News March 16, 2025
జనగామ: బిక్షాటన చేస్తూ విద్యార్థుల నిరసన

జనగామ జిల్లా కేంద్రంలో ఫీజు రీయింబర్స్మెంట్ బకాయి నిధులు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ విద్యార్థులు వినూత్న రీతిలో బిక్షాటన చేస్తూ నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పట్టణంలో వ్యాపార సముదాయాల్లో తిరుగుతూ భిక్షాటన చేశారు. సకాలంలో స్కాలర్షిప్లు రాకపోవడంతో ఫీజులు కట్టాలని కాలేజీలు ఒత్తిడికి గురి చేస్తుందన్నారు. ప్రభుత్వ స్పందించి వెంటనే బకాయిలు విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
Similar News
News December 2, 2025
ఖమ్మం: చెక్ బౌన్స్.. ఏడాది జైలు, రూ.19 లక్షల పరిహారం

ఖమ్మం నర్తకి థియేటర్ ప్రాంతానికి చెందిన ఎ.రవిబాబుకి చెల్లని చెక్కు కేసులో ఖమ్మం రెండో అదనపు కోర్టు న్యాయాధికారి ఏపూరి బిందు ఏడాది జైలు శిక్షతో పాటు ఫిర్యాదుదారుడికి రూ.19 లక్షల నష్టపరిహారం చెల్లించాలని సోమవారం తీర్పు చెప్పారు. 2014లో రూ.15 లక్షల అప్పు తీసుకున్న నిందితుడు, 2016లో రూ.19 లక్షల చెక్కు జారీ చేయగా ఖాతాలో సరైన నగదు లేకపోవడంతో కోర్టులో కేసు దాఖలు చేయగా పైవిధంగా తీర్పునిచ్చారు.
News December 2, 2025
నంద్యాల: హత్య కేసులో నలుగురి అరెస్ట్

నంద్యాలలో మేదరి పుల్లయ్య హత్య కేసును పోలీసులు ఛేదించారు. అతడి ఆస్తులు, డబ్బులు కాజేయాలని కుట్ర పన్ని ధనుంజయ అనే వ్యక్తి సహచరులతో కలిసి పుల్లయ్యను హత్య చేసినట్లు విచారణలో తేలిందని ఎస్పీ సునీల్ షొరాణ్ తెలిపారు. మృతదేహాన్ని కుందూ నదిలో పడేసి, ఇంట్లో నుంచి DVRలు, ల్యాప్టాప్లను దొంగిలించారని చెప్పారు. ఈ కేసులో ధనుంజయ్, సంతోష్, రాఘవ, శ్రీకాంత్లను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించామని వెల్లడించారు.
News December 2, 2025
ఇవి వాడితే పంటకు రక్షణ, దిగుబడికి భరోసా

సాగులో ప్రకృతి వైపరీత్యాల కంటే చీడపీడలతోనే ఎక్కువ నష్టం జరుగుతోంది. ఈ సమస్య నివారణకు లింగాకర్షక బుట్టలు, జిగురు అట్టలు, లైట్ ట్రాప్స్ ప్రస్తుతం అందుబాటులో ఉన్నాయి. ఇవి పురుగులను ఆకర్షించి, నిర్మూలించి వాటి ఉద్ధృతి పెరగకుండా కట్టడి చేస్తున్నాయి. దీంతో పురుగు మందుల వినియోగం తగ్గి, పర్యావరణానికి, మిత్రపురుగులకు మేలు జరుగుతోంది. ఏ పంటకు ఏ పరికరం వాడితే లాభమో తెలుసుకోవడానికి <<-se_10015>>పాడిపంట<<>> క్లిక్ చేయండి.


