News February 2, 2025

జనగామ: రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

image

జనగామ జిల్లా కేంద్రంలోని నెహ్రూ పార్క్ బ్రిడ్జి సమీపంలో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. బస్సు, ఆటో ఢీకొనడంతో ఓ వ్యక్తి మృతి చెందాడు. మృతుడు ధూలిమిట్ట మండలం కూటిగల్ గ్రామం రెడ్యా నాయక్ తండాకు చెందిన ధరావత్ విజయ్‌గా గుర్తించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. 

Similar News

News December 21, 2025

రూ.800 కోట్లతో తిరుపతి బస్టాండ్ నిర్మాణం..?

image

తిరుపతి బస్టాండ్‌ను అంతర్జాతీయ ప్రమాణాలతో పునర్నిర్మించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. RTC, ప్రభుత్వం, ప్రైవేట్ భాగస్వామ్యంతో(PPP) ఈ ప్రాజెక్టు పట్టాలెక్కనుంది. NHML, RTC సంయుక్తంగా ప్రతిపాదించిన మోడల్‌ను CMకు పంపగా కొన్ని మార్పులతో ఆమోదం తెలిపినట్లు సమాచారం. ఈ ప్రాజెక్టుకు రూ.600 నుంచి రూ.800 కోట్లు ఖర్చు చేయనున్నారు. తిరుపతిలో సోమవారం జరిగే సమావేశంలో ప్రాజెక్ట్ వివరాలు వెల్లడించనున్నారు.

News December 21, 2025

రేపు వరదలు, ప్రమాదాలపై మాక్ డ్రిల్

image

వరదలు, పరిశ్రమల ప్రమాదాలు జరిగినప్పుడు ఎదుర్కోవాల్సిన తీరుపై అవగాహన కల్పించేందుకు సోమవారం ఖమ్మం నయాబజార్లోని ZPSS, జనరల్ ఆస్పత్రిలో మాక్ డ్రిల్ నిర్వహించనున్నట్లు ఖమ్మం కలెక్టర్ అనుదీప్ తెలిపారు. మాక్ డ్రిల్ జరగనున్నందున ప్రజలు హాజరయ్యేలా ఏర్పాట్లు చేశామని వెల్లడించారు. ఇందులో 50 మంది చొప్పున ఆపద మిత్ర వలంటీర్లు, 20 మంది NCC కేడెట్లు పాల్గొంటారని తెలిపారు.

News December 21, 2025

రామలక్ష్మణపల్లిలో 7.9°C ఉష్ణోగ్రత

image

కామారెడ్డి జిల్లాలో గడిచిన 24 గంటల్లో నమోదైన ఉష్ణోగ్రతల వివరాలను అధికారులు వెల్లడించారు. రామలక్ష్మణపల్లి 7.9°C, గాంధారి 8.2, మేనూర్ 8.4, జుక్కల్ 8.8, డోంగ్లి 8.9, నాగిరెడ్డిపేట 9, పెద్ద కొడప్గల్ 9.2, లచ్చపేట, సర్వాపూర్, దోమకొండ 9.3, బిచ్కుంద, నస్రుల్లాబాద్ 9.5, ఎల్పుగొండ 9.6, బొమ్మన్ దేవిపల్లి 9.7, మాచాపూర్ 9.8, పుల్కల్ 9.9, బీర్కూర్ 10°Cల కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.