News April 4, 2025
జనగామ: మాయదారి వానలు.. అప్పులే గతి!

ఉమ్మడి వరంగల్ జిల్లాలో ప్రస్తుతం పంటలన్నీ చివరి దశకు వచ్చాయి. ఈ పరిస్థితుల్లో వర్షం పడితే అప్పులే దిక్కు అని ఓరుగల్లు రైతన్నలు ఆవేదన చెందుతున్నారు. పర్వతగిరి, నెక్కొండ, రాయపర్తిలో మొక్కజొన్న, వరి చివరిదశకు చేరుకోగా.. తొర్రూరు, కొత్తగూడతో పాటు పలుప్రాంతాల్లో పంటకోసి కుప్పనూర్చారు. ఇప్పుడు ఈదురు గాలులతో వర్షం పడితే పంట నేలకు ఒరిగే అవకాశముంది. వర్షం ఎప్పుడు పడుతుందోనని ఆందోళన పడుతున్నారు.
Similar News
News September 13, 2025
పల్నాడులో ప్రకంపనలు రేపుతున్న భూ కుంభకోణం

పల్నాడు జిల్లా గురజాలలో సుమారు 1330 ఎకరాల ప్రభుత్వ భూమి ప్రైవేటు వ్యక్తుల పేర్ల మీద ఆన్లైన్ చేయబడింది. ఈ విషయంపై ప్రభుత్వానికి ఫిర్యాదులు అందడంతో అధికారులు దర్యాప్తు చేపట్టారు. ఈ అక్రమాలకు 2019-24 వరకు గత ప్రభుత్వ హయాంలో కొందరు నాయకులు పాల్పడినట్లు అధికారులు గుర్తించారు. ఈ కుంభకోణంపై పూర్తిస్థాయి విచారణ కోసం సెప్టెంబర్ 18న పొందుగల సచివాలయంలో ఎంక్వయిరీ సభ నిర్వహించనున్నారు.
News September 13, 2025
KTRకు రాహుల్ గురించి మాట్లాడే అర్హత ఉందా: మహేశ్

TG: ఫిరాయింపు MLAల విషయంలో రాహుల్గాంధీని KTR <<17689238>>ప్రశ్నించడంపై<<>> TPCC చీఫ్ మహేశ్ గౌడ్ ఫైరయ్యారు. ‘MLAలపై రాహుల్ ఎందుకు మాట్లాడాలి? KTR స్థాయి ఏంటి? రాహుల్ గురించి మాట్లాడే అర్హత ఉందా? కాళేశ్వరంపై విచారణను తప్పించుకోవడానికి మోదీ అడుగులకు మడుగులు ఒత్తుతూ ఉపరాష్ట్రపతి ఎన్నికకు దూరంగా ఉన్నారు. BJPలో BRS విలీనం గురించి ఇప్పటికే కవిత చెప్పారు’ అని వ్యాఖ్యానించారు.
News September 13, 2025
కాసేపట్లో వర్షం

తెలంగాణలోని పలు జిల్లాల్లో సాయంత్రం 4 గంటలలోపు మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. మెదక్, నల్గొండ, సిద్దిపేటలో వాన పడే ఛాన్స్ ఉందని వెల్లడించింది. హైదరాబాద్, ఆదిలాబాద్, హన్మకొండ, మహబూబాబాద్, రంగారెడ్డి, యాదాద్రి, సంగారెడ్డి, వికారాబాద్, మేడ్చల్, నాగర్ కర్నూల్, సిరిసిల్ల జిల్లాల్లో తేలికపాటి వానలు పడొచ్చని పేర్కొంది.