News April 14, 2025

జనగామ: ‘పిల్లలపై నిరంతరం నిఘా ఉంచండి’

image

జిల్లాలో మరికొద్ది రోజుల్లో విద్యార్థులకు 2 నెలల వేసవి సెలవులు రానున్నాయి. దీంతో సెలవుల్లో పిల్లలు నదులు, చెరువుల్లో ఈత కొట్టడానికి వెళ్లి ప్రాణాల మీదకు తెచ్చుకునే అవకాశం ఉంది. కనుక తల్లిదండ్రులు పిల్లల పట్ల కాస్త జాగ్రత్తగా ఉండాలి. వారిపై ఎప్పటికప్పుడు నిఘా ఉంచాలి. అలాగే ఎండలు విపరీతంగా పెరుగుతున్న నేపథ్యంలో పిల్లలు బయటకు వెళ్లకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యాధికారులు సూచిస్తున్నారు.

Similar News

News November 22, 2025

peace deal: ఉక్రెయిన్‌ను బెదిరించి ఒప్పిస్తున్న అమెరికా!

image

రష్యా-ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపేందుకు అమెరికా తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీకి 28 పాయింట్లతో కూడిన <<18346240>>పీస్ ప్లాన్‌<<>>ను అందజేసింది. అయితే దీన్ని అంగీకరించాలని ఉక్రెయిన్‌పై ఒత్తిడి చేస్తున్నట్లు తెలుస్తోంది. లేదంటే నిఘా సమాచారం, ఆయుధాల సరఫరాలను తగ్గిస్తామని బెదిరించినట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. వచ్చే గురువారం లోగా ఒప్పందంపై సంతకం చేయాలని చెప్పినట్లు తెలిపాయి.

News November 22, 2025

Photo: మెరిసిపోతున్న ఢిల్లీని చూశారా?

image

అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం నుంచి తీసిన అద్భుత ఫొటోలను నాసా SMలో షేర్ చేసింది. ఢిల్లీ, టోక్యో, న్యూయార్క్, సింగపూర్ వంటి నగరాలు రాత్రి పూట వెలిగిపోతున్నాయి. ఇవి స్పేస్ నుంచి కనిపించే అత్యంత ప్రకాశవంతమైన అర్బన్ సెంటర్లు అని నాసా క్యాప్షన్ ఇచ్చింది. వాటిలో ఢిల్లీ వ్యూ మాత్రం కళ్లుచెదిరేలా ఉంది. సిటీని విభజిస్తున్న యమునా నది, విద్యుత్ దీపాల వెలుగుల్లో సీతాకోకచిలుకలా అందంగా కనిపిస్తోంది.

News November 22, 2025

NLG: ‘ఉచిత మెట్రిక్‌ స్కాలర్‌షిప్‌లకు దరఖాస్తు చేసుకోండి’

image

నల్గొండ జిల్లాలోని ఎస్సీ విద్యార్థులు వెంటనే ప్రీ-మెట్రిక్ స్కాలర్‌షిప్‌లకు దరఖాస్తు చేసుకోవాలని ఎస్సీడీడీ (SCDD) డిప్యూటీ డైరెక్టర్ శశికళ కోరారు. 9, 10 తరగతులు చదువుతున్న పేద దళిత విద్యార్థులకు ఈ పథకం ద్వారా రూ. 3,500 బ్యాంక్ ఖాతాలో జమ అవుతాయని ఆమె తెలిపారు. అర్హులైన 3080 మంది విద్యార్థులు మీ-సేవ ద్వారా క్యాస్ట్, ఇన్‌కమ్, ఆధార్ వివరాలతో వెంటనే దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.