News February 1, 2025

జనగామ: పనులు త్వరితగతిన పూర్తి చేయాలి: కలెక్టర్

image

జనగామ జిల్లాలోని పాలకుర్తి మండలం ధర్దేపల్లి, విస్నూర్, చెన్నూరు పాఠశాలలు, అంగన్వాడి కేంద్రాలను అదనపు కలెక్టర్(స్థానిక సంస్థలు) పింకేశ్ కుమార్ సందర్శించి పరిశీలించారు. క్షేత్రస్థాయిలో అధికారులు పర్యటించి నాణ్యతను పరిశీలించాలన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. పనులు పూర్తయినట్లు అధికారులు ఫోటోలతో సహా నివేదికలు అందించాలన్నారు.

Similar News

News November 5, 2025

CCRHలో 90 పోస్టులు

image

సెంట్రల్ కౌన్సిల్ ఫర్ రీసెర్చ్ ఇన్ హోమియోపతి (<>CCRH<<>> )90 పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది. అర్హతగలవారు NOV 26 వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి డిప్లొమా, B.Lisc, ఇంటర్, టెన్త్, BSc(నర్సింగ్), ఎంఫార్మసీ, MSc, MS, MD, DMLT, MLT ఉత్తీర్ణులైన అభ్యర్థులు అర్హులు. రాత పరీక్ష, స్కిల్ టెస్ట్ ద్వారా ఎంపిక చేస్తారు. దరఖాస్తు ఫీజు రూ.500, SC, ST, PWBD, మహిళలకు ఫీజు లేదు. వెబ్‌సైట్: ccrhindia.ayush.gov.in

News November 5, 2025

భార్యాభర్తల మధ్య అనుబంధాల కోసం..

image

కార్తీక పౌర్ణమి రోజున కేదారేశ్వర వ్రతాన్ని ఆచరిస్తే భార్యాభర్తల మధ్య అనుబంధం బలపడుతుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం. ఈ వ్రతంలో భాగంగా మర్రి చెట్టు ఊడలను తోరణాలుగా, మర్రి పళ్లను బూరెలుగా, ఆకులను విస్తర్లుగా ఉపయోగించి పూజించడం సంప్రదాయం. నేడు శివాలయంలో దీపారాధన చేయడం వల్ల ముక్కోటి దేవతల పూజాఫలం, పుణ్య నదులలో స్నానం చేసిన ఫలితం దక్కుతుందని, ఇహపరలోకాలలో సుఖసౌఖ్యాలు, ముక్తి లభిస్తాయని పండితులు అంటున్నారు.

News November 5, 2025

సిరిసిల్ల కవి ‘జిగిరి’ నవలకు దేశవ్యాప్త గుర్తింపు

image

సిరిసిల్లకు చెందిన ప్రముఖ రచయిత పెద్దింటి అశోక్ కుమార్ రచించిన ‘జిగిరి’ నవల దేశవ్యాప్తంగా విశేష గుర్తింపు పొందింది. ఈ నవలను ఇంగ్లిష్, హిందీ, కన్నడ, మరాఠీ, తమిళం, బెంగాలీ, ఒడియా, పంజాబీ, సింధీ, మలయాళం తదితర 10 భాషల్లోకి అనువదించారు. ఒడియా, పంజాబీ భాషల్లో 2 సార్లు అనువాదమవ్వడంతో మొత్తం 12 అనువాదాల ఘనతను ఈ నవల సాధించింది. కాగా, తెలుగు సాహిత్యంలో ఒకే నవల ఇన్ని భాషల్లోకి అనువాదం అవ్వడం చాలా అరుదు.