News March 9, 2025
జనగామ: పదో తరగతి పరీక్షలకు 41 పరీక్ష కేంద్రాలు

ఈనెల 21 నుంచి ప్రారంభం కానున్న పదో తరగతి వార్షిక పరీక్షలకు జనగామ జిల్లాలో 41 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. జనగామ జిల్లా కేంద్రంతో పాటు మండల కేంద్రాల్లోని అన్ని వసతులున్న పాఠశాలలను కేంద్రాలుగా గుర్తించారు. మరో 11 రోజుల్లో పరీక్షలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ఆయా కేంద్రాల్లో అవసరమగు ఏర్పాట్లూ ముమ్మరం చేశారు.
Similar News
News December 20, 2025
ముందస్తు అనుమతి ఉంటేనే న్యూఇయర్ వేడుకలు: పోలీసులు

TG: న్యూఇయర్ వేడుకలకు ముందస్తు అనుమతులు తప్పనిసరని హైదరాబాద్ ట్రాఫిక్ డీసీపీ రాహుల్ హెగ్డే చెప్పారు. ఈవెంట్కు ఎంత మంది వస్తున్నారు? ఎన్ని టికెట్లు అమ్ముతున్నారో ముందే సమాచారమివ్వాలని ఇప్పటికే నిర్వాహకులను ఆదేశించినట్లు తెలిపారు. అటు మద్యం సేవించి వాహనాలు నడిపితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఏవైనా ప్రమాదాలు జరిగితే బాధ్యత ఈవెంట్ నిర్వాహకులదేనని చెప్పారు.
News December 20, 2025
కరీంనగర్: రూ.253.56 కోట్ల మందు తాగేశారు

మూడు విడతల్లో జరిగిన గ్రామపంచాయతీ ఎన్నికల్లో లిక్కర్ ఏరులై పారింది. మొదటి విడత నామినేషన్లు మొదలుకొని చివరి విడత రిజల్ట్ వరకు పల్లెలు మద్యం నిషాతో మత్తెక్కాయి. ఉమ్మడి KNRలో 2025 DEC 1-19 మధ్య కేవలం 19 రోజుల్లో రికార్డు స్థాయిలో రూ.253.56 కోట్ల మద్యం విక్రయాలు జరిగాయి. KNR రూ.89.89 కోట్లు, PDPL రూ.58.30 కోట్లు, SRCL రూ.42.83 కోట్లు, JGTL రూ.62.54 కోట్ల మందు IML డిపో నుండి డిస్పాచ్ అయింది.
News December 20, 2025
సింగరాయకొండ: చెరువులో యువకుడి మృత దేహం లభ్యం

సింగరాయకొండ మండలం సోమరాజు పల్లి పరిధిలోని మర్రి చెరువులో శనివారం గుర్తు తెలియని యువకుడి మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు గ్రామస్థుల సాయంతో మృతదేహాన్ని వెలికి తీయించారు. చనిపోయిన వ్యక్తిని ఎవరైనా గుర్తిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలని ఎస్సై మహేంద్ర తెలిపారు. మృతిని వివరాలు తెలియాల్సి ఉంది.


