News March 3, 2025

జనగామ జిల్లా మైనార్టీ ఇన్‌ఛార్జ్ అధికారిగా విక్రమ్‌కుమార్

image

జనగామ జిల్లా మైనార్టీ ఇన్‌ఛార్జ్ అధికారిగా డిస్ట్రిక్ట్ ఎస్సీ డెవలప్మెంట్ ఆఫీసర్ విక్రమ్‌కుమార్ అదనపు భాద్యతలు స్వీకరించారు. ఇదివరకు జిల్లా మైనారిటీ ఇన్‌ఛార్జ్ అధికారిగా కొనసాగిన బీసీ సంక్షేమ అధికారి రవీందర్ ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా జిల్లా మైనారిటీ బాధ్యతలను విక్రమ్ కుమార్‌కు అప్పగిస్తూ జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా ఆదేశాలు జారీ చేశారు.

Similar News

News October 17, 2025

ప్రజల ఫిర్యాదులపై తక్షణమే స్పందించాలి: ఎస్పీ నర్సింహా

image

నూతనంగా నిర్మిస్తున్న అనంతగిరి పోలీస్ స్టేషన్‌ను ఎస్పీ నర్సింహా శుక్రవారం పరిశీలించారు. భవన నిర్మాణ పనులు నాణ్యంగా, త్వరగా పూర్తి చేయాలని కాంట్రాక్టర్లను ఆదేశించారు. అనంతరం స్టేషన్‌లోని రికార్డులు, రిజిస్టర్లను పరిశీలించారు. పెండింగ్‌లో ఉన్న కేసులను వెంటనే పరిష్కరించాలని, ప్రజల ఫిర్యాదులపై తక్షణమే స్పందించాలని ఈ సందర్భంగా సిబ్బందికి ఆయన సూచించారు. కార్యక్రమంలో ఎస్ఐ నవీన్ కుమార్ పాల్గొన్నారు.

News October 17, 2025

మక్తల్: మినీ ట్యాంక్ బండ్ అభివృద్ధి పనులకు శంకుస్థాపన

image

మక్తల్ పట్టణంలోని మినీ ట్యాంక్ బండ్ అభివృద్ధి, సుందరీకరణ పనుల శంకుస్థాపనను మంత్రి దామోదర రాజనర్సింహ, మంత్రి వాకిటి శ్రీహరి సంయుక్తంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. సుమారు రూ.3.70 లక్షల నిధులతో సీడీఎంఏ ప్రత్యేక నిధుల కింద ఈ పనులు చేపట్టనున్నట్లు మంత్రులు తెలిపారు. అనంతరం వన మహోత్సవంలో భాగంగా చెరువు కట్టపై మొక్కలు నాటారు. పలువురు ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.

News October 17, 2025

JNTUH విద్యార్థులకు ALERT

image

కూకట్‌పల్లిలోని JNTU 14వ స్నాతకోత్సవానికి సిద్ధమవుతోంది. డిసెంబర్‌లో స్నాతకోత్సవాన్ని నిర్వహించేందుకు యూనివర్సిటీ అధికారులు ఏర్పాటు చేస్తున్నారు. 2024- 25 అకాడమిక్ ఇయర్‌కి సంబంధించి UG, PG, PHD పూర్తైన విద్యార్థులు డిగ్రీల కోసం నవంబర్ 30లోపు వర్సిటీ వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలని రిజిస్ట్రార్ వెంకటేశ్వరరావు సూచించారు.