News February 5, 2025
జనగామ: పది ఫలితాల్లో ఉన్నత శ్రేణిలో ఉత్తీర్ణత సాధించాలి: కలెక్టర్

రఘునాథపల్లి మండలంలోని ఖిలాషాపూర్లో గల కేజీబీవీ పాఠశాలను జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ సందర్శించి, ఆకస్మిక తనిఖీ చేపట్టారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. పది ఫలితాల్లో ఉన్నత శ్రేణిలో ఉత్తీర్ణత సాధించాలని, ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని, మంచిగా నిద్రించాలని, సమయానికి ఆహారాన్ని తీసుకోవాలని, తద్వారా చదువుపై మరింత ఆసక్తి కలుగుతుందని సూచించారు.
Similar News
News December 2, 2025
ఎన్నికల ఖర్చులకు కొత్త ఖాతా తప్పనిసరి: కలెక్టర్ తేజస్

గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు తమ ఎన్నికల వ్యయ వివరాల నమోదు కోసం తప్పనిసరిగా నూతన బ్యాంకు ఖాతా తెరవాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ తేజస్ స్పష్టం చేశారు. ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ప్రతి అభ్యర్థి ప్రత్యేక ఖాతా కలిగి ఉండాలన్నారు. మూడో విడతలో నామినేషన్ వేయాలనుకునే వారు ముందుగానే కొత్త అకౌంట్ తీసుకుంటే నామినేషన్ ప్రక్రియ సులభమవుతుందని కలెక్టర్ సూచించారు.
News December 2, 2025
‘పాలమూరు ప్రాజెక్టులను గాలికొదిలేశారు’

సీఎం రేవంత్ రెడ్డికి చిత్తశుద్ధిఉంటే పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతలు పూర్తిచేసి సాగునీరు ఇవ్వాలని మాజీమంత్రి నిరంజన్ రెడ్డి డిమాండ్ చేశారు. మక్తల్ బహిరంగ సభలో సీఎం చేసిన వ్యాఖ్యలపై నిరంజన్ రెడ్డి స్పందించారు. మాటలు కోటలు దాటుతున్నాయని, రెండేళ్ల పాలనలో ఒక్క పని కూడా చేసింది లేదని విమర్శించారు. రైతులను గాలికి వదిలేసి బోనస్ అని బోగస్ మాటలతో మభ్యపెడుతున్నారని ఎద్దేవా చేశారు.
News December 2, 2025
ఐఐసీటీ హైదరాబాద్లో ఉద్యోగాలు

హైదరాబాద్లోని CSIR-<


