News January 30, 2025

జనగామ: నోడల్ అధికారుల పాత్ర కీలకం: కలెక్టర్

image

రాబోయే గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల నిర్వహణ కోసం నియమించిన నోడల్ అధికారులతో జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ బుధవారం రివ్యూ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. అధికారులందరూ వారికి కేటాయించిన అంశాలపై పూర్తిగా అవగాహన కలిగి ఉండి ఎలాంటి పొరపాట్లకు తావివ్వకుండా గ్రామ పంచాయతీ ఎన్నికలు విజయవంతంగా నిర్వహించాలన్నారు.

Similar News

News November 16, 2025

ఓట్ల కోసం ప్రపంచ బ్యాంకు నిధులు మళ్లింపు: PK

image

బిహార్‌లో ఓటమి తర్వాత JSP చీఫ్ ప్రశాంత్ కిశోర్ NDAపై తీవ్ర ఆరోపణలు చేశారు. అభివృద్ధి ప్రాజెక్టుల కోసం ప్రపంచ బ్యాంకు కేటాయించిన రూ.14,000 కోట్లను ఎన్నికల సమయంలో మళ్లించారని ఆరోపించారు. వాటిని మహిళల ఖాతాల్లోకి రూ.10వేల చొప్పున జమ చేశారన్నారు. జూన్ నుంచి ఎన్నికల షెడ్యూల్ ప్రకటించే వరకు ప్రభుత్వం ఓట్ల కోసం రూ.40 వేల కోట్లు ఖర్చు చేసిందని ఆరోపించారు. దీనిపై EC దర్యాప్తు చేయాలని డిమాండ్ చేశారు.

News November 16, 2025

ఆకర్షణీయమైన ప్రకటనలతో సైబర్ మోసాలు: సీపీ

image

తక్కువ పెట్టుబడితో అధిక లాభాలు వస్తాయని చెప్పే ఆకర్షణీయమైన ప్రకటనల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని CP సునీల్ దత్ అన్నారు. టెలిగ్రామ్, ఫేస్బుక్, ఇమెయిల్ ద్వారా లింక్ పంపుతూ.. మోసపూరిత వాగ్దానాలతో చేసి డబ్బు బదిలీ చేయించుకుని మోసం చేశారని పలు ఫిర్యాదులు వస్తున్నాయని చెప్పారు. ఎవరైనా వీడియో కాల్, వాట్సాప్, మెసేజ్ ద్వారా పెట్టుబడి పెట్టమని ఒత్తిడి చేస్తే వెంటనే కాల్ కట్ చేసి పిర్యాదు చేయాలన్నారు.

News November 16, 2025

షాద్‌నగర్: ‘నిందితులను తక్షణమే అరెస్టు చేయాలి’

image

షాద్‌నగర్ సమీపంలోని ఎల్లంపల్లి గ్రామ యువకుడు రాజశేఖర్ హత్యను బహుజన్ సమాజ్ పార్టీ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్ ఖండించారు. ఆయన మాట్లాడుతూ.. రాజశేఖర్‌ను కిడ్నాప్ చేసి హత్య చేసిన నిందితులను తక్షణమే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. హత్యకు ముందు మృతుడిని నిందితులు కిడ్నాప్ చేస్తే కుటుంబ సభ్యులు 100 ద్వారా పోలీసులకు సమాచారం ఇచ్చినా ఎందుకు రక్షించలేదని ప్రశ్నించారు.