News March 30, 2025

జనగామ: రైతాంగాన్ని ఆదుకోవాలని కలెక్టర్‌కు వినతి

image

జిల్లాలోని సాగు నీరు అందక పంట ఎండిపోయిన రైతులను రాష్ట్ర ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన ఆదుకోవాలని కోరుతూ బీజేపీ జిల్లా నాయకులు శనివారం కలెక్టర్ రిజ్వాన్ భాషాకు వినతిపత్రం అందజేశారు. ప్రతి రైతుకు 50 వేల చొప్పున నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో శివరాజ్ యాదవ్, దేవరాయ ఎల్లయ్య, హరిచంద్రగుప్త, తదితరులు పాల్గొన్నారు.

Similar News

News November 7, 2025

భూపాలపల్లి: దివ్యాంగులకు ఉత్తమ అవార్డుల కోసం దరఖాస్తుల ఆహ్వానం

image

జిల్లాలో వివిధ రంగాల్లో ప్రతిభ కనబరచిన దివ్యాంగులు, అలాగే వారి సంక్షేమానికి కృషి చేసిన వ్యక్తులను ఉత్తమ అవార్డు కోసం ఎంపిక చేయడానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు భూపాలపల్లి జిల్లా మహిళా, శిశు, దివ్యాంగుల సంక్షేమ అధికారిణి మల్లేశ్వరి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. HYDలో జరగనున్న అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా వివిధ అంశాల్లో ఎంపికైన వారిని ఘనంగా సన్మానించనున్నట్లు చెప్పారు.

News November 7, 2025

పనులు లేని వారందరికీ ఉపాధి కల్పించాలి: జడ్పీ ఛైర్మన్

image

ఉపాధి కింద పనులు లేని వారందరికీ ఉపాధి కల్పిస్తూ, రైతులకు ప్రయోజనకరమైన పనులకు ప్రాధాన్యత ఇవ్వాలని జడ్పీ ఛైర్మన్ ఎర్రబోతుల పాపిరెడ్డి సూచించారు. శుక్రవారం కర్నూలులో జరిగిన ఉమ్మడి జడ్పీ సమావేశంలో ఆయన మాట్లాడారు. అవుకు రిజర్వాయర్లో 4 TMCల నీటి నిల్వ సామర్థ్యం ఉన్నా ప్రస్తుతం 2.5 TMCలు మాత్రమే నిల్వ ఉన్నాయన్నారు. పెండింగ్ అండర్ కాంక్రీట్ పనులను పూర్తిచేసి, పూర్తి సామర్థ్యంతో నీటిని నింపాలన్నారు.

News November 7, 2025

ప్రజలకు నమ్మకం కలిగేలా విధులు నిర్వర్తించండి: ఎస్పీ

image

పోలీస్ అంటే భయం కాదు.. నమ్మకం కలిగించేలా సిబ్బంది పనిచేయాలని ఎస్పీ ధీరజ్ కునుబిల్లీ పోలీస్ అధికారులను ఆదేశించారు. విధుల నిర్వహణలో ప్రజలతో మర్యాదగా వ్యవహరించాలన్నారు. పెండింగ్‌లో ఉన్న కేసులపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. ప్రజలతో ముఖాముఖి మాట్లాడి వారి సమస్యలను తెలుసుకుని పరిష్కరించేందుకు కృషి చేయాలన్నారు. గంజాయి రవాణా, విక్రయాలపై దాడులను నిర్వహించి కఠిన చర్యలు చూసుకోవాలని సూచించారు.