News January 28, 2025

జనగామ: విద్యార్థులతో కలిసి భోజనం చేసిన కలెక్టర్

image

జనగామ జిల్లా దేవరుప్పుల కేజీబీవీ పాఠశాలను కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ సందర్శించి ఆకస్మిక తనిఖీ చేపట్టారు. అనంతరం విద్యార్థులతో కలిసి భోజనం చేస్తూ ముచ్చటించారు. ఏ తరగతి చదువుతున్నారు? ఏ ఊరు? ఉదయం అల్పాహారం ఎలా ఉంటుంది? సంధ్యా సమయంలో తినే స్నాక్స్ ఏమైనా ఇస్తున్నారా? వంటి పలు వివరాలను అడిగి తెలుసుకున్నారు.

Similar News

News February 10, 2025

ఇండియా కూటమిలో ఉండాలా వద్దా: ఆప్‌ సందిగ్ధం

image

ఢిల్లీ ఓటమితో ఆమ్‌ఆద్మీ పార్టీలో నిస్తేజం నెలకొంది. ఒకవైపు పంజాబ్‌లో పార్టీ చీలిపోతుందేమోనని భయం. మరోవైపు ఢిల్లీ అసెంబ్లీలో కేజ్రీవాల్, మనీశ్ సిసోడియా, అవధ్ ఓజా, సత్యేందర్ జైన్ అడుగుపెట్టలేని పరిస్థితి. పార్టీని ఆతిశీ టేకోవర్ చేస్తారేమోనన్న ఆందోళన. వీటన్నిటి నడుమ ఇండియా కూటమిలో కొనసాగాలో లేదో తేల్చుకోలేని పరిస్థితిలో ఆప్ ఉందని విశ్లేషకులు అంటున్నారు. కాంగ్రెస్ ఉన్న కూటమిని వీడొచ్చని వారి అంచనా.

News February 10, 2025

YCPలోకి నగరి MLA సోదరుడు..?

image

నగరి MLA గాలి భానుప్రకాశ్ సోదరుడు జగదీశ్ YCPలో చేరుతారని సమాచారం. ఆయన తండ్రి ముద్దుకృష్ణమ నాయుడు 2019లో మృతిచెందారు. రాజకీయ వారసుడి విషయంలో అప్పట్లో సందిగ్ధం నెలకొంది. దీంతో చంద్రబాబు ముద్దుకృష్ణమ సతీమణి సరస్వతికి MLC ఇచ్చారు. 2019, 24లో భాను ప్రకాశ్‌కు ఎమ్మెల్యే టికెట్ కేటాయించారు. అప్పటి నుంచి జగదీశ్ తటస్థంగా ఉంటూ వచ్చారు. తాజాగా ఈనెల 12న ఫ్యాన్ గూటికి చేరుతారని సమాచారం.

News February 10, 2025

MNCL: స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధం

image

మంచిర్యాల జిల్లాలో జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల నిర్వహణకు అవసరమైన ఏర్పాట్లను అధికారులు ముమ్మరం చేశారు. జిల్లాలోని 16 మండలాల్లో గతంలో 130 ఎంపీటీసీ స్థానాలు ఉండగా మున్సిపల్‌ కార్పొరేషన్‌లో 3 స్థానాలు విలీనమయ్యాయి. దీంతో కొత్తగా భీమిని, భీమారం మండలాల్లో అదనంగా 2 స్థానాలను పెంచారు. కాగా జిల్లాలో మొత్తం మొత్తం 129 ఎంపీటీసీ స్థానాలు, 16 జడ్పీటీసీ స్థానాలు, 16 ఎంపీపీ స్థానాలు ఉన్నాయి.

error: Content is protected !!