News March 18, 2025

జనగామ: టెన్త్ పరీక్షలను కట్టుదిట్టంగా నిర్వహించాలి: కలెక్టర్

image

జనగామ జిల్లాలో పదవ తరగతి పరీక్షలను కట్టుదిట్టంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో పింకేశ్ కుమార్, డీసీపీ రాజ మహేంద్ర నాయక్‌లతో కలిసి కలెక్టర్ పదవ తరగతి వార్షిక పరీక్షల నిర్వహణపై చీఫ్ సూపరింటెండెంట్లు, డిపార్టుమెంటల్ అధికారులు, సంబంధిత జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహించారు.

Similar News

News December 3, 2025

REMEMBER: ఇద్దరూ సీఎంలను ఓడించిన KVR

image

కామారెడ్డి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన బీజేపీ అభ్యర్థి కాటిపల్లి వెంకటరమణ రెడ్డి నేటితో సరిగ్గా రెండేళ్లు పూర్తి చేసుకున్నారు. 2023 డిసెంబర్ 3న వెలువడిన ఎన్నికల ఫలితాల్లో, ఒకే స్థానం నుంచి అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్, ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిలను ఆయన ఓడించి సంచలనం సృష్టించారు. ఈ అపూర్వ విజయం జాతీయ స్థాయిలో అందరి దృష్టిని ఆకర్షించింది.

News December 3, 2025

WNP: ఒకే వార్డుకు తండ్రికొడుకులు పోటీ

image

ఖిల్లాగణపురం మండలం మామిడిమాడ గ్రామపంచాయతీ నాలుగో వార్డుకు తండ్రి కొడుకులు పోటీపడుతున్నారు. కొడుకు ఏ సాయికుమార్ టీఆర్ఎస్ పార్టీ నుంచి పోటీలో ఉండగా, తండ్రి తిరుపతయ్య కాంగ్రెస్ నుంచి బరిలో ఉన్నారు. తండ్రి కొడుకుల్లో ఎవరు గెలుస్తారనే ఆసక్తి ఓటర్లలో నెలకొంది.

News December 3, 2025

వెనిజులాపై అతి త్వరలో దాడి చేస్తాం: ట్రంప్

image

మొన్నటి వరకూ నోబెల్ శాంతి బహుమతి కోసం ప్రయత్నించిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్ రూటు మార్చారు. వెనిజులాపై త్వరలో దాడులు చేస్తామని హెచ్చరించారు. మాదకద్రవ్యాలు అమెరికాలోకి రవాణా చేస్తున్న ఏ దేశానికైనా సైనిక చర్య తప్పదన్నారు. ఇప్పటివరకు డ్రగ్స్ బోట్లపై US జరిపిన దాడుల్లో 80 మందికి పైగా చనిపోయారు. వెనిజులాపై దాడికి దిగితే తీవ్ర పరిణామాలకు దారితీయవచ్చని అంతర్జాతీయవర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.