News March 9, 2025

జనగామ: పదో తరగతి పరీక్షలకు 41 పరీక్ష కేంద్రాలు

image

ఈనెల 21 నుంచి ప్రారంభం కానున్న పదో తరగతి వార్షిక పరీక్షలకు జనగామ జిల్లాలో 41 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. జనగామ జిల్లా కేంద్రంతో పాటు మండల కేంద్రాల్లోని అన్ని వసతులున్న పాఠశాలలను కేంద్రాలుగా గుర్తించారు. మరో 11 రోజుల్లో పరీక్షలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ఆయా కేంద్రాల్లో అవసరమగు ఏర్పాట్లూ ముమ్మరం చేశారు.

Similar News

News February 23, 2026

ఆదిలాబాద్: 67 మంది దరఖాస్తు.. కలెక్టరేట్‌లో ఇంటర్వ్యూలు

image

అర్హులైన లబ్ధిదారులను ఎంపిక చేసి యూనిట్లను పంపిణీ చేయడం జరుగుతుందని ఆదిలాబాద్ కలెక్టర్ రాజర్షిషా అన్నారు. ‘రేవంత్ అన్న కా సహారా – మిస్కినో కే లియే’ పథకం కింద సోమవారం కలెక్టరేట్లో జిల్లా స్థాయి స్క్రీనింగ్ కమ్ సెలెక్షన్ కమిటీ (DLSSC) సమక్షంలో మోపెడ్ వాహనాల పంపిణీ కోసం దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఇంటర్వ్యూలు నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా ఈపథకానికి మొత్తం 67 మంది దరఖాస్తు చేసుకున్నారన్నారు.

News February 23, 2026

‘గోదావరి పుష్కరాల ఏర్పాట్లపై ప్రతిపాదనలు అందజేయాలి’

image

గోదావరి పుష్కరాలకు అవసరమైన అన్ని ఏర్పాట్లపై సమగ్ర ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (దేవాదాయ) శైలజ రామయ్యర్ ఆదేశించారు. సోమవారం హైదరాబాద్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి నదీ తీర జిల్లాల కలెక్టర్లతో సమీక్షించారు. భక్తులకు ఇబ్బందులు కలగకుండా పకడ్బందీ చర్యలు తీసుకోవాలని సూచించారు. జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ పాల్గొని పుష్కరాలను విజయవంతంగా నిర్వహిస్తామని వివరించారు.

News February 23, 2026

బాపట్ల: ఈతకు వెళ్లి ఇద్దరు యువకుల గల్లంతు

image

బాపట్ల-అప్పికట్ల రహదారిలోని యారకాలువ వంతెన వద్ద సోమవారం విషాదం చోటుచేసుకుంది. మత్స్యపురి కాలనీకి చెందిన ఇద్దరు యువకులు సరదాగా ఈతకు వెళ్లి ప్రమాదవశాత్తు ప్రవాహంలో గల్లంతయ్యారు. స్థానికుల నుంచి సమాచారం అందుకున్న బాపట్ల రూరల్ పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. గల్లంతైన వారికోసం నీటిలో ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.