News March 7, 2025
జనగామ: ప్రశాతంగా మూడో రోజు ఇంటర్ పరీక్షలు

జనగామ జిల్లాలో నేడు (శుక్రవారం) నిర్వహించిన ఇంటర్మీడియట్ జనరల్, వొకేషనల్ ప్రథమ సంవత్సరం పరీక్షలకు 186 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారని జిల్లా ఇంటర్మీడియట్ విద్య శాఖ అధికారి జితేందర్ రెడ్డి తెలిపారు. మొత్తం 4,355 విద్యార్థులకు గాను 4,169 విద్యార్థులు పరీక్షకు హాజరయ్యారు. డీఐఈవో, స్క్వాడ్ బృందం పలు పరీక్షా కేంద్రాలను తనిఖీ చేశారు.
Similar News
News February 23, 2026
పవర్ప్లేలో వికెట్లు పారేసుకున్నాం.. ఓటమిపై సూర్య కామెంట్స్!

SAతో భారీ ఓటమికి బౌలర్లు కారణం కాదని కెప్టెన్ సూర్య వారిని వెనకేసుకొచ్చారు. 188 రన్స్ ఛేజింగ్లో పవర్ప్లేలోనే కీలక వికెట్లు కోల్పోవడం టీమ్ఇండియా కొంపముంచిందన్నారు. బౌలింగ్లో బుమ్రా, అర్ష్దీప్ రాణించినా.. మిగతా వారు ధారాళంగా రన్స్ ఇచ్చారు. అయినప్పటికీ బ్యాటర్ల వైఫల్యమే ఓటమికి ప్రధాన కారణమని సూర్య తేల్చేశారు. జింబాబ్వేతో జరిగే తదుపరి మ్యాచ్లో బౌన్స్ బ్యాక్ అవుతామని ధీమా వ్యక్తం చేశారు.
News February 23, 2026
ఎటపాకలో నాలుగు కాళ్ల కోడిపిల్ల జననం

ఎటపాక మండలం సీతాపురంలో వింత చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన చుక్కా కుమారి పెంచుతున్న కోడి పెట్టిన గుడ్లలో ఒక దాంట్లోంచి నాలుగు కాళ్లతో పుట్టి అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. ఈ విషయం తెలిసిన వెంటనే చుట్టుపక్కల గ్రామాల ప్రజలు సీతాపురానికి చేరుకుని నాలుగు కాళ్ల కోడిపిల్లను ఆసక్తిగా వీక్షిస్తున్నారు. ప్రస్తుతం కోడిపిల్ల ఆరోగ్యంగా ఉందని యజమాని తెలిపారు.
News February 23, 2026
ఘట్కేసర్: సైబర్ మోసం.. కూలీ ఖాతా ఖాళీ!

కూలి చేసుకుంటూ పూటగడిపే వారి ఖాతాలపై కూడా కన్నేస్తున్నారు సైబర్ నేరగాళ్లు. యాదాద్రి-భువనగిరి జిల్లా రాజపేట మండలం బొందుగుల్లకు చెందిన బోదాసు విష్ణు (38) ఘట్కేసర్లోని తన సోదరి ఇంటికి వచ్చాడు. ఈ నెల 12న అతడి SBI ఖాతా నుంచి 3 విడతల్లో మొత్తం రూ.41,799 డెబిట్ అయ్యాయి. సైబర్ కేటుగాళ్ల చేతివాటమే అనుకుని, 1930కు ఫిర్యాదు చేయగా రూ.800 హోల్డ్లో పెట్టారు. ఘట్కేసర్ PSలో కంప్లైంట్ చేయడంతో కేసు నమోదైంది.


