News March 30, 2025

జనగామ జిల్లా ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు తెలిపిన కలెక్టర్

image

జిల్లా ప్రజలకు కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ నూతన సంవత్సరాది ఉగాది పండుగ శుభాకాంక్షలు తెలిపారు. తెలుగు వారి పండుగలు ఉగాది పండుగతోనే మొదలవుతాయని. శ్రీ విశ్వావసు నామ సంవత్సర ఉగాది పండుగ సందర్భంగా.. జిల్లా ప్రజలందరి జీవితంలో ఉగాది పచ్చడిలా షడ్రుచులు నిండి ఉండాలని, ప్రజలందరూ తమ కుటుంబ సభ్యులతో పండుగను ఆనందంగా జరుపుకోవాలని కలెక్టర్ ఆకాంక్షించారు.  

Similar News

News November 20, 2025

నిజామాబాద్: దారుణం.. కన్న కూతురిపై తండ్రి అఘాయిత్యం

image

​నిజామాబాద్ జిల్లాలో అత్యంత హేయమైన ఘటన వెలుగు చూసింది. కన్న తండ్రే సొంత కూతురిపై లైంగిక దాడికి పాల్పడినట్లు నిందితుడి భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఎడపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ దారుణం చోటుచేసుకుంది. ఇటీవల అర్ధరాత్రి కూతురిపై తండ్రి లైంగిక దాడికి పాల్పడగా తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీనిపై పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు.

News November 20, 2025

ఎక్స్‌ట్రీమ్‌ వెదర్‌తో 4,064 మంది మృతి

image

దేశంలో ప్రకృతి వైపరీత్యాలతో ఈ ఏడాది JAN-SEP వరకు 4,064 మంది మృత్యువాత పడినట్లు ఢిల్లీకి చెందిన ‘సెంటర్‌ ఫర్‌ సైన్స్‌ అండ్‌ ఎన్విరాన్మెంట్’ & ‘డౌన్‌ టు ఎర్త్‌’ నివేదిక వెల్లడించింది. గత 4 ఏళ్లతో పోలిస్తే మరణాలు 48% పెరిగినట్లు పేర్కొంది. 9.47 M హెక్టార్ల పంట నష్టం వాటిల్లింది. 2022తో పోలిస్తే 4 రెట్లు పెరిగింది. వ్యవసాయ రాష్ట్రాలైన AP, WBల సమాచారం అసమగ్రంగా ఉందని, నష్టం ఇంకా ఎక్కువే ఉండొచ్చంది.

News November 20, 2025

NLG: వామ్మో కోతులు

image

జిల్లాలో కోతుల బెడద కారణంగా వ్యవసాయ, ఉద్యాన పంటలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. దిగుబడులు గణనీయంగా తగ్గడం రైతుల్లో ఆందోళన కలిగిస్తోంది. చాలాకాలంగా వానరాలతో అటు రైతులు, ఇటు ప్రజలు సతమతమవుతున్నారు. రోజూ వేలాది కోతులు కూరగాయలు, పండ్ల తోటలు, పొలాల్లోకి వచ్చి పంటలను నాశనం చేస్తూ రైతులను ఇబ్బందుల్లో పడేస్తున్నాయని తెలిపారు. అధికారులు స్పందించి కోతుల బెడద నివారణకు చర్యలు చేపట్టాలని రైతులు కోరారు.