News March 8, 2025
జనగామ: పదో తరగతి విద్యార్థులు సెక్టార్ల వారీగా

జనగామ జిల్లా వ్యాప్తంగా ఈ ఏడాది 6,238 మంది విద్యార్థులు పరీక్ష రాయనున్నారు. ఇందులో బాలురు 2,996 మంది, 3,242 మంది బాలికలు పరీక్షకు రాయనున్నారు. ప్రైవేట్ పాఠశాలల నుంచి 1,660 మంది పరీక్ష రాయనున్నారు. ఎయిడెడ్ 15, ఆశ్రమ 126, బీసీ వెల్ఫేర్ 356, ప్రభుత్వ 84, జిల్లా పరిషత్ 2,275, కేజీబీవీ 431, ఆదర్శ 91, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ సంక్షేమ గురుకులాల నుంచి 512 మంది పరీక్ష రాయనున్నారు.
Similar News
News March 27, 2025
ఇంజనీరింగ్ కళాశాలను కరీంనగర్లోనే ఏర్పాటు చేయాలి: ఏబీవీపీ

శాతవాహన యూనివర్సిటీకి నూతనంగా ఇంజనీరింగ్, లా కళాశాలలు మంజూరు కాగా.. ఇంజనీరింగ్ కలశాలను హుస్నాబాద్కు తరలిస్తూ అధికారులు చర్యలు తీసుకోవడం సరికాదని ఏబీవీపీ నాయకులు శాతవాహన యూనివర్సిటీలో వీసీకి వినతిపత్రం అందజేశారు. ఇంజనీరింగ్ కళశాలను కరీంనగర్లో ఏర్పాటు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఏబీవీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి రాకేష్, అజయ్, విష్ణు, అంజన్న, కిరణ్మయి, నందు ఉన్నారు.
News March 27, 2025
మంచిర్యాల: ఈ నెల 28న మినీ జాబ్ మేళా

మంచిర్యాలలోని మిమ్స్ డిగ్రీ కాలేజీలో ఈ నెల 28న ఉదయం10.30గంటలకు మినీ జాబ్ మేళా నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధి కల్పనాధికారి రవికృష్ణ తెలిపారు. అపోలో ఫార్మసీ మంచిర్యాల, గోదావరిఖని, హైదరాబాద్లో ఫార్మసిస్ట్ 40, ట్రైనింగ్ ఫార్మాసిస్ట్ 20, ఫార్మసీ అసిస్టెంట్30, రిటైల్ ట్రైనీ అసిస్టెంట్10ఖాళీలు ఉన్నాయన్నారు.18నుంచి 35లోపు వయస్సు, అర్హత కలిగిన నిరుద్యోగులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
News March 27, 2025
2 రోజులు సెలవులు

TG: రంజాన్ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం రెండు రోజులు సెలవులు మంజూరు చేసింది. తెలంగాణ క్యాలెండర్ ప్రకారం మార్చి 31న (సోమవారం) ఈద్ ఉల్ ఫితర్తో పాటు ఆ తర్వాతి రోజు ఏప్రిల్ 1న (మంగళవారం) కూడా హాలిడే ఇచ్చింది. ఇక మార్చి 28న జుమాతుల్-విదా, షబ్-ఎ-ఖాదర్ సందర్భంగా ఆప్షనల్ హాలిడే ఇచ్చింది. ఆ రోజు మైనారిటీ విద్యాసంస్థలకు సెలవు ఉండనుంది. అటు ఏపీలో మార్చి 31న మాత్రమే సెలవు ఇచ్చారు.