News December 28, 2024

జనగామ: దొంగతనాలకు పాల్పడుతున్న మహిళ అరెస్ట్

image

బస్టాండ్ ప్రదేశాలలో(రద్దీ) మహిళలను టార్గెట్ చేస్తూ దొంగతనాలకు పాల్పడుతున్న కర్నూలు జిల్లాకు చెందిన సంధ్య అనే మహిళను జనగామ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితురాలి నుంచి రూ.13 లక్షల విలువైన 171.23 గ్రాముల బంగారం, ఒక కారు స్వాధీనం చేసుకున్నారు. కేసును ఛేదించడంలో ప్రతిభ కనబరిచిన పోలీసులను కమిషనర్ అంబర్ కిషోర్ ఝా అభినందించారు.

Similar News

News September 16, 2025

పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలి: కలెక్టర్

image

వరంగల్ జిల్లా కేంద్రంలో సెప్టెంబర్ 22 నుంచి 28 వరకు సార్వత్రిక ఓపెన్ ఎస్ఎస్సీ, ఇంటర్మీడియట్ పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా సోమవారం కలెక్టర్ డా.సత్యశారద కలెక్టరేట్లో సమావేశం నిర్వహించారు. పరీక్షలు పకడ్బందీగా నిర్వహించేందుకు తగిన ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో సంబధిత అధికారులు ఉన్నారు.

News September 15, 2025

ప్రారంభమైన మార్కెట్.. పత్తి ధర ఏంతంటే?

image

రెండు రోజుల విరామం అనంతరం వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ సోమవారం ప్రారంభమైంది. ఈ క్రమంలో మార్కెట్‌కు పత్తి స్వల్పంగానే తరలివచ్చినట్లు అధికారులు తెలిపారు. అయితే గతవారంతో పోలిస్తే నేడు పత్తి ధర తగ్గింది. గత వారం గరిష్ఠంగా క్వింటా రూ.7,555 ధర పలకగా.. నేడు(సోమవారం) రూ.7,400కి తగ్గింది. మార్కెట్లో క్రయవిక్రయాలు కొనసాగుతున్నాయి.

News September 14, 2025

వరంగల్ జిల్లాలో చికెన్ ధరలు ఇలా..!

image

వరంగల్ జిల్లాలో నేడు చికెన్ ధరలు ఇలా ఉన్నాయి. విత్ స్కిన్ ధర కిలోకి రూ.200 నుంచి రూ.220 వరకు పలుకుతున్నది. అలాగే స్కిన్‌లెస్ కేజీకి రూ.250- 260 ధర, లైవ్ కోడి రూ.140- 150 ధర ఉన్నది. సిటీ తో పోలిస్తే పల్లెల్లో వీటి ద్వారా రూ.10-20 తేడా ఉంది. కాగా గతవారంతో పోలిస్తే నేడు ధరలు స్వల్పంగా పెరిగినట్లు వ్యాపారులు తెలిపారు.