News January 27, 2025

జనగామ: పురపాలిక ప్రత్యేకాధికారిగా పింకేశ్ కుమార్

image

రాష్ట్ర ప్రభుత్వం పురపాలికల అదనపు బాధ్యతలను ప్రత్యేక అధికారులకు అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ చేసిన నేపథ్యంలో జనగామ పురపాలిక ప్రత్యేకాధికారిగా జిల్లా అదనపు కలెక్టర్ పింకేశ్ కుమార్ సోమవారం మునిసిపల్ కార్యాలయంలో బాధ్యతలను స్వీకరించారు. ఈ సందర్భంగా మునిసిపల్ కమిషనర్, పురపాలిక ప్రత్యేకాధికారిని శాలువాతో సత్కరించి, పుష్పగుచ్ఛాన్ని అందించారు

Similar News

News November 20, 2025

ఫోన్‌పే టాప్!

image

మన దేశంలో యూపీఐ చెల్లింపుల్లో ఫోన్‌పే ఆధిపత్యం కొనసాగుతోంది. 45.47% మార్కెట్ షేర్‌తో అగ్రస్థానంలో ఉంది. ఆ తర్వాత గూగుల్ పే (34.62%), పేటీఎం (7.36%), Navi (2.78%), సూపర్ మనీ (1.28%) ఉన్నాయి. ఫోన్‌పే, గూగుల్ పే కలిపి 80 శాతానికి పైగా మార్కెట్ షేర్‌ను కలిగి ఉండటం విశేషం. BHIM, CRED లాంటి ప్లాట్‌ఫామ్స్ కూడా వినియోగిస్తున్నారు. మరి మీరు ఏది వాడుతున్నారో కామెంట్ చేయండి.

News November 20, 2025

ఐదుగురి జీవితాల్లో వెలుగులు నింపిన ఆటో డ్రైవర్

image

ఎండాడకు చెందిన బొబ్బిలి రమేశ్ ఆటో నడుపుతూ తన ఇద్దరు పిల్లలు, భార్యను పోషిస్తున్నాడు. ఈనెల 10న తన నివాసంపై నుంచి ప్రమాదవశాత్తు కింద పడి తీవ్రంగా గాయపడ్డాడు. తలలో తీవ్ర రక్తస్రావం అయ్యి ఆరోగ్యం క్షీణించడంతో బ్రెయిన్‌డెడ్ అయినట్లు వైద్యులు ప్రకటించారు. కుటుంబ సభ్యులకు అవయవదానంపై అవగాహన కల్పించగా అంగీకరించడంతో అవయవాలను ఐదుగురికి అమర్చనున్నారు. కుటుంబసభ్యుల మంచి మనసును పలువురు మెచ్చుకున్నారు.

News November 20, 2025

పల్నాడు వీర్ల గుడిని నిర్మించింది ముస్లింలని మీకు తెలుసా.?

image

పల్నాడు వీర్ల గుడిని ఔరంగజేబు సైన్యాధిపతులుగా పనిచేసిన జాఫర్, ఫరీదులు నిర్మించినట్లు చరిత్ర చెబుతోంది. నాగులేరు ఒడ్డున గుండ్రాయిలను పొయ్యి కింద వాడుకోగా, ఆగ్రహించిన చెన్నకేశవ స్వామి అవి వీరుల రూపాలని చెప్పాడు. ప్రాయశ్చిత్తంగా వీరుల గుడిని నిర్మించిన ఆ ఇద్దరు సైన్యాధిపతులు, తాము కూడా పూజలు అందుకోవాలనే కోరికతో వీర్ల గుడిలోనే సమాధి అయ్యారు. వారి సమాధులు నేటికీ గుడిలో ఉండటం ఇక్కడి విశేషం.