News March 31, 2024

జనగామ: బైక్ అదుపుతప్పి.. వ్యక్తి మృతి

image

జనగామ జిల్లాలో విషాదం నెలకొంది. బైక్ అదుపుతప్పి ఓ వ్యక్తి మృత్యువాతపడ్డాడు. స్థానికులు, పోలీసుల వివరాల ప్రకారం.. కొడకండ్ల మండలంలోని హక్యాతండా సమీపంలో ఓ బైక్ అదుపుతప్పి పడిపోయింది. ఈ ఘటనలో బైక్ నడుపుతున్న వెంకన్న అనే వ్యక్తి తీవ్రగాయాలయ్యాయి. ఆయనను వాహనదారులు ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే మృతిచెందినట్లు తెలిపారు. సమాచారం అందుకున్న కొడకండ్ల పోలీసులు వెళ్లి పరిశీలించారు. కేసు నమోదు చేశారు.

Similar News

News October 1, 2024

వరంగల్ నుంచి ఉప్పల్‌కు ప్రత్యేక బస్సులు

image

దసరా పండుగ సందర్భంగా వరంగల్ రీజియన్ ఆధ్వర్యంలో ఈనెల 12 వరకు ప్రత్యేక బస్సులు నడపడానికి ఏర్పాట్లు చేశామని వరంగల్ రీజియన్ RM డి.విజయభాను తెలిపారు. ప్రయాణికులకు రవాణా పరమైన ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు చేశామని అన్నారు. (HNK 125, JN 120, WGL 1 నుంచి 125, WGL 2 డిపో 125, MHBD 47, NSPT 119, PKL 93, TRR 48, BHPL 48) మొత్తం 850 బస్సులు నడుపుతున్నట్లు పేర్కొన్నారు.

News October 1, 2024

ఉమ్మడి వరంగల్ జిల్లాకు ప్రత్యేక ఐఏఎస్ అధికారి నియామకం

image

ఐఏఎస్ అధికారులను ప్రత్యేక అధికారులుగా నియమిస్తూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి నేడు ఉత్తర్వులు జారీ చేశారు. వరంగల్, హనుమకొండ, జనగామ, భూపాలపల్లి, ములుగు, మహబూబాబాద్ జిల్లాలకు ప్రత్యేక అధికారిగా టీ.వినయ్ కృష్ణారెడ్డి ఐఏఎస్‌ను నియమించారు. ప్రత్యేక అధికారులు వెంటనే జిల్లాలను సందర్శించి, ప్రభుత్వ కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేసేందుకు జిల్లా కలెక్టర్లతో సమన్వయం చేసుకోవాలని అన్నారు.

News October 1, 2024

MHBD: గురుకులాన్ని ప్రారంభించనున్న ప్రధాని నరేంద్ర మోదీ

image

మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలం పొగుళ్లపల్లిలో నిర్మించిన ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ గురుకులాన్ని ప్రధాని మోదీ బుధవారం ప్రారంభించనున్నారు. రెండేళ్ల క్రితం కొత్తగూడకు ఏకలవ్య పాఠశాల మంజూరైంది. పొగుళ్లపల్లిలో 9 ఎకరాల విస్తీర్ణంలో రూ.40కోట్లతో భవన నిర్మాణ పనులు చేపట్టగా.. ఇటీవల పనులు పూర్తయ్యాయి. రేపు నరేంద్ర మోదీ వర్చువల్‌గా ఢిల్లీ నుంచి ప్రారంభిస్తారని అధికారులు తెలిపారు.