News July 12, 2024
జనగామ: పెళ్లి కావటం లేదని యువకుడు ఆత్మహత్య

పెళ్లి కావట్లేదు అనే మనస్తాపంతో ఓ యువకుడు పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకున్న ఘటన జనగామ జిల్లా రఘునాథపల్లి మండలంలో జరిగింది. పోలిసుల వివరాల ప్రకారం.. కంచనపల్లి గ్రామానికి చెందిన శ్రీకాంత్(27) కూలీ పనులు చేసుకుంటూ జీవిస్తున్నాడు. ఈ నేపథ్యంలో అతనికి సరైన ఉపాధి లేదని, పెళ్లి సంబంధం కూడా రావడం లేదని మనస్తాపం చెంది పురుగు మందు తాగాడు. జనగామ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు.
Similar News
News November 15, 2025
WGL: ఎన్నికల సంఘం మార్గదర్శకాలు విధిగా అమలు చేయాలి!

ఎన్నికల సంఘం మార్గదర్శకాలు, నియమావళి విధిగా పాటించాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సి.సుదర్శన్ రెడ్డి అన్నారు. తెలంగాణలోని అన్ని ఇఆర్ఓలు, ఏఆర్ఓలతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఓటరు జాబితా ప్రత్యేక తీవ్ర సవరణ కార్యక్రమం పురోగతి, పెండింగ్లో ఉన్న ఎన్నికల సంబంధిత అంశాలపై ఆయన సమీక్షించారు. జీడబ్ల్యూఎంసీ కమిషనర్ చాహత్ భాజ్ పాయ్ పాల్గొన్నారు.
News November 15, 2025
వయోవృద్ధులను గౌరవిద్దాం: WGL కలెక్టర్

అంతర్జాతీయ వయోవృద్ధుల దినోత్సవం వారోత్సవాల్లో భాగంగా జిల్లా సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో వరంగల్ చౌరస్తా నుంచి పోస్ట్ ఆఫీస్ సర్కిల్ వరకు వయోవృద్ధుల వాకథాన్(ర్యాలీ) జరిగింది. కలెక్టర్ సత్య శారద ముఖ్యఅతిథిగా పాల్గొని, జెండా ఊపి ప్రారంభించారు. ఈనెల 19 వరకు జిల్లాలో వారోత్సవాలను నిర్వహిస్తామని కలెక్టర్ తెలిపారు.
News November 15, 2025
WGL: టెన్త్ పరీక్షల ఫీజు గడువు 20 వరకు పొడిగింపు

పదో తరగతి వార్షిక పరీక్షల ఫీజు చెల్లింపు గడువును ఈనెల 20 వరకు పొడిగించినట్లు డీఈఓ రంగయ్య నాయుడు తెలిపారు. రూ.50 అపరాధ రుసుముతో 21 నుంచి 29 వరకు ఫీజులు చెల్లించవచ్చన్నారు. అన్ని సబ్జెక్టులకు రూ.125, మూడు సబ్జెక్టులకు రూ.110, 3 కంటే ఎక్కువైతే రూ.125, వొకేషనల్ వారికి అదనంగా రూ.60 చెల్లించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. ఫీజులు కేవలం www.bse.telangana.gov.inలో లాగిన్ ద్వారా చెల్లించాలని సూచించారు.


