News March 7, 2025
జనగామ: ప్రశాతంగా మూడో రోజు ఇంటర్ పరీక్షలు

జనగామ జిల్లాలో నేడు (శుక్రవారం) నిర్వహించిన ఇంటర్మీడియట్ జనరల్, వొకేషనల్ ప్రథమ సంవత్సరం పరీక్షలకు 186 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారని జిల్లా ఇంటర్మీడియట్ విద్య శాఖ అధికారి జితేందర్ రెడ్డి తెలిపారు. మొత్తం 4,355 విద్యార్థులకు గాను 4,169 విద్యార్థులు పరీక్షకు హాజరయ్యారు. డీఐఈవో, స్క్వాడ్ బృందం పలు పరీక్షా కేంద్రాలను తనిఖీ చేశారు.
Similar News
News December 6, 2025
‘జీవీఎంసీ స్థాయి సంఘంలో అభివృద్ధి పనులకు ఆమోదం’

విశాఖపట్నం నగరపాలక సంస్థ స్థాయి సంఘం సమావేశంలో పలు అభివృద్ధి పనులకు సభ్యులు ఆమోదం తెలిపినట్లు నగర మేయర్, స్థాయి సంఘం చైర్పర్సన్ పీలా శ్రీనివాసరావు పేర్కొన్నారు. శనివారం ఆయన జీవీఎంసీ ప్రధాన కార్యాలయంలోని సమావేశ మందిరంలో స్థాయి సంఘం సమావేశం నిర్వహించారు. సమావేశంలో మొత్తం 287 అంశాలై చర్చించగా, 222 ప్రధాన అంశాలు, 30 టేబుల్ అజెండాలకు ఆమోదం లభించిందన్నారు.
News December 6, 2025
రెడ్ క్రాస్ వ్యవస్థను బలోపేతం చేయాలి: కలెక్టర్

జిల్లాలో రక్త కొరత రాకుండా రక్తదానంపై అవగాహన కార్యక్రమాలు, ర్యాలీలు నిర్వహించాలని కలెక్టర్ జి.రాజకుమారి కమిటీ సభ్యులను సూచించారు. ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా కమిటీ నూతన సమావేశం నిర్వహించారు. జిల్లాలోని ప్రతీ పాఠశాలలో జూనియర్ రెడ్ క్రాస్ యూనిట్లను, ప్రతీ కళాశాలలో యూత్ రెడ్ క్రాస్ బృందాలను ఏర్పాటు చేసి దాదాపు లక్ష మంది విద్యార్థులను రెడ్ క్రాస్ సభ్యులుగా నమోదు చేసుకోవాలని సూచించారు.
News December 6, 2025
రేపు జాగ్రత్త.. ఈ జిల్లాలకు YELLOW ALERT

TG: రాష్ట్రంలో మళ్లీ చలి తీవ్రత పెరుగుతోంది. వచ్చే 3 రోజులు కనిష్ఠ ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2-3డిగ్రీలు తక్కువగా నమోదయ్యే అవకాశం ఉందని HYD వాతావరణ కేంద్రం వెల్లడించింది. రేపు ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో శీతలగాలులు వీస్తాయని పేర్కొంది. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.


