News February 9, 2025

జనగామ: వసతి గృహాన్ని పరిశీలించిన అదనపు కలెక్టర్

image

జనగామ జిల్లా కేంద్రంలోని ధర్మకంచ రైల్వే ట్రాక్ పరిధిలో గల ఎస్సీ బాలుర వసతి గృహాన్ని జిల్లా అదనపు కలెక్టర్ పింకేష్ కుమార్ సందర్శించి వసతులను పరిశీలించారు. ఈ సందర్భంగా విద్యార్థులతో ముఖాముఖి అయ్యి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం విద్యార్థులతో కలిసి భోజనం చేసి, రాత్రి అక్కడే బస చేయనున్నారు.

Similar News

News November 15, 2025

HYD: శుభం, శోకంలో వారితో గండమే!

image

ఇంట్లో శుభకార్యమైనా, శోకసంద్రమైనా వారి ఆగడాలు ప్రజలకు శాపంగా మారాయి. దావత్ చేస్తే హిజ్రాలు ఆటోలో వచ్చి హంగామా సృష్టిస్తున్నారు. రూ.లక్షల్లో డిమాండ్ చేస్తున్నారు. నిరాకరిస్తే దాడులకు దిగుతున్నారు. ఇటీవల చీర్యాలలో గృహయజమానిపై జరిగిన దాడి కలకలం రేపింది. శోకసమయంలో కాటికాపరుల దుశ్చర్యలూ ఆగడం లేదు. దశదిన కర్మలకు శ్మశానాలకే వెళ్లి వేలకు వేలు గుంజేస్తున్నారు. చర్యలు తీసుకోవాలని జనాలు డిమాండ్ చేస్తున్నారు.

News November 15, 2025

HYD: శుభం, శోకంలో వారితో గండమే!

image

ఇంట్లో శుభకార్యమైనా, శోకసంద్రమైనా వారి ఆగడాలు ప్రజలకు శాపంగా మారాయి. దావత్ చేస్తే హిజ్రాలు ఆటోలో వచ్చి హంగామా సృష్టిస్తున్నారు. రూ.లక్షల్లో డిమాండ్ చేస్తున్నారు. నిరాకరిస్తే దాడులకు దిగుతున్నారు. ఇటీవల చీర్యాలలో గృహయజమానిపై జరిగిన దాడి కలకలం రేపింది. శోకసమయంలో కాటికాపరుల దుశ్చర్యలూ ఆగడం లేదు. దశదిన కర్మలకు శ్మశానాలకే వెళ్లి వేలకు వేలు గుంజేస్తున్నారు. చర్యలు తీసుకోవాలని జనాలు డిమాండ్ చేస్తున్నారు.

News November 15, 2025

CM పీఠంపై సందిగ్ధం.. రేపు MLAలతో నితీశ్ భేటీ

image

బిహార్ ఎన్నికల్లో NDA 202 సీట్లతో బంపర్ మెజారిటీ సాధించింది. అయితే CM పదవిపై కూటమిలో ఇంకా సందిగ్ధతే ఉంది. ఈ తరుణంలో సీఎం పీఠాన్ని ఆశిస్తున్న నితీశ్ తన పార్టీ ఎమ్మెల్యేలతో ఆదివారం భేటీ కానున్నారు. ‘CM పోస్టుకు వివాదరహిత వ్యక్తి నితీశ్ మాత్రమే అర్హుడు. బిహార్లో ప్రత్యామ్నాయం ఎవరూ లేరు’ అని JDU MLAలు పేర్కొంటున్నారు. కాగా ఫలితాల అనంతరం LJP నేత చిరాగ్ సహా అనేకమంది నితీశ్ నివాసానికి పోటెత్తారు.