News February 26, 2026
జనగామ: ముక్కుసూటి మనిషి.. బీఆర్ఎస్కు చెక్ పెట్టేందుకేనా?

జనగామలో ఇక గేమ్ మొదలుకానుంది. కొత్త కలెక్టర్గా నియమితులైన సందీప్ కుమార్ ఝా ముక్కుసూటి మనిషిగా పేరుంది. అధికార పక్షమైనా, విపక్షమైనా ఎవరి మాట వినకుండా ఏదైనా పనిని ముక్కుసూటిగా పనిచేసే స్వభావం ఆయనది. ఈయన గతంలో ఖమ్మం మున్సిపల్ కమిషనర్, సిరిసిల్ల కలెక్టర్గా పనిచేశారు. కాగా జనగామలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఉండడంతో చెక్ పెట్టేందుకే ఆయన్ను రంగంలోకి దించినట్టు సమాచారం.
Similar News
News April 19, 2026
‘జైలర్-2’కు రికార్డ్ బ్రేకింగ్ OTT డీల్?

రజనీకాంత్, నెల్సన్ దిలీప్కుమార్ కాంబోలో వస్తున్న ‘జైలర్ 2’ అప్పుడే రికార్డులు సృష్టిస్తోంది. ఈ సినిమా డిజిటల్ హక్కులను అమెజాన్ ప్రైమ్ వీడియో ఏకంగా ₹160 కోట్లకు దక్కించుకున్నట్లు సమాచారం. ఒక తమిళ సినిమాకు ఈ స్థాయి ధర లభించడం ఇదే తొలిసారి. మొదటి పార్ట్ కంటే రెట్టింపు ధరకు డీల్ కుదరడం విశేషం. షూటింగ్ చివరి దశలో ఉన్న ఈ యాక్షన్ డ్రామాను ఆగస్టులో రిలీజ్ చేసేందుకు సన్ పిక్చర్స్ ప్లాన్ చేస్తోంది.
News April 19, 2026
అనంత: పెరుగుతున్న చీనీ ధరలు.. రైతుల హర్షం

అనంతపురం మార్కెట్ యార్డులో చీనీకాయల ధరలు కొన్ని రోజులుగా పెరుగుతుండటంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మార్కెట్లో శుక్రవారం 1,135 టన్నుల చీనీకాయలను టన్ను గరిష్ఠ ధర రూ.28 వేలకు రైతులు విక్రయించారు. మధ్యస్థం రూ.18 వేలు, కనిష్ఠం రూ.10 వేలు చొప్పున అమ్మారు. శనివారం రూ.29 వేలకు విక్రయాలు జరిగాయని యార్డు ఎంపికశ్రేణి ఇన్ఛార్జ్ కార్యదర్శి, ఏడీఎం రాఘవేంద్రకుమార్ తెలిపారు.
News April 19, 2026
అనకాపల్లి: చందనోత్సవానికి ప్రత్యేక బస్సులు

సింహాచలం సింహాద్రి అప్పన్న చందనోత్సవానికి అనకాపల్లి ఆర్టీసీ కాంప్లెక్స్ నుంచి ప్రత్యేక బస్సులు నడపనున్నట్లు అనకాపల్లి జిల్లా ప్రజా రవాణా అధికారిణి(ఆర్టీసీ) వి. ప్రవీణ తెలిపారు. డిపో నుంచి ఈనెల 20న తెల్లవారుజామున మూడు గంటల నుంచి 15 బస్సులు నడుపుతామన్నారు. ఈ బస్సులు రాత్రి వరకు తిరుగుతాయన్నారు.


