధాశ్రమంలో శనివారం కలెక్టర్ నాగరాణి ఎన్టీఆర్ భరోసా పింఛన్లను పంపిణీ చేశారు. లబ్ధిదారులను ఆప్యాయంగా పలకరించి, వారి ఆరోగ్య పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. జిల్లావ్యాప్తంగా 24 రకాల పింఛన్లకు సంబంధించి 2,22,980 మంది లబ్ధిదారులకు రూ.96.39 కోట్లను పంపిణీ చేస్తున్నట్లు కలెక్టర్ వెల్లడించారు. పింఛన్లతో పాటు వృద్ధులకు పండ్లను పంపిణీ చేసి వారికి భరోసానిచ్చారు.
News February 28, 2026
VIRAL: 5.9 కిలోల బుజ్జి బాహుబలి

న్యూయార్క్లోని ఓ జంట బాల భీముడికి జన్మనిచ్చింది. ఇతాకాలోని కాయుగా మెడికల్ సెంటర్లో టెర్రికా, షాన్ దంపతులకు ఏకంగా 5.9 కిలోల బరువున్న బాబు పుట్టాడు. ఈ బుజ్జి భీముడికి 6 నెలల పిల్లల దుస్తులు, డైపర్లే సరిపోతున్నాయి. అదే సమయంలో ఆస్పత్రిలో పుట్టిన మరో శిశువు 1.8కేజీలే ఉంది. ఇద్దరినీ పక్కపక్కనే ఉంచి తీసిన ఫొటో నెట్టింట వైరలవుతోంది. అయితే 1955లో ఇటలీలో 9.97kgలతో అత్యంత బరువైన శిశువు జన్మించింది.


