News October 31, 2024

జనగామ: పండుగ పూట విషాదం.. రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి

image

జనగామ జిల్లాలో పండగ పూట విషాదం జరిగింది. రఘునాథపల్లి మండలంలో గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. స్థానికులు తెలిపిన వివరాలు.. రఘునాథపల్లి మండలం గోవర్ధనగిరికి చెందిన సంపత్ నారాయణ రెడ్డి(52), లింగాల ఘనపురం మండలం నవాబుపేటకు చెందిన చారి ద్విచక్రవాహనంపై వెళ్తున్నారు. గోవర్ధనగిరి క్రాస్ సమీపంలో గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. వారు అక్కడికక్కడే మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు.

Similar News

News November 2, 2025

గీసుకొండ: ఆర్థిక ఇబ్బందులతో ఆటో డ్రైవర్ ఆత్మహత్య

image

గీసుకొండ మండలం మొగిలిచర్లలో ఆర్థిక ఇబ్బందులను తట్టుకోలేక అప్ప నాగరాజు (34) అనే ఆటో డ్రైవర్ చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేశారు. కుటుంబ పరిస్థితులు దిగజారడంతో మనస్తాపానికి గురై ఈ దారుణానికి పాల్పడినట్లు తెలుస్తోంది.

News November 2, 2025

సంగెం: గుంతలో పడి వృద్ధుడి మృతి

image

సంగెం మండలం లోహిత గ్రామంలోని నల్లాల గేట్‌వాల్ సమీపంలో ఉన్న గుంతలో పడి గుర్తు తెలియని వృద్ధుడు (సుమారు 60 ఏళ్లు) మృతి చెందాడు. స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. మృతుడి గుర్తింపు కోసం పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

News November 2, 2025

వరంగల్: కబ్జాలతో కష్టాలు

image

వరంగల్ నగరాన్ని వరద ముంచెత్తింది. దీనికి ప్రధాన కారణం వర్షం కాదని, నాలాలు, కాలువలు, చెరువులపై జరుగుతున్న ఆక్రమణలేనని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఒకప్పుడు నగరానికి అందాన్ని తెచ్చిన 170కి పైగా చెరువులు, కుంటలు ఇప్పుడు అర్ధభాగం వరకు మాయం అయ్యాయని, మురికి కాలువలపై కొందరు అక్రమార్కులు భవనాలు, షాపులు నిర్మించుకుని ప్రజా భద్రతను సవాల్ చేస్తున్నారని పలువురు ఆరోపిస్తున్నారు.