News March 7, 2025
జనగామ: ఫిర్యాదుల పరిష్కారానికి ప్రత్యేక అదాలత్

పోస్టల్ శాఖ పెన్షనర్ల ఫిర్యాదుల పరిష్కారానికి ప్రత్యేక అదాలత్ నిర్వహిస్తున్నట్లు హనుమకొండ జనరల్ పోస్టుమాస్టర్ తెలిపారు. శుక్రవారం తపాలా శాఖ పరిధిలోని పోస్టల్ పెన్షనర్ల ఫిర్యాదులపై మార్చి 25వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు గూగుల్ మీట్ ఏర్పాటు చేస్తున్నామన్నారు. సంబంధిత ఫిర్యాదులు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పరిశీలిస్తామన్నారు.
Similar News
News December 5, 2025
ఖమ్మంలో సూపర్ ఫాస్ట్ రైళ్లకు హాల్టింగ్ కల్పించాలి: ఎంపీ

వర్తక, వ్యాపార కేంద్రంగా ఉన్న ఖమ్మంలో పలు సూపర్ ఫాస్ట్ రైళ్లకు హాల్టింగ్ సదుపాయం కల్పించాలని రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర కేంద్ర రైల్వే మంత్రిని కోరారు. శుక్రవారం పార్లమెంట్ ఆవరణంలో కేంద్ర రైల్వే మంత్రిని కలిసి ఎంపీ రైల్వే సమస్యలపై వినతి పత్రం అందించారు. ఇరుముడి ధరించి, అయ్యప్ప సన్నిధానం శబరిమలకు వెళ్లే భక్తుల సౌకర్యార్థం ఖమ్మంలో కేరళ ఎక్స్ ప్రెస్కు హాల్టింగ్ సదుపాయం కల్పించాలని కోరారు.
News December 5, 2025
గాంధీ చూపిన మార్గమే స్ఫూర్తి: పుతిన్

భారత్-రష్యా బలమైన బంధానికి గాంధీ చూపిన అహింసా మార్గమే స్ఫూర్తి అని రాజ్ఘాట్ సందర్శకుల పుస్తకంలో రష్యా ప్రెసిడెంట్ పుతిన్ రాసుకొచ్చారు. శాంతి, అభివృద్ధికి ఆయన చూపిన మార్గం భవిష్యత్తు తరాలను ఇన్స్పైర్ చేస్తూనే ఉంటుందన్నారు. జీవితాన్ని భారతదేశ స్వాతంత్ర్య పోరాటానికి అంకితం చేశారని, అహింసకు చిహ్నంగా మారారని రాశారు. ద్వైపాక్షిక వాణిజ్యం, దౌత్య సంబంధాలపై చర్చించడానికి పుతిన్ భారత పర్యటనకు వచ్చారు.
News December 5, 2025
ASF: ఈ నెల 10 నుంచి సదరం శిబిరాలు

ASF జిల్లాలో ఈ నెల 10 నుంచి సదరం శిబిరాలు నిర్వహిస్తున్నట్లు డీఆర్డీవో దత్తారావ్ తెలిపారు. సదరం శిబిరాలకు వచ్చే వారు ప్రాథమిక ఆరోగ్య సేవా కేంద్రాల్లో దివ్యాంగ పరీక్ష చేయించుకుని స్లాట్ బుక్ చేసుకోవాలన్నారు. ఆ తర్వాత నిర్ణీత తేదీల్లో జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రిలో జరిగే శిబిరాలకు హాజరు కావాలని సూచించారు. ఈ నెల 10 నుంచి 31 వరకు శిబిరాలు ఉంటాయన్నారు.


