News February 9, 2025
జనగామ: వసతి గృహాన్ని పరిశీలించిన అదనపు కలెక్టర్

జనగామ జిల్లా కేంద్రంలోని ధర్మకంచ రైల్వే ట్రాక్ పరిధిలో గల ఎస్సీ బాలుర వసతి గృహాన్ని జిల్లా అదనపు కలెక్టర్ పింకేష్ కుమార్ సందర్శించి వసతులను పరిశీలించారు. ఈ సందర్భంగా విద్యార్థులతో ముఖాముఖి అయ్యి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం విద్యార్థులతో కలిసి భోజనం చేసి, రాత్రి అక్కడే బస చేయనున్నారు.
Similar News
News December 5, 2025
సూర్యాపేట: ‘పోస్టల్ బ్యాలెట్ల నిర్వహణకు పకట్బందీ ఏర్పాట్లు చేయాలి’

పోస్టల్ బ్యాలెట్ నిర్వహణకు ఫెసిలిటేషన్ సెంటర్లలో పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని జిల్లా ఎన్నికల సాధారణ పరిశీలకుడు రవి నాయక్ అన్నారు. గురువారం హైదరాబాద్ నుంచి జిల్లాలకు కేటాయించిన ఎన్నికల పరిశీలకులు, జిల్లాల కలెక్టర్లు, పంచాయితీరాజ్, పోలీస్ అధికారులతో రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ రాణి కుముదిని వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.
News December 5, 2025
గన్నవరం చేరుకున్న కన్నడ సూపర్ స్టార్

కన్నడ సూపర్స్టార్ డాక్టర్ శివరాజ్ కుమార్ శుక్రవారం బెంగళూరు నుంచి గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నారు. బొండా సిద్ధార్థ, గుమ్మడి నరసయ్య, డైరెక్టర్ పరమేశ్వర్ తదితరులు, అభిమాన సంఘాల నాయకులు ఆయనకు స్వాగతం పలికారు. అక్కడి నుంచి శివరాజ్ కుమార్ ఇంద్రకీలాద్రికి చేరుకొని కనకదుర్గమ్మను దర్శించుకుని ప్రత్యేక పూజలలో పాల్గొంటారు.
News December 5, 2025
వరంగల్ మార్కెట్లో పెరిగిన పత్తి ధర

వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో గత నాలుగు రోజులతో పోలిస్తే నేడు పత్తి ధర పెరిగింది. సోమవారం, మంగళవారం, బుధవారం, గురువారం క్వింటా పత్తి ధర రూ.7,100 పలికింది. ఈ క్రమంలో నేడు రూ.50 పెరిగి రూ.7,150 అయినట్లు మార్కెట్ అధికారులు తెలిపారు. దీంతో రైతన్నలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మార్కెట్లో కొనుగోళ్లు-అమ్మకాలు జోరుగా కొనసాగుతున్నాయి.


