News November 20, 2024

జనగామ: రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతి.. UPDATE

image

జనగామ జిల్లా చేర్యాల మండలం ముస్త్యాల గ్రామంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో <<14656765>>ఇద్దరు మృతి<<>> చెందిన విషయం తెలిసిందే. స్థానికుల ప్రకారం.. బచ్చనపేట మండలం కట్కూరు గ్రామానికి చెందిన కరుణాకర్, సాయిబాబా రైతులు. అయితే వారి ట్రాక్టర్లకు సామగ్రి తీసుకురావడానికి చేర్యాలకు వచ్చి వెళ్తున్నారు. ఈ క్రమంలో కారు ఢీకొట్టడంతో మృతి చెందారు. కాగా, బైకు నుజ్జునుజ్జయింది.

Similar News

News October 25, 2025

వరంగల్ కలెక్టరేట్‌లో స్పెషల్ గ్రీవెన్స్

image

వరంగల్ కలెక్టర్ ఆదేశాల మేరకు జిల్లాలోని దివ్యాంగులు, వయోవృద్ధులకు శనివారం స్పెషల్ గ్రీవెన్స్ నిర్వహించనున్నట్లు మహిళా, శిశు, దివ్యాంగులు, వయోవృద్ధుల సంక్షేమ శాఖ అధికారి రాజమణి తెలిపారు. ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 12 వరకు కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో స్పెషల్ గ్రీవెన్స్ నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.

News October 25, 2025

వరంగల్: గుర్తింపు, హరిత నిధుల ఫీజులు చెల్లించాలి..!

image

జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్ యాజమాన్యాల కళాశాలలు గుర్తింపు ఫీజుతోపాటు హరితనిధి చెలించాలని డీఐఈవో డా.శ్రీధర్ సుమన్ పేర్కొన్నారు. ఇంటర్ బోర్డు వెబ్సైట్‌లో సంబంధిత కాలేజీ లాగిన్ ద్వారా గుర్తింపు ఫీజు తప్పక చెల్లించాలని సూచించారు. ప్రథమ సంవత్సరం విద్యార్థులు రూ.220, హరితనిధి రూ.15 కలిపి మొత్తం రూ.235 చొప్పున చెల్లించాలన్నారు. విద్యార్థుల పూర్తి వివరాలను ఆన్‌లైన్ చెక్ లిస్టులతో చూడాలన్నారు.

News October 25, 2025

టెన్త్ పరీక్షల ఫీజు నవంబర్ 13లోపు చెల్లించాలి: డీఈవో

image

వరంగల్ జిల్లాలోని పదో తరగతి వార్షిక పరీక్షల ఫీజు ఈనెల 30 నుంచి నవంబర్ 13లోపు చెల్లించాలని డీఈవో రంగయ్య నాయుడు తెలిపారు. రూ.50 అపరాధ రుసుముతో నవంబర్ 15 నుంచి 29 వరకు చెల్లించాలని పేర్కొన్నారు. అన్ని సబ్జెక్టులకు రూ.125, మూడు సబ్జెక్టులకు రూ.110, మూడు కంటే ఎక్కువ ఉన్న సబ్జెక్టులకు రూ.125, వొకేషనల్ విద్యార్థులు అదనంగా రూ.60 చెల్లించాల్సి ఉంటుందని తెలిపారు.