News April 4, 2025

జనగామ మార్కెట్ యార్డ్ 3 రోజులు బంద్

image

జనగామలోని మార్కెట్ యార్డుకు 3 రోజులు సెలవు ప్రకటించినట్లు మార్కెట్ ఛైర్మన్ శివరాజ్ యాదవ్ తెలిపారు. భారీ మొత్తంలో వ్యవసాయ ఉత్పత్తులు వచ్చిన కారణంగా యార్డ్‌లో స్థలం లేదన్నారు. దీంతో శుక్రవారం సెలవు ప్రకటించారు. శనివారం జగ్జీవన్ జయంతి, ఆదివారంతో కలిపి మొత్తం 3 రోజులు మార్కెట్‌లో క్రయవిక్రయాలు జరగవని పేర్కొన్నారు. సోమవారం తిరిగి పున:ప్రారంభం ప్రారంభమవుతుందని, రైతులు సహకరించాలని కోరారు.

Similar News

News April 18, 2025

మొక్కల ఆధారిత ప్రొటీన్లతో ఎక్కువ ఆయుర్దాయం

image

శరీరానికి విటమిన్లతో పాటు ప్రొటీన్లు చాలా అవసరం. వాటి కోసం మాంసాన్ని ఆశ్రయిస్తుంటాం. అయితే మొక్కల ఆధారిత(శనగలు, బఠానీలు, టోఫు) ప్రొటీన్లు తీసుకునే దేశాల్లో వయోజన ఆయుర్దాయం ఎక్కువని సిడ్నీ వర్సిటీ అధ్యయనంలో తేలింది. దీర్ఘకాలిక వ్యాధులు, అకాల మరణాల ప్రమాదం తక్కువగా ఉంటుందని వెల్లడైంది. 1961-2018 మధ్య 101 దేశాల్లో ఆహార సరఫరా, జనాభా డేటా ఆధారంగా సైంటిస్టులు ఈ అధ్యయనం చేశారు.

News April 18, 2025

శాంతి భద్రతలకు ప్రతి ఒక్కరూ సహకరించాలి: డీసీపీ

image

శాంతిభద్రతలకు ప్రతి ఒక్కరూ సహకరించాలని వరంగల్ ఈస్ట్ జోన్ డీసీపీ అంకిత్ కుమార్ సూచించారు. నర్సంపేటలోని బస్టాండ్ ఆవరణలో స్పెషల్ ట్రైన్డ్ నార్కో అనాలసిస్ డాగ్ స్క్వాడ్ సహకారంతో శుక్రవారం తనిఖీలు చేపట్టారు. గంజాయి ఇతర మత్తు పదార్థాల రవాణా నియంత్రణకు ఈ తనిఖీలు చేపట్టినట్లు డీసీపీ అంకిత్ కుమార్ తెలిపారు. ఏసీపి కిరణ్ కుమార్, సిఐ రమణమూర్తి, ఎస్సైలు రవికుమార్, అరుణ్ తదితరులు ఉన్నారు.

News April 18, 2025

త్వరలో EPFO 3.0.. సేవలు సులభతరం: మాండవీయ

image

ఈపీఎఫ్‌వో చందాదారులకు కేంద్ర మంత్రి మన్‌సుఖ్ మాండవీయ శుభవార్త చెప్పారు. సేవలను సులభతరం చేసేందుకు అత్యాధునిక ఫీచర్లతో మే/జూన్‌కు EPFO 3.0ను అందుబాటులోకి తీసుకొస్తామన్నారు. ఆటో క్లెయిమ్, డిజిటల్ కరెక్షన్స్, ATM ద్వారా నగదు విత్‌డ్రా వంటి సదుపాయాలు ఉంటాయని వెల్లడించారు. క్లెయిమ్‌లు, కరెక్షన్ల కోసం కార్యాలయాల చుట్టూ తిరగడం, ఫారాలు నింపడం వంటి ఇబ్బందులు ఉండవని స్పష్టం చేశారు.

error: Content is protected !!