News February 27, 2025

జనగామ జిల్లా వ్యాప్తంగా 1002 మంది ఓటర్లు

image

రేపు నిర్వహించబోయే ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో జిల్లా వ్యాప్తంగా 1002 ఓటర్లు ఉన్నట్లు జిల్లా అధికారులు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. జనగామ 511, దేవరుప్పుల 52, కొడకండ్ల 32, చిల్పూర్ 16, స్టేషన్ ఘనపూర్ 57, తరిగొప్పుల 16, లింగాల గణపురం 47, బచ్చన్నపేట 70, జఫర్గడ్ 29, నర్మెట్ట 31, రఘునాథపల్లి 47, పాలకుర్తిలో 84 ఉపాధ్యాయులు ఎన్నికల్లో పాల్గొననున్నట్లు తెలిపారు.

Similar News

News March 22, 2025

MBNR: రాజీవ్ యువ వికాసం.. APPLY చేసుకోండి..!

image

ఉమ్మడి పాలమూరు జిల్లా అర్హులైన బీసీ నిరుద్యోగ యువత “రాజీవ్ యువ వికాసం పథకం”ను ఆన్‌‌లైన్‌లో ఏప్రిల్ 5లోగా దరఖాస్తులు చేసుకోవాలని బీసీ అభివృద్ధి శాఖ అధికారిణి ఇందిర ఓ ప్రకటనలో తెలిపారు. ఈ పథకం ద్వారా ఉపాధి రుణాలు పొందవచ్చని, ఎంపికైన అభ్యర్థులకు జూన్ 2న ప్రభుత్వం రుణాలను మంజూరు చేస్తోందన్నారు. యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. SHARE IT

News March 22, 2025

విదేశీ యూనివర్సిటీల్లో అడ్మిషన్లు

image

ఇతర దేశాల్లోని వివిధ యూనివర్సిటీల్లో చదవాలని అనుకునే వారి కోసం ప్రత్యేక అవకాశం కల్పిస్తున్నట్లు శౌర్య కన్సల్టెన్సీ తెలిపింది. ఇందుకోసం JNTU బ్రాంచీలో ఈ నెల 22, 23 తేదీల్లో యూనివర్సిటీ, బ్యాంకు అధికారులు అందుబాటులో ఉంటారని ప్రకటించింది. విద్యార్థులు ఎవాల్యుయేషన్, స్కాలర్‌షిప్ గైడెన్స్, ఇతర వివరాల కోసం ఆయా తేదీల్లో సంప్రదించాలని సూచించారు.

News March 22, 2025

ప్రారంభమైన అఖిలపక్ష సమావేశం

image

డీలిమిటేషన్‌పై చెన్నైలో అఖిలపక్ష సమావేశం ప్రారంభమైంది. డీఎంకే చీఫ్, తమిళనాడు సీఎం స్టాలిన్ అధ్యక్షతన జరుగుతున్న ఈ భేటీకి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, కేరళ సీఎం విజయన్, కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్, పంజాబ్ సీఎం మాన్ తదితరులు హాజరయ్యారు. వారిని స్టాలిన్ సత్కరించారు. సమావేశానికి బెంగాల్ సీఎం మమత గైర్హాజరయ్యారు.

error: Content is protected !!