News March 10, 2025

జనగామ: పదో తరగతి పరీక్షలకు 41 పరీక్ష కేంద్రాలు

image

ఈనెల 21 నుంచి ప్రారంభం కానున్న పదో తరగతి వార్షిక పరీక్షలకు జనగామ జిల్లాలో 41 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. జనగామ జిల్లా కేంద్రంతో పాటు మండల కేంద్రాల్లోని అన్ని వసతులున్న పాఠశాలలను కేంద్రాలుగా గుర్తించారు. మరో 11 రోజుల్లో పరీక్షలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ఆయా కేంద్రాల్లో ఏర్పాట్లు ముమ్మరం చేశారు.

Similar News

News November 15, 2025

మోడల్ సిటీగా శ్రీసిటీ విస్తరణ: CBN

image

AP: మరో 50 కంపెనీల ఏర్పాటుకు వీలుగా 6వేల ఎకరాలతో శ్రీసిటీని విస్తరిస్తామని CBN తెలిపారు. 1.5 లక్షల ఉద్యోగాలతో ఇది మోడల్ సిటీగా మారుతుందన్నారు. బెల్జియం, జపాన్, UK, జర్మనీ, ఆస్ట్రేలియా తదితర దేశాల హెల్త్ కేర్, ఎలక్ట్రానిక్స్, ఆటోమొబైల్, ఇంజినీరింగ్ కంపెనీలకు అనుమతులిచ్చామని పేర్కొన్నారు. త్వరలో ఇక్కడ ఎయిర్ స్ట్రిప్ ఏర్పాటుచేస్తామని చెప్పారు. CII సదస్సులో 5 యూనిట్లను వర్చువల్‌గా CM ప్రారంభించారు.

News November 15, 2025

ముగిసిన టీమ్ ఇండియా తొలి ఇన్నింగ్స్

image

సౌతాఫ్రికాతో ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరుగుతున్న తొలి టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో టీమ్ ఇండియా 189/9 పరుగులకు పరిమితమైంది. గిల్ రిటైర్డ్ హర్ట్‌గా వెనుదిరిగిన విషయం తెలిసిందే. KL రాహుల్(39), సుందర్(29) పంత్(27), జడేజా(27) మినహా ఎవరూ పెద్దగా రాణించలేదు. SA బౌలర్లలో సిమోన్‌ 4, జాన్‌సెన్‌ 3 వికెట్లు, మహరాజ్, బోష్‌ చెరో వికెట్ పడగొట్టారు. ఇండియాకు 30 పరుగుల స్వల్ప ఆధిక్యం దక్కింది.

News November 15, 2025

రెండో రోజు CII సమ్మిట్ ఫొటో గ్యాలరీ

image

AP: విశాఖలో CII సమ్మిట్ రెండోరోజు కొనసాగుతోంది. వివిధ దేశాల నుంచి వచ్చిన పారిశ్రామికవేత్తలతో సదస్సు ప్రాంగణంలో సందడి వాతావరణం నెలకొంది. పరిశ్రమల ఏర్పాటుకు వచ్చే అధినేతలకు సంప్రదాయ నృత్యాలతో కళాకారులు స్వాగతం పలుకుతున్నారు. సమ్మిట్‌లోని పలు స్టాల్స్‌లో ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్స్ అందరినీ ఆకట్టుకుంటున్నాయి. ఏపీ రాజధాని అమరావతి నమూనాను ఆసక్తిగా తిలకిస్తున్నారు. యువత కూడా ఉత్సాహంగా హాజరవుతున్నారు.