News March 10, 2025

జనగామ: పదో తరగతి పరీక్షలకు 41 పరీక్ష కేంద్రాలు

image

ఈనెల 21 నుంచి ప్రారంభం కానున్న పదో తరగతి వార్షిక పరీక్షలకు జనగామ జిల్లాలో 41 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. జనగామ జిల్లా కేంద్రంతో పాటు మండల కేంద్రాల్లోని అన్ని వసతులున్న పాఠశాలలను కేంద్రాలుగా గుర్తించారు. మరో 11 రోజుల్లో పరీక్షలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ఆయా కేంద్రాల్లో ఏర్పాట్లు ముమ్మరం చేశారు.

Similar News

News December 3, 2025

మేడారం జాతరకు 70 కొత్త ట్రాన్స్‌ఫార్మర్లు: ఎన్పీడీసీఎల్ సీఎండి

image

మేడారం జాతరలో నిరంతరాయంగా విద్యుత్ సరఫరా కోసం 70 కొత్త ట్రాన్స్‌ఫార్మర్లను ఏర్పాటు చేసినట్లు ఎన్పీడీసీఎల్ సీఎండీ వరుణ్ రెడ్డి అన్నారు. మేడారంలో జరుగుతున్న పనులను ఆయన పరిశీలించారు. నార్లాపూర్‌లోని 33/11కేవీ సబ్ స్టేషన్ అందుబాటులోకి వచ్చింది అన్నారు. జంపన్నవాగు వద్ద ఆరు టవర్లను ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. వనదేవతల గద్దెల వద్ద నిరంతర విద్యుత్ కోసం కవర్డ్ కండక్టర్‌ను ఏర్పాటు చేస్తామని అన్నారు.

News December 3, 2025

ఎన్ని నామినేషన్లు వచ్చాయి?ఎన్ని రిజక్ట్ చేశారు?: ఇలా త్రిపాఠి

image

నామినేషన్ పత్రాల పరిశీలనను నిబంధనలకు అనుగుణంగా, పారదర్శకంగా నిర్వహించాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి చెప్పారు. బుధవారం ఆమె నిడమనూరు, ముకుందాపురం గ్రామపంచాయతీలలో నామినేషన్ల పరిశీలన కార్యక్రమాన్ని పరిశీలించారు. ఎన్ని నామినేషన్లు వచ్చాయని ? ఎన్ని రిజక్ట్ చేశారని? అధికారులతో అడిగి తెలుసుకున్నారు. కుల ధ్రువీకరణ పత్రాలు, బ్యాంక్ అకౌంట్ బుక్స్‌పై ఆరా తీశారు.

News December 3, 2025

రైతుల ఖాతాల్లో రూ.7,887కోట్లు జమ: ఉత్తమ్

image

వరి సేకరణలో TG అగ్రస్థానంలో కొనసాగుతోందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. ‘ఇప్పటివరకు 41.6 లక్షల టన్నుల ధాన్యం సేకరించాం. 48hrsలో ₹7,887Cr చెల్లించాం. 8,401 PPCలలో 7.5 లక్షల మంది రైతులకు లబ్ధి చేకూరింది. సన్న రకాలకు ₹314Cr బోనస్ చెల్లించాం. అటు APలో ఇప్పటివరకు 11.2L టన్నులు సేకరించారు. 1.7లక్షల మందికి రూ.2,830Cr చెల్లించారు. AP కంటే TG స్కేల్ 4 రెట్లు ఎక్కువ’ అని ట్వీట్ చేశారు.