News January 25, 2025

జనగామ: నాలుగు సంక్షేమ పథకాల అమలుకు రేపే శ్రీకారం

image

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెట్టనున్న రైతు భరోసా, ఇందిరమ్మ ఇళ్లు, ఆహార భద్రత(రేషన్) కార్డులు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాలకు రేపటి నుంచి శ్రీకారం చుట్టనున్నట్లు జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ తెలిపారు. ప్రతిష్ఠాత్మక నాలుగు సంక్షేమ పథకాల అమలు కోసం చేపట్టాల్సిన చర్యల గురించి అధికారులకు దిశ నిర్దేశం చేశారు.

Similar News

News December 1, 2025

SC కమిషన్‌ సెక్రటరీ కుమార్తె అనుమానాస్పద మృతి

image

రాష్ట్ర SC కమిషన్‌ సెక్రటరీ చిన్న రాముడు కుమార్తె మాధురి అనుమానాస్పదంగా మృతి చెందారు. బేతంచెర్ల మం. బుగ్గానిపల్లె తండాకు చెందిన ఆమె రాజేశ్ నాయుడును ప్రేమ వివాహం చేసుకున్నారు. ఆమెను 3 నెలల క్రితం తల్లిదండ్రులు తీసుకెళ్లారని రాజేశ్ తెలిపారు. మరో పెళ్లి చేసుకోవాలని బలవంతం చేస్తున్నట్లు తనకు మెసేజ్ చేసిందని, గర్భిణి అని చూడకుండా చంపి, ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారని రాజేశ్ ఆరోపించడం సంచలనంగా మారింది.

News December 1, 2025

నల్గొండ: సర్పంచ్ ఎన్నికలు.. పార్టీలకు మరో తలనొప్పి..!

image

ఉమ్మడి నల్గొండ జిల్లాలో చాలా చోట్ల రెండు, మూడు మధిర గ్రామాలు ఓ మేజర్ గ్రామ పంచాయతీ కింద కొనసాగుతున్నాయి. అయితే ప్రస్తుతం మేజర్ గ్రామాల నేతలకు, మధిర గ్రామాల నేతలకు మధ్య తీవ్ర పోటీ నెలకొంది. తమ గ్రామంలో ఓట్లు ఎక్కువ ఉన్న కులం వారికే సర్పంచ్ రిజర్వేషన్ వచ్చిందని, అందుకే తమ గ్రామంలోని అభ్యర్థులకే ప్రధాన పార్టీలు మద్దతు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. దీంతో ప్రధాన పార్టీలకు కొత్త తలనొప్పి వచ్చి పడింది.

News December 1, 2025

రేపు హైకోర్టుకు పరకామణి కేసు నివేదిక

image

AP: టీటీడీ పరకామణి కేసు విచారణ నేటితో పూర్తి కానుంది. రేపు సీఐడీ అధికారులు హైకోర్టుకు నివేదిక సమర్పించనున్నారు. హైకోర్టు ఆదేశాలతో అక్టోబర్ 27 నుంచి సీఐడీ.. టీటీడీ మాజీ ఛైర్మన్లు వైవీ సుబ్బారెడ్డి, కరుణాకర్ రెడ్డి, మాజీ ఈవో ధర్మారెడ్డి సహా 35 మందిని విచారించింది. విచారణకు హాజరవుతూ అప్పటి AVSO సతీశ్ అనుమానాస్పదంగా మరణించారు. చెన్నై, బెంగళూరు, విశాఖలో నిందితుడు రవికుమార్ ఆస్తులను పరిశీలించింది.