News February 2, 2025
జనగామ: రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

జనగామ జిల్లా కేంద్రంలోని నెహ్రూ పార్క్ బ్రిడ్జి సమీపంలో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. బస్సు, ఆటో ఢీకొనడంతో ఓ వ్యక్తి మృతి చెందాడు. మృతుడు ధూలిమిట్ట మండలం కూటిగల్ గ్రామం రెడ్యా నాయక్ తండాకు చెందిన ధరావత్ విజయ్గా గుర్తించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Similar News
News December 21, 2025
చిత్తూరు మామిడి రైతులకు ముఖ్య గమనిక

మామిడి రైతులకు డిసెంబర్ నెల కీలకమని చంద్రగిరి HO అధికారిణి శైలజ అన్నారు. పూతదశకు ముందు నీటి తడులు ఆపితే చెట్టు ఒత్తిడికి లోనై మంచి పూత వస్తుందన్నారు. పిండి పురుగు పైకి ఎక్కకుండా కాండం చుట్టూ 25 సెం.మీ ప్లాస్టిక్ కవర్ కట్టి గ్రీజు రాయాలని, పూత సమంగా రావడానికి 13-0-45 నిష్పత్తిలో పొటాషియం నైట్రేట్ లీటరు నీటికి 10 గ్రా.కలిపి పిచికారీ చేయాలన్నారు. పాదుల్లో కలుపు తీసి,ఎండిన కొమ్మలు కత్తిరించాలన్నారు.
News December 21, 2025
సిద్దిపేట: తీవ్ర విషాదం.. దంపతుల ఆత్మహత్య

పురుగు మందు తాగి దంపతులు ఆత్మహత్య చేసుకున్న ఘటన బెజ్జంకిలో జరిగింది. స్థానికుల వివరాలు.. మండలంలోని దాచారానికి చెందిన వడ్లకొండ శ్రీహర్ష, రుక్మిణి దంపతులు. వారు బెజ్జంకిలో బట్టల దుకాణం నిర్వహిస్తున్నారు. ఆదివారం ఉదయం భార్యాభర్తలు పురుగు మందు తాగారు. ఘటనా స్థలంలో భార్య మృతి చెందగా, భర్త ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. దంపతుల మృతితో తీవ్ర విషాదం నెలకొంది. మృతికి గల కారణాలు తెలియాల్సి ఉంది.
News December 21, 2025
సూపర్ ఫామ్లో కాన్వే.. మరో సెంచరీ

వెస్టిండీస్తో మూడో టెస్టు రెండో ఇన్నింగ్స్లోనూ NZ ఓపెనర్ కాన్వే సెంచరీ చేశారు. 136 బంతుల్లో (8 ఫోర్లు, 3 సిక్సులు) సెంచరీ మార్క్ అందుకున్నారు. తొలి ఇన్నింగ్స్లో ఆయన <<18609470>>డబుల్ సెంచరీ<<>> సాధించారు. దీంతో ఒకే టెస్టులో డబుల్ సెంచరీ, సెంచరీ సాధించిన తొలి కివీస్ ప్లేయర్గా రికార్డు సృష్టించారు. కాగా ఈ మాజీ CSK ప్లేయర్ ఇటీవల జరిగిన ఐపీఎల్ మినీ వేలంలో అన్సోల్డ్గా మిగిలిన సంగతి తెలిసిందే.


