News March 4, 2025

జనగామ: ప్రైవేట్ వైద్యుడి ARREST

image

టిప్పు సుల్తాన్ వారసుడినని, ఉద్యోగాలు ఇప్పిస్తానని నమ్మించి కోట్లు కాజేసిన ఓ ప్రైవేట్ వైద్యుడిని జనగాం పోలీసులు మంగళవారం అరెస్ట్ చేసినట్లు తెలిపారు. తమిళనాడుకు చెందిన అబ్దుల్ రహీద్ సుల్తాన్ రాజా ప్రస్తుతం టిప్పు సుల్తాన్ అనే ట్రస్ట్‌కు ఛైర్మన్‌గా ఉన్నాడు. అలాగే జనగామలో కేకే పేరుతో ఓ ప్రైవేట్ ఆసుపత్రిని నడిపిస్తున్నాడు. సుమారు రూ.55 కోట్లకు పైగా ప్రజలను మోసం చేశారని పలువురు చెబుతున్నారు. 

Similar News

News March 5, 2025

రామారెడ్డి ఆలయంలో హీరో శ్రీకాంత్ సందడి

image

రామారెడ్డి మండలం ఈస్సన్నపల్లి గ్రామంలో గల కాలభైరవ స్వామి ఆలయంలో సినీ నటుడు శ్రీకాంత్ దంపతులు పూజలు నిర్వహించారు. మంగళవారం పురస్కరించుకొని కుటుంబ సమేతంగా వారు ఆలయానికి తరలివచ్చారు. ఈ సందర్భంగా ఆలయంలో కాలభైరవ స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కలు తీర్చుకున్నారు. అనంతరం ఆలయ పూజారి వారికి తీర్థప్రసాదాలను వితరణ చేశారు. ఆయనను చూడటానికి అక్కడి ప్రజలు గుమిగూడారు.

News March 5, 2025

రాష్ట్రంలో నేటి నుంచే ఇంటర్ ఎగ్జామ్స్

image

TG: రాష్ట్రంలో ఇవాళ్టి నుంచి ఇంటర్మీడియట్ ఫస్టియర్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఈ నెల 19 వరకు ఎగ్జామ్స్ కొనసాగనున్నాయి. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఎగ్జామ్స్ నిర్వహిస్తారు. పరీక్ష ప్రారంభమైన 5 నిమిషాల వరకు విద్యార్థులను అనుమతిస్తారు. 4,88,448 మంది విద్యార్థులు హాజరు కానున్నారు. వాచ్, స్మార్ట్ వాచ్, అనలాగ్ వాచ్‌లపై నిషేధం విధించారు. పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు.

News March 5, 2025

ఒకప్పుడు నటిగా ఫెయిల్… ఇప్పుడు గూగుల్ ఇండియా మేనేజర్

image

ఆ అమ్మాయి ఒకప్పుడు మహేశ్ బాబుతో నటించారు. పలు సీరియల్స్‌లోనూ తన లక్ పరీక్షించుకుంది. సక్సెస్ కాకపోవటంతో వేరే రంగాన్నిఎంచుకొని ఇప్పుడు పలువురికి రోల్ మోడల్‌‌గా నిలుస్తున్నారు. మయూరి కాంగో నటిగా స్థిరపడాలనుకున్నారు. సెట్ కాకపోవటంతో పెళ్లిచేసుకొని విదేశాలకు వెళ్లారు. న్యూయార్క్‌లో ఎంబీఏ చేసి పలు కంపెనీలలో ఉన్నత హోదాలలో పనిచేశారు. ప్రస్తుతం ఏకంగా గూగుల్ ఇండియాలో మేనేజర్‌గా పనిచేస్తున్నారు.

error: Content is protected !!