News March 3, 2025

జనగామ జిల్లా మైనార్టీ ఇన్‌ఛార్జ్ అధికారిగా విక్రమ్‌కుమార్

image

జనగామ జిల్లా మైనార్టీ ఇన్‌ఛార్జ్ అధికారిగా డిస్ట్రిక్ట్ ఎస్సీ డెవలప్మెంట్ ఆఫీసర్ విక్రమ్‌కుమార్ అదనపు భాద్యతలు స్వీకరించారు. ఇదివరకు జిల్లా మైనారిటీ ఇన్‌ఛార్జ్ అధికారిగా కొనసాగిన బీసీ సంక్షేమ అధికారి రవీందర్ ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా జిల్లా మైనారిటీ బాధ్యతలను విక్రమ్ కుమార్‌కు అప్పగిస్తూ జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా ఆదేశాలు జారీ చేశారు.

Similar News

News March 28, 2025

చార్‌ధామ్ యాత్ర.. వీడియోలు, రీల్స్ చిత్రీకరణపై నిషేధం

image

ఈ ఏడాది చార్‌ధామ్ యాత్ర సందర్భంగా ఆలయాల ప్రాంగణంలో యూట్యూబర్లు, సోషల్ మీడియా కంటెంట్ క్రియేటర్లపై నిషేధం ఉండనుంది. ఆలయ ప్రాంగణంలో వీడియోలు, రీల్స్ చేస్తూ ఎవరైనా దొరికితే వారికి దర్శనం నిరాకరించి తిరిగి పంపించేస్తామని కేదార్‌నాథ్-బద్రీనాథ్ పాండా సమాజ్ ప్రకటించింది. ఏప్రిల్ 30న గంగోత్రి, యమునోత్రి తలుపులు, మే 2న కేదార్‌నాథ్, 4న బద్రీనాథ్ ఆలయ తలుపులు తెరుచుకోనున్నాయి.

News March 28, 2025

జగిత్యాల: మెరుగైన విద్యుత్ అందించడానికి లైన్లలో కెపాసిటర్ల బిగింపు : SE

image

జగిత్యాల సర్కిల్ పరిధిలో విద్యుత్ వినియోగదారులకు మెరుగైన, నాణ్యమైన సేవలు అందించడానికి విద్యుత్ లైన్లలో కెపాసిటర్లను అమర్చుతున్నామని జగిత్యాల జిల్లా సూపరింటెండింగ్ ఇంజనీర్ సాలియానాయక్ గురువారం తెలిపారు. వోల్టేజ్ లో విద్యుత్ హెచ్చు తగ్గులు లేకుండా కెపాసిటర్లు ఉపయోగపడతాయని అన్నారు. ఇప్పటివరకు 41 కెపాసిటర్లు బిగించామని తెలిపారు. వీటివల్ల ట్రాన్స్ఫార్మర్స్‌పై లోడ్ తగ్గి మోటార్లు కాలిపోకుండా ఉంటాయి

News March 28, 2025

NZB: కల్లులో గడ్డి మందు కలుపుకోని తాగాడు

image

నిజామాబాద్‌లో ఓ వ్యక్తి గడ్డి మందు తాగి ఆత్మహత్యకు పాల్పడి.. చికిత్స పొందుతూ మృతి చెందినట్లు 4వ టౌన్ ఎస్ఐ శ్రీకాంత్ తెలిపారు. వివేకానంద కాలనీకి చెందిన కొత్త రాములు(58) గుమస్తాగా పని చేస్తున్నాడు. సదరు వ్యక్తికి అనారోగ్య సమస్యల కారణంగా ఈనెల 24వ తేదీన ఇంట్లో నుంచి బయటకు వెళ్లి కల్లులో గడ్డి మందు కలిపి తాగాడు. కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించగా గురువారం మృతి చెందాడు.

error: Content is protected !!