News January 22, 2025

జనగామ: రోడ్డు భద్రతపై అవగాహన సదస్సు 

image

జాతీయ రోడ్డు భద్రత మాసోత్సవాల్లో భాగంగా జనగామ జిల్లాలోని లారీ ఓనర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో లారీ డ్రైవర్లు, ఓనర్లకు జిల్లా రవాణా అధికారి జీవి శ్రీనివాస్ గౌడ్ రోడ్డు భద్రతపై అవగాహన సదస్సు నిర్వహించారు. డ్రైవర్లు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, మెలకువల గురించి అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.

Similar News

News October 28, 2025

హుజూరాబాద్: జమ్మికుంట రహదారిపై కొండచిలువ

image

హుజూరాబాద్ పట్టణంలోని జమ్మికుంట రహదారి వద్ద సోమవారం రాత్రి కొండచిలువ కనబడడంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. రోడ్డు మధ్యలో ఒక్కసారిగా కొండచిలువ కన్పించడంతో జనం గుమిగూడరు. సమాచారం తెలుసుకున్న పోలీసులు హుజూరాబాద్‌కు చెందిన పాములు పట్టే అఫ్జల్ ఖాన్‌ను పిలిపించారు. అతడు దానిని పట్టి క్షేమంగా దూరంగా గుట్టల్లో వదిలేయడంతో అంతా ఊపిరీ పీల్చుకున్నారు.

News October 28, 2025

చల్వాయి, గోవిందరావుపేట వైన్ షాపులకు రీ నోటిఫికేషన్

image

చల్వాయి, గోవిందరావుపేట వైన్ షాపులకు తక్కువ అప్లికేషన్స్ రావడంతో డ్రాను వాయిదా వేసిన ఎక్సైజ్ శాఖ రీ నోటిఫికేషన్ జారీ చేసింది. నవంబర్ 1వ తేదీలోగా అప్లికేషన్లు సమర్పించడానికి చివరి తేదీగా పేర్కొంది. 3న డ్రా నిర్వహిస్తారు. ఈ షాపులను ఎస్టీలకు రిజర్వ్ చేయగా చల్వాయి షాపునకు 2, గోవిందరావుపేటకు 3 దరఖాస్తులు మాత్రమే వచ్చాయి. దీంతో అధికారులు రీ నోటిఫికేషన్ ఇచ్చారు. నిన్న భంగపడ్డ వారికి ఇదో మంచి అవకాశం.

News October 28, 2025

కాకినాడ పోర్టుకు 7వ నంబర్ ప్రమాద హెచ్చరిక జారీ

image

మొంథా తుఫాను ప్రభావంతో కాకినాడ పోర్ట్‌లో 7వ నంబర్ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. ఇతర ప్రాంతాల నుంచి వచ్చే బస్సులను తగ్గించారు. గాలులకు తెగిపడే అవకాశం ఉన్నందున హోర్డింగ్‌లు, ఫ్లెక్సీలను తొలగించారు. విద్యాసంస్థలకు ఐదు రోజులు సెలవులు ప్రకటించారు. జిల్లాలో 269 పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు తప్పనిసరిగా పునరావాస కేంద్రాలకు తరలిరావాలని అధికారులు సూచిస్తున్నారు.