News March 3, 2025

జనగామ జిల్లా మైనార్టీ ఇన్‌ఛార్జ్ అధికారిగా విక్రమ్‌కుమార్

image

జనగామ జిల్లా మైనార్టీ ఇన్‌ఛార్జ్ అధికారిగా డిస్ట్రిక్ట్ ఎస్సీ డెవలప్మెంట్ ఆఫీసర్ విక్రమ్‌కుమార్ అదనపు భాద్యతలు స్వీకరించారు. ఇదివరకు జిల్లా మైనారిటీ ఇన్‌ఛార్జ్ అధికారిగా కొనసాగిన బీసీ సంక్షేమ అధికారి రవీందర్ ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా జిల్లా మైనారిటీ బాధ్యతలను విక్రమ్ కుమార్‌కు అప్పగిస్తూ జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా ఆదేశాలు జారీ చేశారు.

Similar News

News November 15, 2025

HYDలో పెరుగుతున్న వాయు కాలుష్యం..!

image

HYDలో వాయుకాలుష్యం, గాలిలో ధూళి కణాల సాంద్రత వృద్ధి చెందుతోంది. పర్టిక్యులేట్ మ్యాటర్ 242ను సూచిస్తుంది. మంచు, చల్లని గాలిలో ధూళికణాలు 4 నుంచి 8 అడుగుల ఎత్తులో అధిక మోతాదులో ఉంటాయని, దీంతో శ్వాసకోశ రోగాలు ప్రబలే అవకాశం ఉంటుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. నగరంలో మొత్తం 14 ప్రాంతాల్లో గాలినాణ్యతను కొలిచే యంత్రాలను PCB ఏర్పాటు చేసింది. కాగా, గాలినాణ్యత సూచి 100దాటితే ప్రమాదం ఉంటుందని PCB చెబుతోంది.

News November 15, 2025

సతీశ్ మృతి.. తండ్రిని కోల్పోయిన చిన్నారులు

image

పరకామణి కేసులో కీలకంగా వ్యవహరించిన <<18292672>>సతీశ్ హత్య<<>> రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపుతోంది. ఇప్పటికే పోలీసులు ముమ్మరంగా దర్యాప్తు చేపట్టగా అటు పార్టీలు సైతం విమర్శలు గుప్పించుకుంటున్నాయి. అయితే దేవుడి సొమ్ము చోరీని బయటపెట్టిన తన భర్త ఆదేవుడి దగ్గరికే వెళ్లిపోయాడంటూ ఆకుటుంబం ఆవేదన వ్యక్తంచేసింది. సతీశ్‌కు భార్య మమత, ఇద్దరు ఆడ పిల్లలు ఉన్నారు. సతీశ్ మృతితో ఒక్కసారిగా ఆ కుటుంబం పెద్ద దిక్కును కోల్పోయింది.

News November 15, 2025

కాకరలో బూడిద తెగులు.. నివారణకు సూచనలు

image

వాతావరణంలో తేమ శాతం ఎక్కువగా ఉన్నప్పుడు కాకర పంటలో బూడిద తెగులు వ్యాప్తి ఎక్కువగా ఉంటుంది. పంటకు ఈ తెగులు సోకితే ఆకులపై బూడిద వంటి పొర ఏర్పడి ఆకులు ఎండిపోతాయి. దీని నివారణకు లీటరు నీటికి డైనోకాప్ 2 మి.లీ (లేదా) మైక్లోబ్యుటానిల్ 0.4 గ్రాములను కలిపి 7 నుంచి 10 రోజుల్లో 2, 3 సార్లు పిచికారీ చేయాలని వ్యవసాయ నిపుణులు సూచిస్తున్నారు.