News April 7, 2025
జనగామ: రాముడి ఆస్తి ఎక్కడ?.. వెలిసిన ఫ్లెక్సీ

స్టేషన్ ఘనపూర్ మండలంలోని తాటికొండ గ్రామంలో ఆదివారం రాములవారి కళ్యాణం ఘనంగా జరగగా.. రాముడి ఆస్తి ఎక్కడ? అంటూ ఆలయ ఆవరణలో స్థానికుడైన శ్రీనివాస్ అనే వ్యక్తి ఫ్లెక్సీలను ఏర్పాటు చేశాడు. గ్రామంలో దేవుడి పేరుపై 86.35 ఎకరాల భూమి ఉండగా.. సుమారు పదిమంది వ్యక్తులు 50 ఎకరాల వరకు భూమిని పట్టా చేయించుకున్నట్లు తెలిసిందన్నారు. రాముని ఆస్తి తిరిగి వస్తుందనే ఆశతో ఫ్లెక్సీని ఏర్పాటు చేశానన్నాడు.
Similar News
News December 20, 2025
HYD ‘నైట్ లైఫ్’.. కాగితాలకే పరిమితమైన మెట్రో వేళలు

‘నైట్ ఎకానమీ’లో భాగంగా అర్ధరాత్రి 2 గంటల వరకు మెట్రో, బస్సు సేవలు అందుబాటులోకి వస్తాయన్న ప్రభుత్వ ప్రకటనలు ప్రచారానికే పరిమితమయ్యాయి. విజన్-2047 లక్ష్యాల్లో వీటిని చేర్చినప్పటికీ మెట్రో రైళ్లు రాత్రి 11 గంటలకే నిలిచిపోతున్నాయి. అర్ధరాత్రి ప్రయాణాలపై ఇప్పటివరకు ఎలాంటి జీవో వెలువడలేదు. వెబ్సైట్లోనూ పాత వేళలే ఉండటంతో, సామాన్యులకు ‘మిడ్నైట్ మెట్రో’ ప్రయాణం ఇంకా అందని ద్రాక్షగానే మిగిలిపోయింది.
News December 20, 2025
5 జిల్లాల పరిథిలో అమరావతి ORR

AP: అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు నిర్మాణానికి అడుగులు వేగంగా పడుతున్నాయి. భూసేకరణకు కేంద్ర రోడ్డు, రవాణా, హైవే శాఖ నోటిఫికేషన్ జారీచేసింది. 189 KM మేర 6 లేన్లుగా ఈ నిర్మాణం జరగనుంది. దీని పరిధిలో గుంటూరు, పల్నాడు, ఎన్టీఆర్, కృష్ణా, ఏలూరు జిల్లాలు రానున్నాయి. 23 మండలాల్లో ఉన్న 121 గ్రామాల్లో భూసేకరణ జరగనుంది. మొత్తం 5789 ఎకరాల భూమిని సేకరించనున్నారు. అభ్యంతరాలకు 21 రోజుల గడువు విధించారు.
News December 20, 2025
బెజవాడ కంటే బందరే ఎక్కువ.. కారణం ఇదే.!

చరిత్ర, సంస్కృతి, వాణిజ్య పరంగా దేశానికే గర్వకారణమైన బందరు ఒకనాటి అంతర్జాతీయ వాణిజ్య కేంద్రం. ఆంగ్లేయులు, పోర్చుగీసు, డచ్ పాలకులకు అధికార కేంద్రంగా ఉన్న ఈ పట్టణం రోమ్, పర్షియా, అరబ్, చైనా దేశాలకు వస్త్రాలు ఎగుమతి చేసింది. 1866లో మున్సిపాలిటీగా ఏర్పడి దేశంలో 3వ స్థానంలో ఉంది. 1864 ఉప్పెనలో బందరులో 30 వేల మంది మృతి చెందగా, అప్పట్లో బెజవాడ జనాభా కేవలం 9,336. అంటే ఒకప్పుడు బందరు, బెజవాడ కంటే ఎక్కువ.


