News April 4, 2025
జనగామ: మాయదారి వానలు.. అప్పులే గతి!

ఉమ్మడి వరంగల్ జిల్లాలో ప్రస్తుతం పంటలన్నీ చివరి దశకు వచ్చాయి. ఈ పరిస్థితుల్లో వర్షం పడితే అప్పులే దిక్కు అని ఓరుగల్లు రైతన్నలు ఆవేదన చెందుతున్నారు. పర్వతగిరి, నెక్కొండ, రాయపర్తిలో మొక్కజొన్న, వరి చివరిదశకు చేరుకోగా.. తొర్రూరు, కొత్తగూడతో పాటు పలుప్రాంతాల్లో పంటకోసి కుప్పనూర్చారు. ఇప్పుడు ఈదురు గాలులతో వర్షం పడితే పంట నేలకు ఒరిగే అవకాశముంది. వర్షం ఎప్పుడు పడుతుందోనని ఆందోళన పడుతున్నారు.
Similar News
News November 17, 2025
భూపాలపల్లి: ‘బయోమెట్రిక్ హాజరు విధానాన్ని తప్పనిసరిగా నమోదు చేయాలి’

అన్ని శాఖల అధికారులు, సిబ్బంది బయోమెట్రిక్ హాజరు విధానాన్ని తప్పనిసరిగా నమోదు చేయాలని కలెక్టర్ రాహుల్ శర్మ ఆదేశించారు. సోమవారం భూపాలపల్లిలోని ఐడీఓసీలో బయోమెట్రిక్ హాజరు నమోదుపై అన్ని శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ..శాఖల వారీగా బయోమెట్రిక్ హాజరు నమోదు తప్పనిసరి చేస్తూ, బయోమెట్రిక్ హాజరు పరిశీలన ఆధారంగా మాత్రమే వేతనాలు చెల్లించే విధానం అమలు చేయనున్నట్లు స్పష్టం చేశారు.
News November 17, 2025
భూపాలపల్లి: ‘బయోమెట్రిక్ హాజరు విధానాన్ని తప్పనిసరిగా నమోదు చేయాలి’

అన్ని శాఖల అధికారులు, సిబ్బంది బయోమెట్రిక్ హాజరు విధానాన్ని తప్పనిసరిగా నమోదు చేయాలని కలెక్టర్ రాహుల్ శర్మ ఆదేశించారు. సోమవారం భూపాలపల్లిలోని ఐడీఓసీలో బయోమెట్రిక్ హాజరు నమోదుపై అన్ని శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ..శాఖల వారీగా బయోమెట్రిక్ హాజరు నమోదు తప్పనిసరి చేస్తూ, బయోమెట్రిక్ హాజరు పరిశీలన ఆధారంగా మాత్రమే వేతనాలు చెల్లించే విధానం అమలు చేయనున్నట్లు స్పష్టం చేశారు.
News November 17, 2025
సమస్యల పరిష్కరానికి చర్యలు తీసుకోవాలి: భూపాలపల్లి కలెక్టర్

ప్రజావాణి కార్యక్రమంలో వచ్చిన దరఖాస్తుల పరిష్కారానికి అధికారులు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ తెలిపారు. సోమవారం భూపాలపల్లిలోని ఐడీఓసీలో ప్రజల నుంచి ఆయన 37 దరఖాస్తులు స్వీకరించి, పరిష్కరానికి చర్యలు తీసుకోవాలని సబంధిత అధికారులకు ఎండార్స్మెంట్ చేశారు. తదుపరి ప్రజావాణి వరకు జీరో పెండింగ్ ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆయన స్పష్టం చేశారు.


