News March 5, 2025
జనగామ జిల్లా పేరును నిలబెట్టాలి: కలెక్టర్

పాలకుర్తిలో 10వ తరగతి విద్యార్థులకు విజయోస్తూ కార్యక్రమాన్ని మంగళవారం నిర్వహించారు. ముఖ్య అతిథిగా కలెక్టర్ రిజ్వాన్ భాషా హాజరై మాట్లాడుతూ.. విద్యార్థి జీవితంలో 10వ తరగతి ఒక ప్రధాన ఘట్టం అని, ఇందులో విజయం మీ జీవిత ప్రయాణంలో మరచిపోలేని ఒక జ్ఞాపకం అని తెలిపారు. ఈ తొలి గెలుపు బంగారు భవిష్యత్తుకు బలమైన పునాది వేస్తుందన్నారు. ప్రతి ఒక్కరూ ఉత్తీర్ణులు కావాలని ఆకాంక్షించారు.జిల్లా పేరును నిలబెట్టాలన్నారు.
Similar News
News March 8, 2026
మహబూబాబాద్: లైసెన్స్డ్ సర్వేయర్లకు సర్టిఫికెట్ల ప్రదానం

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘భూభారతి’ చట్టం అమలులో భాగంగా ఆరు నెలలుగా కఠిన శిక్షణ, అప్రెంటిస్షిప్ పూర్తి చేసుకున్న అభ్యర్థులకు శనివారం లైసెన్స్ సర్టిఫికెట్లను అందజేశారు. కలెక్టర్ స్నేహ శబరీష్ ఆదేశాల మేరకు అడిషనల్ డైరెక్టర్ నూర్ సింగ్ ధ్రువీకరణ పత్రాలను పంపిణీ చేశారు. భూ సర్వే ప్రక్రియలో పారదర్శకతను పెంచేందుకు ఈ లైసెన్స్డ్ సర్వేయర్ల సేవలు ఎంతో దోహదపడతాయని ఆయన పేర్కొన్నారు.
News March 8, 2026
ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షుడిగా పల్లేటి లక్ష్మణ్

ఎమ్మార్పీఎస్ సూర్యాపేట జిల్లా అధ్యక్షుడిగా పల్లేటి లక్ష్మణ్ మాదిగ నియమితులయ్యారు. శనివారం జిల్లా కేంద్రంలో రాష్ట్ర నాయకులు ఆయనకు నియామక పత్రం అందజేశారు. ఈ సందర్భంగా లక్ష్మణ్ మాట్లాడుతూ.. మాదిగల హక్కులు, సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తానని, జిల్లాలోని నాలుగు నియోజకవర్గాల్లో పార్టీ బలోపేతమే తన ధ్యేయమని అన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు ఎమ్మార్పీఎస్ రాష్ట్ర, జిల్లా నాయకులు పాల్గొన్నారు.
News March 8, 2026
శ్రీకాకుళం జిల్లాలో టుడే టాప్ న్యూస్ ఇవే

ప్రజాసమస్యల పరిష్కారమే ప్రధమ కర్తవ్యం: ఎమ్మెల్యే శిరీష
లావేరు: ఇసుక రవాణాలో కానరాని నిబంధనలు
శ్రీకాకుళం జిల్లాలో పలుచోట్ల పోలీసులు కార్డెన్ సెర్చ్
శ్రీకాకుళం: ఏయూ స్టడీ సెంటర్ కొనసాగిస్తారా ?
ప్రభుత్వ ఆసుపత్రి నిర్మాణం చేపట్టండి: ఇచ్ఛాపురం వైసీపీ సమన్వయకర్త
జిల్లాలో పలు చోట్ల పదో తరగతి విద్యార్థులకు పరీక్షా సామాగ్రి అందజేత


