News February 2, 2025
జనగామ: రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

జనగామ జిల్లా కేంద్రంలోని నెహ్రూ పార్క్ బ్రిడ్జి సమీపంలో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. బస్సు, ఆటో ఢీకొనడంతో ఓ వ్యక్తి మృతి చెందాడు. మృతుడు ధూలిమిట్ట మండలం కూటిగల్ గ్రామం రెడ్యా నాయక్ తండాకు చెందిన ధరావత్ విజయ్గా గుర్తించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Similar News
News December 23, 2025
అమ్మిరెడ్డిపల్లి ఉపసర్పంచ్ ఎన్నికపై కలెక్టర్కు ఫిర్యాదు

అమ్మిరెడ్డిపల్లి ఉపసర్పంచ్ ఎన్నిక సక్రమంగా జరగలేదని సర్పంచ్ లక్ష్మితో పాటు ఏడుగురు వార్డు సభ్యులు సోమవారం కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. ఈ నెల 14న తమను బెదిరించి బలవంతంగా ఎన్నిక నిర్వహించారని వారు ఆరోపించారు. నిబంధనలకు విరుద్ధంగా జరిగిన ఈ ఎన్నికను వెంటనే రద్దు చేసి, పారదర్శకంగా తిరిగి నిర్వహించాలని వారు వినతిపత్రం సమర్పించారు. కలెక్టర్ స్పందించి న్యాయం చేయాలని వారు కోరారు.
News December 23, 2025
సంగారెడ్డి జిల్లాలో దారుణం

సంగారెడ్డి జిల్లా కంది మండలం మామిడిపల్లిలో దారుణం జరిగింది. పశువులను మేపుతున్న సుజాత(40) మెడలోని బంగారం ఎత్తుకెళ్లేందుకు ఓ గుర్తుతెలియని వ్యక్తి ప్రయత్నించాడు. ఈ క్రమంలో ఆమె ప్రతిఘటించడంతో దుండగుడు గొంతు కోసి పరారయ్యాడు. తీవ్ర గాయాలైన సుజాత పరిస్థితి విషమించడంతో మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్కు తరలించారు. రూరల్ పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడి కోసం గాలింపు చేపట్టారు.
News December 23, 2025
సిద్దిపేట: ఐదుగురితో పోటీ.. ఒక్క ఓటుతో గెలుపు

బెజ్జంకి మండలం పెరుకబండ గ్రామ సర్పంచ్గా కర్రావుల స్వప్న సోమవారం బాధ్యతలు చేపట్టారు. జనరల్ కేటగిరీలో ఐదుగురు పురుష అభ్యర్థులతో పోటీపడి, కేవలం ఒక్క ఓటు మెజారిటీతో ఆమె సంచలన విజయం సాధించారు. స్వప్న మాట్లాడుతూ.. తన గెలుపునకు సహకరించిన వారికి కృతజ్ఞతలు తెలుపుతూ, పాలకవర్గ సభ్యులతో కలిసి గ్రామాభివృద్ధికి నిరంతరం కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పలువురు గ్రామస్థులు పాల్గొన్నారు.


