News February 24, 2025

జనగామ: మందుబాబులకు బ్యాడ్ న్యూస్

image

టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ కారణంగా మూడు రోజులు మద్యం అమ్మకాలు నిలిపేయాలని దుకాణదారులను పోలీసులు ఆదేశించారు. ఈ నెల 25వ తేదీ సాయంత్రం 4 గంటల నుంచి 27వ తేదీ సాయంత్రం 4 గంటల వరకు మద్యం షాపులు బంద్ కానున్నాయి. దీంతో వరంగల్, భూపాలపల్లి, జనగామ, మహబూబాబాద్, ములుగు, హనుమకొండ జిల్లాల్లోని వైన్స్, బార్ అండ్ రెస్టారెంట్లు, స్టార్ హోటళ్లలోని బార్లు, కల్లు దుకాణాలు క్లోజ్ అవుతాయి.

Similar News

News October 23, 2025

సిర్సనగండ్లలో అత్యధిక వర్షపాతం నమోదు

image

జిల్లాలో గడిచిన 24 గంటల్లో వివిధ ప్రాంతాల్లో వర్షం కురిసింది. అత్యధికంగా వంగూరు మండలం సిర్సనగండ్లలో 12.3 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. కొల్లాపూర్ 7.3, పెద్ద పెద్దపల్లి 6.8, కల్వకుర్తి 4.5, యెంగంపల్లి, బోలంపల్లి 3.5, ఊర్కొండ 2.5, జటప్రోలు 1.0, తోటపల్లి, తెలకపల్లి 0.8, అత్యల్పంగా నాగర్‌కర్నూల్, ఐనోల్‌లో 0.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైందని వాతావరణ శాఖ తెలిపింది.

News October 23, 2025

మెదక్: మంత్రి వివేక్‌ Vs హరీశ్‌రావు

image

సిద్దిపేట కలెక్టరేట్‌లో బుధవారం చెక్కుల పంపిణీలో మంత్రి వివేక్, మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్‌రావు మధ్య మాటల యుద్దం జరిగింది. కళ్యాణ లక్ష్మితోపాటు తులం బంగారం, ఔట్ సోర్సింగ్ సిబ్బంది జీతాలు, సిద్దిపేటలో ఆగిపోయిన అభివృద్ధి పనులపై హరీశ్ ప్రశ్నించగా, BRS చేసిన అప్పులు, రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్లు, సన్న బియ్యం అందజేతపై మంత్రి మాట్లాడారు. విమర్శలు, ప్రతివిమర్శలు, సమాధానాలతో ఇరువురి ప్రసంగాలు సాగాయి.

News October 23, 2025

చేవెళ్లలో రోడ్డు ప్రమాదం.. యాలాల వాసులు మృతి

image

చేవెళ్ల మండలంలో గురువారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం జరిగింది. స్థానికుల వివరాలు.. మల్కాపూర్‌ ప్రధాన రహదారి మీద గుర్తు తెలియని వాహనం స్కూటీని ఢీకొట్టింది. ఈ ఘటనలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. మృతులు యాలాల మండల వాసులుగా పోలీసులు గుర్తించారు. స్కూటీని ఢీ కొట్టి వెళ్లిన వాహనాన్ని గుర్తించేందుకు పోలీసులు సీసీ ఫుటేజీలను పరిశీలిస్తున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.