News February 2, 2025
జనగామ: రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

జనగామ జిల్లా కేంద్రంలోని నెహ్రూ పార్క్ బ్రిడ్జి సమీపంలో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. బస్సు, ఆటో ఢీకొనడంతో ఓ వ్యక్తి మృతి చెందాడు. మృతుడు ధూలిమిట్ట మండలం కూటిగల్ గ్రామం రెడ్యా నాయక్ తండాకు చెందిన ధరావత్ విజయ్గా గుర్తించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Similar News
News February 14, 2025
సిద్దిపేట: టీజీఐఐసీ భూసేకరణపై కలెక్టర్ సమీక్ష

జిల్లాలో తెలంగాణ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ లిమిటేడ్ (TGIIC) వారికీ కేటాయించిన భూముల భూసేకరణ వేగంగా పూర్తి చెయ్యాలని జిల్లా కలెక్టర్ ఎం.మను చౌదరి అధికారులను ఆదేశించారు. శుక్రవారం సమీకృత జిల్లా కార్యాలయల సముదాయంలోని కాన్ఫరెన్స్ హాల్లో జిల్లా టీజీఐఐసీ, రెవెన్యూ, సర్వే అధికారులతో జిల్లా అదనపు కలెక్టర్ అబ్దుల్ హమీద్తో కలిసి జిల్లా కలెక్టర్ సమావేశం నిర్వహించారు.
News February 14, 2025
స్టీల్ప్లాంట్ను లాభాల్లోకి తెచ్చేందుకు కృషి: శ్రీనివాస వర్మ

AP: విశాఖ స్టీల్ప్లాంట్ను ప్రైవేటీకరణ చేసే ఆలోచన లేదని కేంద్ర మంత్రి శ్రీనివాసవర్మ పునరుద్ఘాటించారు. కొన్ని కారణాల వల్ల ఫ్యాక్టరీ నష్టాల్లో ఉందని, దాన్ని లాభాల్లోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నామని తెలిపారు. ఇప్పటికే రూ.11,400కోట్ల ప్యాకేజీని కేంద్రం ఇచ్చిందని గుర్తుచేశారు. CM CBN, మంత్రి లోకేశ్ కృషితోనే ఇది సాధ్యమైందన్నారు. స్టీల్ప్లాంట్ అభివృద్ధికి కేంద్రం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు.
News February 14, 2025
మర్రిగూడ: లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన సర్వేయర్

మర్రిగూడ తహశీల్దార్ కార్యాలయంపై శుక్రవారం ఏసీబీ అధికారులు దాడులు చేశారు. సరంపేట గ్రామానికి చెందిన ఓ రైతు ఎనిమిది గుంటల భూమి సర్వే విషయంపై సర్వేయర్ రవి నాయక్ను సంప్రదించగా.. అతడు రూ.15వేలు డిమాండ్ చేశాడు. దీంతో బాధిత రైతు ఏసీబీని ఆశ్రయించాడు. ఇవాళ మధ్యాహ్నం కార్యాలయంలో రవి రూ.12వేలు లంచం తీసుకుంటుండగా అధికారులకు రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డాడు.