News March 3, 2025
జనగామ జిల్లా కలెక్టర్గా ఏడాది పరిపాలన పూర్తి

జనగామ జిల్లా కలెక్టర్గా షేక్ రిజ్వాన్ బాషా భాధ్యతలు చేపట్టి ఏడాది పరిపాలన పూర్తి అయింది. ఈ ఏడాదిలో విద్యా, వైద్యంపై ప్రత్యేక దృష్టి సారించారు. విధుల పట్ల నిర్లక్ష్యం వహించిన సుమారు 50 మంది ఉద్యోగులపై వేటు వేశారు. పదో తరగతి విద్యార్ధుల కోసం ప్రత్యేకంగా విజయోస్తు కార్యక్రమాన్ని చేపట్టారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో అందుతున్న వైద్య సేవలపై ఆకస్మిక తనిఖీలు చేస్తూ తనదైన శైలిలో ప్రత్యేకత చాటుతున్నారు.
Similar News
News December 17, 2025
అనంత: సూరీడు సమయం మారిపోతోంది.!

అనంతపురం జిల్లా వ్యాప్తంగా చలి తీవ్రత ప్రభావంతో ప్రజలు గజ గజ వణుకుతున్నారు. దానికి తోడు ఉదయం 8.30 గంటలవుతున్నప్పటికీ పొగ మంచు కప్పి వేయడంతో సూర్య భగవానుడు సైతం కనిపించని పరిస్థితి నెలకొంటుంది. వాహనదారులు పొగ మంచు పూర్తిగా క్లియర్ అయిన తర్వాత ప్రయాణాలు చేయాలని పోలీసులు సూచిస్తున్నారు. పుట్లూరు మండలం ఎల్లుట్ల గ్రామంలో సూర్యోదయం దృశ్యాలను చూడొచ్చు.
News December 17, 2025
పెద్దపల్లి: 9 గంటల వరకు ఓటేసిన 32,068 మంది

పెద్దపల్లి జిల్లాలో మూడో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఉదయం 9 గంటల వరకు 1,42,548 మంది ఓటర్లలో 32,068 మంది(22.50%) తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఎలిగేడులో 18,426 ఓటర్లలో 4,157 మంది, ఓదెలలో 35,194లో 6,864 మంది, పెద్దపల్లిలో 50,164లో 10,938 మంది, సుల్తానాబాద్లో 38,764లో 10,109 మంది ఓటు వేశారు.
News December 17, 2025
సిబ్బంది అప్రమత్తంగా ఉండాలి: SP

కామారెడ్డి జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర కోనాపూర్, హన్మాజీపేట్ గ్రామాలలో బుధవారం పర్యటించారు. ఈ పోలింగ్ కేంద్రాల వద్ద ఉన్న పోలింగ్ సరళిని, అలాగే బందోబస్తు ఏర్పాట్లను ఆయన క్షుణ్ణంగా పరిశీలించారు. ఎన్నికలు శాంతియుత వాతావరణంలో జరిగేలా చూడాలని, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావు ఇవ్వకుండా అప్రమత్తంగా ఉండాలని అక్కడ విధుల్లో ఉన్న పోలీస్ సిబ్బందికి ఎస్పీ తగిన సూచనలు చేశారు.


