News February 1, 2025

జనగామ జిల్లా బీజేపీ అధ్యక్ష పదవికి పోటాపోటీ!

image

జనగామ జిల్లా బీజేపీ అధ్యక్ష పదవికి పార్టీ శ్రేణులు పోటీ పడుతున్నారు. ప్రస్తుత జిల్లా అధ్యక్షుడు ఆరుట్ల దశమంత రెడ్డితో పాటు మాజీ అధ్యక్షుడు కేవీఎల్ఎన్ రెడ్డి, ఊడుగుల రమేశ్, సౌడ రమేశ్, బెజాడీ బీరప్ప, విద్యాసాగర్ రెడ్డి, రామ్మోహన్ రెడ్డి పోటీ పడుతున్నారు. సంస్థాగత ఎన్నికల్లో భాగంగా ఈసారి బీసీ లేదా ఎస్సీలకు ఇవ్వాలని అధిష్ఠానం యోచిస్తోంది. ఎవరికి ఇస్తారనేది నాయకుల్లో ఉత్కంఠగా నెలకొంది.

Similar News

News April 19, 2026

తమిళనాడులో చంద్రబాబు ఎన్నికల ప్రచారం

image

AP CM చంద్రబాబు తమిళనాడులో ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. NDA అభ్యర్థుల విజయమే లక్ష్యంగా ఈ నెల 20, 21వ తేదీల్లో అక్కడ పర్యటించనున్నారు. కోయంబత్తూరు, హోసూరు, చెన్నై, ఆవడి ప్రాంతాల్లో ప్రచారంలో పాల్గొంటారు. తెలుగు ప్రజలు అధికంగా ఉండే ప్రాంతాల్లోనే CBN ప్రచారం సాగనుంది. ఈ సందర్భంగా ఆయన బహిరంగ సభలు, రోడ్డు షోలలో పాల్గొననున్నారు. TNలో ఏప్రిల్ 23వ తేదీ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే.

News April 19, 2026

మ్యుటేషన్ కొత్త రూల్స్‌తో గుంటూరు రైతుల అవస్థలు

image

ఆటో మ్యుటేషన్ విధానంలో ప్రభుత్వం మార్పులు చేసింది. భూమి రిజిస్ట్రేషన్ అయ్యాక అమ్మిన, కొన్న వ్యక్తులిద్దరూ అధికారుల వద్ద బయోమెట్రిక్ వేస్తేనే మ్యుటేషన్ పూర్తవుతుంది. ఒకవేళ అమ్మిన వారు అందుబాటులో లేకున్నా, చనిపోయినా ఏం చేయాలనే దానిపై స్పష్టత లేదు. పారదర్శకత కోసమే ఈ రూల్ తెచ్చినా.. దీనివల్ల గుంటూరు జిల్లా రైతులు, కొనుగోలుదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

News April 19, 2026

కాకినాడ: యానిమేటర్లకు అందని సెల్ ఫోన్లు

image

జిల్లాలోని డ్వాక్రా యానిమేటర్లకు పంపిణీ చేయాల్సిన సెల్‌ఫోన్లు ఇంకా వారి చేతికి అందలేదు. నాలుగు రోజుల క్రితమే కలెక్టరేట్‌లో పంపిణీ ప్రక్రియను కలెక్టర్ ప్రారంభించినప్పటికీ, వెంటనే డి.ఆర్.డి.ఏ అధికారులు వాటిని వెనక్కి తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ ఫోన్లు ఎం.ఎస్ కార్యాలయాల్లోనే మూలుగుతున్నాయి. జిల్లావ్యాప్తంగా 3,500 మందికి పైగా యానిమేటర్లు తమకు ఫోన్లు ఎప్పుడు అందజేస్తారా అని ఆశగా ఎదురుచూస్తున్నారు.