News March 15, 2025
జనగామ: రిజర్వాయర్ నుంచి నీటి విడుదల

నర్మెట్ట మండలం బొమ్మకూరు రిజర్వాయర్ ఎడమ, కుడి కాలువల నుంచి నీటిని విడుదల చేస్తున్నట్లు నీటిపారుదల శాఖ అధికారులు ఓ ప్రకటనలో తెలియజేశారు. ఈ సందర్భంగా కుడి కాలువ ద్వారా జనగామ మరియు బచ్చన్నపేట మండలం పరిధిలోని పలు గ్రామాలలో 15000 ఎకరాలకు, అదేవిధంగా ఎడమ కాలువ ద్వారా నర్మెట మరియు రఘునాథపల్లి మండలం పరిధిలోని పలు గ్రామాలలో 6000 ఎకరాలకు నీటిని విడుదల చేశారు.
Similar News
News March 16, 2025
ఆదోనిలో ‘గరివిడి లక్ష్మి’ సినిమా షూటింగ్

ఆదోనిలోని ఒకటో వార్డు చిన్నశక్తి గుడి ఆవరణలో శనివారం అర్ధరాత్రి నుంచి తెల్లవారుజామున వరకు ‘గరివిడి లక్ష్మి’ సినిమా షూటింగ్ జరిగింది. షూటింగ్ను తిలకించడానికి జనాలు ఎగబడ్డారు. ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఒకటో పట్టణ పోలీసులు బందోబస్తు కల్పించారు. గౌరీ నాయుడు జమ్ము దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి జే.ఆదిత్య కెమెరామెన్ కాగా, చరణ్ అర్జున్ సంగీతం అందిస్తున్నారు.
News March 16, 2025
వరంగల్ సీపీని మర్యాదపూర్వకంగా కలిసిన కరీంనగర్ సీపీ

వరంగల్ పోలీస్ కమిషనరేట్ నూతన కమిషనర్గా బాధ్యతలు చేపట్టిన సన్ ప్రీత్ సింగ్ను కరీంనగర్ వరంగల్ పోలీస్ కమిషనర్ గౌస్ ఆలం పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో ఆదివారం మర్యాదపూర్వకంగా కలిసి పూల మొక్కను అందజేశారు. అనంతరం ఇరువురు అధికారులు శాంతి భద్రతలకు సంబంధించి పలు అంశాలపై ముచ్చటించుకున్నారు. గౌస్ ఆలం ఇటీవల కరీంనగర్ నూతన సీపీ బాధ్యతలు చేపట్టారు.
News March 16, 2025
పొట్టి శ్రీరాములు జీవిత చరిత్ర అనుసరణీయం: మంత్రి టీజీ భరత్

రాష్ట్ర సాధన కోసం కఠోర దీక్ష చేసి తెలుగు జాతికి స్ఫూర్తిగా నిలిచిన అమరజీవి పొట్టి శ్రీరాములు జీవిత చరిత్ర నేటి యువత అనుసరించాలని మంత్రి టీజీ భరత్ అన్నారు. పొట్టి శ్రీరాములు 124వ జయంతి పురస్కరించుకొని కర్నూలులోని పూల బజార్ వద్ద ఉన్న ఆయన కాంస్య విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. 58 రోజుల పాటు నిర్విరామంగా అమరణ నిరాహార దీక్ష చేసి రాష్ట్రాన్ని సాధించారని అన్నారు.