News March 10, 2025

జనగామ: పదో తరగతి పరీక్షలకు 41 పరీక్ష కేంద్రాలు

image

ఈనెల 21 నుంచి ప్రారంభం కానున్న పదో తరగతి వార్షిక పరీక్షలకు జనగామ జిల్లాలో 41 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. జనగామ జిల్లా కేంద్రంతో పాటు మండల కేంద్రాల్లోని అన్ని వసతులున్న పాఠశాలలను కేంద్రాలుగా గుర్తించారు. మరో 11 రోజుల్లో పరీక్షలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ఆయా కేంద్రాల్లో ఏర్పాట్లు ముమ్మరం చేశారు.

Similar News

News September 16, 2025

ప్రజా పాలన దినోత్సవానికి అన్ని ఏర్పాట్లు పూర్తి: కలెక్టర్

image

జిల్లా కేంద్రంలోని ఐడిఓసీ కార్యాలయంలో బుధవారం జరిగే ప్రజాపాలన దినోత్సవానికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని కలెక్టర్ రాహుల్ శర్మ తెలిపారు. ఉదయం 10 గంటలకు ముఖ్య అతిథి జాతీయ జెండాను ఆవిష్కరించి ప్రసంగిస్తారని చెప్పారు. ఈ కార్యక్రమానికి అధికారులు, సిబ్బంది సమయానికి హాజరు కావాలని ఆదేశించారు.

News September 16, 2025

కొడంగల్: 3న కొడంగల్‌కు సీఎం రేవంత్ రెడ్డి.!

image

రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి అక్టోబర్ 3న కొడంగల్‌కు రానున్నారు. సొంత గ్రామం కొండారెడ్డిపల్లిలో దసరా సంబరాల తర్వాత కొడంగల్ వెళ్లడం ఆయన ఆనవాయితీగా చేసుకున్నారు. పార్టీ శ్రేణులతో కలిసి మాటామంతి, నియోజకవర్గ ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేయనున్నట్లు సమాచారం.

News September 16, 2025

భద్రకాళి ఆలయంలో హుండీల లెక్కింపు

image

వరంగల్ భద్రకాళి ఆలయంలో హుండీ లెక్కింపు మంగళవారం నిర్వహించారు. ఈ లెక్కింపులో ఆలయానికి రూ. 61,58,999 ఆదాయం లభించింది. నగదుతో పాటు 316 యూఎస్‌ఏ డాలర్లు, 15 యూఏఈ దిరమ్స్‌తో పాటు ఇతర విదేశీ కరెన్సీ కూడా వచ్చాయి. ఈ మొత్తాన్ని బ్యాంకులో జమ చేశారు.