News February 1, 2025
జనగామ జిల్లా బీజేపీ అధ్యక్ష పదవికి పోటాపోటీ!

జనగామ జిల్లా బీజేపీ అధ్యక్ష పదవికి పార్టీ శ్రేణులు పోటీ పడుతున్నారు. ప్రస్తుత జిల్లా అధ్యక్షుడు ఆరుట్ల దశమంత రెడ్డితో పాటు మాజీ అధ్యక్షుడు కేవీఎల్ఎన్ రెడ్డి, ఊడుగుల రమేశ్, సౌడ రమేశ్, బెజాడీ బీరప్ప, విద్యాసాగర్ రెడ్డి, రామ్మోహన్ రెడ్డి పోటీ పడుతున్నారు. సంస్థాగత ఎన్నికల్లో భాగంగా ఈసారి బీసీ లేదా ఎస్సీలకు ఇవ్వాలని అధిష్ఠానం యోచిస్తోంది. ఎవరికి ఇస్తారనేది నాయకుల్లో ఉత్కంఠగా నెలకొంది.
Similar News
News February 14, 2025
అనకాపల్లిలో మాదకద్రవ్యాల నియంత్రణపై వర్క్ షాప్

అనకాపల్లిలో మాదక ద్రవ్యాల నియంత్రణపై పోలీస్ అధికారులకు ఒకరోజు వర్క్ షాప్ శుక్రవారం నిర్వహించారు. కస్టమ్స్ ఎక్సైజ్ సర్వీస్ టాక్స్ అప్పిలేట్ ట్రిబ్యునల్ అధికారి రంగధామ్ మాట్లాడుతూ.. చట్టపరమైన అంశాలు దర్యాప్తులో తీసుకోవాల్సిన జాగ్రత్తలను అధికారులకు వివరించారు. అదనపు ఎస్పీ దేవ ప్రసాద్ మాట్లాడుతూ.. అధికారులు సమన్వయంతో పని చేయాలని సూచించారు.
News February 14, 2025
తిరుపతి: లోకేశ్ను కలిసిన రాకేశ్ కుటుంబ సభ్యులు

ఏనుగుల దాడిలో మృతి చెందిన తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం కందులవారిపల్లె ఉపసర్పంచ్ రాకేశ్ చౌదరి కుటుంబ సభ్యులు శుక్రవారం ఉండవల్లిలో మంత్రి నారా లోకేశ్ను కలిశారు. ఈ సందర్భంగా లోకేశ్ వారితో మాట్లాడుతూ.. ఏనుగుల దాడిలో రాకేశ్ మరణించడం దిగ్భ్రాంతికి గురిచేసిందన్నారు. ఆయన మృతి పార్టీకి తీరని లోటని వ్యాఖ్యానించారు. మృతుడి కుటుంబానికి అన్నివిధాల అండగా ఉంటానని లోకేశ్ హామీ ఇచ్చారు.
News February 14, 2025
Good News: హోల్సేల్ రేట్లు తగ్గాయ్..

భారత టోకు ధరల ద్రవ్యోల్బణం (WPI) జనవరిలో 2.31 శాతానికి తగ్గింది. 2024 డిసెంబర్లో ఇది 2.37%. గత ఏడాది జనవరిలో ఇది 0.27 శాతమే కావడం గమనార్హం. ఆహార వస్తువుల ధరలు తగ్గడమే ఇందుకు కారణమని కామర్స్ మినిస్ట్రీ తెలిపింది. ఫుడ్ ప్రొడక్ట్స్, టెక్స్టైల్స్ తయారీ, క్రూడ్ పెట్రోల్, గ్యాస్ ధరలు మాత్రం పెరుగుతున్నట్టు పేర్కొంది. డిసెంబర్లో 8.89గా ఉన్న WPI ఫుడ్ ఇండెక్స్ విలువ జనవరిలో 7.47కు దిగొచ్చిందని తెలిపింది.