News January 30, 2025

జనగామ: నోడల్ అధికారుల పాత్ర కీలకం: కలెక్టర్

image

రాబోయే గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల నిర్వహణ కోసం నియమించిన నోడల్ అధికారులతో జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ బుధవారం రివ్యూ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. అధికారులందరూ వారికి కేటాయించిన అంశాలపై పూర్తిగా అవగాహన కలిగి ఉండి ఎలాంటి పొరపాట్లకు తావివ్వకుండా గ్రామ పంచాయతీ ఎన్నికలు విజయవంతంగా నిర్వహించాలన్నారు.

Similar News

News November 23, 2025

DANGER: HYDలో వాటర్ హీటర్ వాడుతున్నారా?

image

వాటర్ హీటర్ ప్రమాదాలు నగరంలో కలవరపెడుతున్నాయి. పోలీసుల వివారలిలా.. మియాపూర్‌ దావులూరి హోమ్స్‌లో హౌస్‌కీపింగ్ ఉద్యోగిని శివలీల (32) శనివారం వాటర్ హీటర్‌ షాక్ తగిలి తీవ్రంగా గాయపడి మృతిచెందింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పాత హీటర్లతో ప్రమాదాలు జరుగుతున్నాయని, నాణ్యమైనవి కొనాలని, చేతులు తుడుచుకుని, చెప్పులు ధరించి స్విచ్ఆఫ్ చేశాకే ప్లగ్ పట్టుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.

News November 23, 2025

చిత్తూరు జిల్లాలో చికెన్ ధరలు

image

చిత్తూరు జిల్లాలో ఆదివారం చికెన్ ధరలు ఇలా ఉన్నాయి. పలు దుకాణాల్లో బ్రాయిలర్ కోడి కిలో రూ.133 నుంచి రూ.140, మాంసం రూ.193 నుంచి 207 వరకు పలుకుతోంది. స్కిన్ లెస్ రూ.219 నుంచి రూ.232 వరకు విక్రయిస్తున్నారు. మరోవైపు కేజీ మటన్ రూ.800 నుంచి రూ. 900 మధ్య ఉంది. మీ ఏరియాలో మాంసం ధరలు ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి.

News November 23, 2025

భారీగా పెరుగుతున్న రెవెన్యూ లోటు

image

AP: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రెవెన్యూ లోటు భారీగా పెరుగుతోంది. 2025-26లో రూ.33,185 కోట్ల రెవెన్యూ లోటు ఉంటుందని ప్రభుత్వం బడ్జెట్‌లో అంచనా వేస్తే, OCT నాటికే రూ.47,805 కోట్లకు చేరినట్లు కాగ్ తన నివేదికలో వెల్లడించింది. రెవెన్యూ ఆదాయం రూ.2.17 లక్షల కోట్లుగా అంచనా వేస్తే రూ.91,638 కోట్లు వచ్చాయి. ప్రస్తుత FYలో రూ.79,927 కోట్ల అప్పులు చేయాల్సి ఉండగా, 7 నెలల్లోనే రూ.67,283 కోట్ల రుణాలు తీసుకుంది.