News March 28, 2025
జనగామ: ప్రజలకు ప్రభుత్వం 90శాతం రాయితీ: కలెక్టర్

ప్రభుత్వం 2024-25 ఆర్థిక సంవత్సరానికి రాష్ట్రంలోని అన్ని పట్టణ, స్థానిక సంస్థలకు (ULB) ఆస్తి పన్నుపై 90% బకాయి వడ్డీని మాఫీ చేసే వన్ టైమ్ సెటిల్మెంట్ (OTS) పథకాన్ని విస్తరించిన నేపథ్యంలో.. ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ అన్నారు. వన్టైమ్ సెటిల్మెంట్ కింద ఆస్తి పన్ను చెల్లించే వారికి పన్ను వడ్డీ బకాయిలపై ప్రభుత్వం 90శాతం రాయితీ వస్తుందన్నారు.
Similar News
News November 4, 2025
అనకాపల్లి: ‘స్నాన ఘట్టాల వద్ద భద్రత ఏర్పాట్లు చేయాలి’

కార్తీక పౌర్ణమి సందర్భంగా జిల్లాలో ఈనెల 5న శైవ క్షేత్రాల వద్ద గల స్నాన ఘట్టాలలో భద్రత ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ విజయ కృష్ణన్ అధికారులను ఆదేశించారు. మంగళవారం అనకాపల్లి కలెక్టరేట్ నుంచి పోలీస్, రెవెన్యూ, దేవాదాయ శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలన్నారు. ఎక్కువ సంఖ్యలో భక్తులు వచ్చే ఆలయాల వద్ద క్యూలైన్లు, బారికెడ్లు నిర్మించాలన్నారు.
News November 4, 2025
అభివృద్ధి పనుల్లో నాణ్యతకు ప్రాధాన్యమివ్వాలి: కలెక్టర్

కాళేశ్వరం అభివృద్ధి పనులలో పురోగతి, నాణ్యతకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ అధికారులను ఆదేశించారు. మంగళవారం ఆయన సంబంధిత అధికారులతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. కాళేశ్వరం అభివృద్ధి పనుల వేగాన్ని పెంచాలని, నాణ్యతలో ఎక్కడా రాజీపడరాదని సూచించారు. పెండింగ్ పనులను సమయానికి పూర్తిచేసి నివేదికలు సమర్పించాలని కలెక్టర్ ఆదేశించారు.
News November 4, 2025
అన్నమయ్య: చేపలు పట్టేందుకు వెళ్లి ఇద్దరు మృతి

పెనగలూరు మండలం తిరునంపల్లి గ్రామం సమీపంలోని గుంజనేరు వద్ద విషాదం నెలకొంది. చేపలు పట్టడానికి వెళ్లిన ఇద్దరు వ్యక్తులు నీట మునిగి మృతి చెందారు. మృతులు శీను (47), మల్లికార్జున (37)గా స్థానికులు గుర్తించారు. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి పోలీసులు చేరుకుని మృతదేహాలను బయటకు తీసి రాజంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.


