News February 28, 2025

జనగామ జిల్లా కలెక్టర్ ఆదేశాలు.. ఆకస్మిక తనిఖీ

image

జనగామ జిల్లా కలెక్టర్ రిజ్వాన్ భాషా షేక్ ఆదేశాల మేరకు మండల ప్రత్యేక అధికారులు, తహశీల్దార్లు, ఎంపీడీఓలు, క్లస్టర్, నోడల్ అధికారులందరూ జిల్లాలోని వివిధ మండలాల్లోని రెసిడెన్షియల్ పాఠశాలలు, వసతి గృహాలను సందర్శించారు. వాటిల్లోని పరిశుభ్రతా చర్యలు, పారిశుద్ధ్య నిర్వహణ, విద్యార్థుల శ్రేయస్సు, బోధనా సామర్థ్యాలు, ఆహార భద్రత, తదితరాల వంటి వాటిని పరిశీలించి, మెనూ ప్రకారం ఆహారం అందించాలని కోరారు.

Similar News

News March 21, 2025

ఎండ తీవ్రతకు గురికాకుండా జాగ్రత్తలు పాటించాలి: కలెక్టర్

image

వేసవి నేపథ్యంలో ఎండ తీవ్రతకు గురికాకుండా జాగ్రత్తలు పాటించాలని కలెక్టర్ వినోద్ కుమార్ సూచించారు. తలనొప్పి, తల తిరగటం, తీవ్రమైన జ్వరం కలిగియుండటం, మత్తు నిద్ర కలవరింతలు, ఫిట్స్, లేదా పూర్తి అపస్మారక స్థితి ఉంటుందని, ఎండ తీవ్రంగా ఉన్నప్పుడు తెలుపు రంగు గల కాటన్ వస్త్రాలను ధరించాలని అన్నారు. తలకు టోపి పెట్టుకోవాలని, ఉప్పు కలిపిన మజ్జిగ, గ్లూకోస్ కలిపిన నీటిని తాగాలని సూచించారు.

News March 21, 2025

IPL కామెంటేటర్‌గా ఇండియన్ అంపైర్

image

భారత్‌కు చెందిన అంపైర్ అనిల్ చౌదరి రిటైర్మెంట్ ప్రకటించారు. ఇక నుంచి కామెంటేటర్‌గా కొనసాగనున్నారు. ఢిల్లీకి చెందిన ఆయన 2013-2025 వరకు 12 టెస్టులు, 49 ODIs, 64 T20s, 131 IPL, 91 ఫస్ట్ క్లాస్, 114 లిస్ట్-A మ్యాచులకు అంపైరింగ్ చేశారు. ఇలా అంతర్జాతీయ మ్యాచులకు అంపైర్‌గా చేసి ఫుల్ టైమ్ కామెంటేటర్‌గా మారిన తొలి భారత అంపైర్‌గా నిలిచారు. ఇప్పుడు IPLలో హర్యాన్వి, హిందీలో వ్యాఖ్యాతగా వ్యవహరించనున్నారు.

News March 21, 2025

మంత్రి ఫరూక్ సతీమణి మృతి.. సీఎం, డిప్యూటీ సీఎం సంతాపం

image

మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండీ ఫరూక్ సతీమణి షహనాజ్ మృతికి సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం వపన్ కళ్యాణ్ సంతాపం తెలిపారు. షహనాజ్ మృతితో విషాదంలో ఉన్న ఫరూక్ కుటుంబానికి ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి సానుభూతిని తెలిపారు. కాగా, కొన్ని నెలలుగా అనారోగ్యంతో ఉన్న ఆమె ఇవాళ హైదరాబాద్‌లోని వారి నివాసంలో మృతిచెందారు.

error: Content is protected !!