News January 31, 2025

జనగామ: పదో తరగతి విద్యార్థులకు రేపటి నుంచి స్నాక్స్

image

ప్రభుత్వ స్కూళ్లలో పదో తరగతి చదివే విద్యార్థులకు రాష్ట్ర సర్కార్ తీపి కబురు చెప్పింది. ఫిబ్రవరి 1 నుంచి మార్చి 20 వరకు ఈవెనింగ్ స్నాక్స్ అమలు చేయనుంది. ఇందుకు ఒక్కో విద్యార్థి కోసం రూ.15 చొప్పున ఖర్చు చేయనుంది. పల్లీపట్టి, బిస్కెట్లు, పకోడీ తదితరాలను అందించనున్నారు. జిల్లాలోని 3,068 మంది విద్యార్థులను గాను రూ.17,48,760 నిధులు మంజూరయ్యాయి. వీటిని స్కూల్ మేనేజ్‌మెంట్ కమిటీల ఖాతాల్లో జమ చేయనున్నారు.

Similar News

News December 13, 2025

MECON లిమిటెడ్‌లో ఉద్యోగాలకు నోటిఫికేషన్

image

మెటలర్జికల్& ఇంజినీరింగ్ కన్సల్టెంట్స్ లిమిటెడ్ (<>MECON <<>>LTD) 44 Jr ఇంజినీర్, Jr ఆఫీసర్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హతగల వారు జనవరి 6వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి డిప్లొమా(మెకానికల్, సివిల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్), BBA, డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. పర్సనల్ ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://careers.meconlimited.co.in/

News December 13, 2025

అతి శక్తిమంతమైన 18 కొండలు

image

మణికంఠుడు 18 కొండలను దాటి శబరిమలలో కొలువయ్యాడని భక్తులు నమ్ముతారు. ఆ కొండలు దాటిన భక్తులకు మోక్షం లభిస్తుందని పండితులు చెబుతారు. ఆ 18 మెట్లు: 1.పొన్నాంబళమేడు 2.గౌదవమల 3.నాగమల 4.సుందరమల 5.చిట్టంబలమల 6.దైలాదుమల 7.శ్రీపాదమల 8.ఖలిగిమల 9.మాతంగమల 10.దేవరమల 11.నీల్కల్ మల 12.దాలప్పార్ మల 13.నీలిమల 14.కరిమల 15.పుత్తుశేరిమల 16.కాళైకట్టి మల 17.ఇంజప్పార మల 18.శబరిమల. <<-se>>#AyyappaMala<<>>

News December 13, 2025

సూర్యాపేట: రెండో విడతలో 23 గ్రామ పంచాయతీలు ఏకగ్రీవం

image

సూర్యాపేట జిల్లాలో రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికలు 8మండలాల్లో జరగనున్నాయి. సూర్యాపేట నియోజకవర్గానికి చెందిన 2 మండలాలు, కోదాడ నియోజకవర్గానికి చెందిన 6మండలాలు ఉన్నాయి. మొత్తం 181గ్రామ పంచాయతీలకు గాను 23గ్రామ పంచాయతీలు ఏకగ్రీవంగా ఎన్నికయ్యాయి. 1,628వార్డులు ఉండగా, అందులో 339 వార్డులు ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన గ్రామ పంచాయతీలు, వార్డులకు రేపు పోలింగ్ జరగనుంది.