News April 7, 2025
జనగామ: రాముడి ఆస్తి ఎక్కడ?.. వెలిసిన ఫ్లెక్సీ

స్టేషన్ ఘనపూర్ మండలంలోని తాటికొండ గ్రామంలో ఆదివారం రాములవారి కళ్యాణం ఘనంగా జరగగా.. రాముడి ఆస్తి ఎక్కడ? అంటూ ఆలయ ఆవరణలో స్థానికుడైన శ్రీనివాస్ అనే వ్యక్తి ఫ్లెక్సీలను ఏర్పాటు చేశాడు. గ్రామంలో దేవుడి పేరుపై 86.35 ఎకరాల భూమి ఉండగా.. సుమారు పదిమంది వ్యక్తులు 50 ఎకరాల వరకు భూమిని పట్టా చేయించుకున్నట్లు తెలిసిందన్నారు. రాముని ఆస్తి తిరిగి వస్తుందనే ఆశతో ఫ్లెక్సీని ఏర్పాటు చేశానన్నాడు.
Similar News
News October 25, 2025
SRCL: ‘కొనుగోలు ప్రక్రియ సజావుగా నిర్వహించాలి’

ఈ ఖరీఫ్ సీజన్లో వరి ధాన్యం, పత్తి, మక్కలు ఇతర పంటల కొనుగోళ్ల ప్రక్రియ సజావుగా సాగాలని ఇన్చార్జి కలెక్టర్ గరీమా అగ్రవాల్ ఆదేశించారు. ఆయా పంటల ఉత్పత్తుల సేకరణ, చేయాలిసిన ఏర్పాట్లు తదితర అంశాలపై పౌరసరఫరాల శాఖ, సహకార శాఖ, ఐకేపీ, మెప్మా, డీసీఎంఎస్ తదితర అధికారులతో జిల్లా సమీకృత కార్యాలయంలో ఇన్చార్జి కలెక్టర్ శుక్రవారం సమీక్ష సమావేశం నిర్వహించారు.
News October 25, 2025
WGL: ఐఐఎస్సీ ప్రొఫెసర్ మాధవిలత ఎవరో తెలుసా..?

ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన చీనాబ్ రైల్వే వంతెన నిర్మాణంలో కీలక పాత్ర పోషించిన బెంగళూరు ఐఐఎస్సీ ప్రొఫెసర్ డా.జి. మాధవీలతా వరంగల్ ఎన్ఐటీ సాంకేతిక ఉత్సవాల్లో పాల్గొన్నారు. ఆమె, జియోటెక్నికల్ ఇంజినీరింగ్లో నిపుణురాలు, చీనాబ్ వంతెనకు భూగర్భ సాంకేతిక సలహాదారుగా 17 ఏళ్లపాటు సేవలు అందించి దేశ గౌరవాన్ని పెంచారు. ఆమె నిట్లో విద్యార్థులకు దిశా నిర్దేశం చేయడం పట్ల జిల్లా వాసులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
News October 25, 2025
కర్నూలు ఘోర ప్రమాదంలో ‘కడప జిల్లా వాసి ముృత్యుంజయుడు’

కర్నూలు ప్రమాదంలో 20 మంది సజీవదహనమైన విషయం తెలిసిందే. ఆ ఘటనలో పెద్దముడియంలోని నెమళ్లదిన్నెకు చెందిన జయసూర్య మృత్యుంజయుడయ్యాడు. 25 ఏళ్ల కిందట బతుకుదెరువు కోసం తల్లిదండ్రులు హైదరాబాద్లో సెటిలయ్యారు. బీటెక్ పూర్తి చేసిన జయసూర్య బెంగళూరులో ఇంటర్వ్యూకు వెళ్తుండగా ప్రమాదం జరిగింది. మంటలు చెలరేగడంతో అద్దాన్ని పగులకొట్టి దూకి ప్రాణాలుకాపాడుకున్నాడు. కాగా రెండు కాళ్లు విరిగినట్లు తెలిపాడు.


