News March 8, 2025
జనగామ: విషాదం.. ఆశా కార్యకర్త మృతి

జనగామ జిల్లా రఘునాథ్పల్లి మండలం నిడిగొండలోని ఆరోగ్య ఉపకేంద్రంలో పనిచేస్తున్న ఆశా కార్యకర్త చీటకోడూర్ మహేశ్వరి హార్ట్ స్ట్రోక్తో శుక్రవారం మృతిచెందారని స్థానికులు తెలిపారు. మృతురాలికి ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. వృత్తిపరంగా గ్రామంలోని ప్రజలందరి మన్ననలు పొందిన ఆమె మృతిపై గ్రామస్థులు బాధాతప్త హృదయంతో నివాళులర్పించారు.
Similar News
News November 26, 2025
కలెక్టర్ను మైమరిపించిన ఓర్వకల్లు మహిళా రైతు

ఓర్వకల్లు మండలం ఉయ్యాలవాడలో ప్రకృతి వ్యవసాయంతో ఆదర్శంగా నిలుస్తున్న మహిళా రైతు రాజకుమారిని కలెక్టర్ డా. ఏ. సిరి ప్రశంసించారు. బుధవారం రాజకుమారి పొలంను కలెక్టర్ పరిశీలించి పంటల సాగు వివరాలు అడిగి తెలుసుకున్నారు. 70 సెంట్ల భూమిలో అంతర పంటల పద్ధతిలో కందులు, అలసందలు, సజ్జలు, మినుములు, గోరు చిక్కుడు, ఆకుకూరలు సాగు చేసి రూ.5 వేల పెట్టుబడితో రూ.60 వేల లాభం సాధించినట్లు రాజకుమారి వివరించారు.
News November 26, 2025
మూవీ అప్డేట్స్

* ప్రభాస్, డైరెక్టర్ మారుతి కాంబోలో తెరకెక్కుతోన్న ‘రాజాసాబ్’ మూవీపై అంచనాలు భారీగా పెరిగాయి. రిలీజ్కు ముందే కేవలం తెలుగు స్టేట్స్లోనే రూ.130కోట్లకు పైగా బిజినెస్ చేసినట్లు సినీవర్గాలు తెలిపాయి. ఈ చిత్రం 2026 జనవరి 9న విడుదల కానుంది.
*నందమూరి బాలకృష్ణ, గోపీచంద్ మలినేని కాంబోలో రాబోతున్న ‘NBK111’ సినిమా పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. ఈ హిస్టారికల్ మూవీలో బాలయ్య డ్యుయల్ రోల్లో నటిస్తారని టాక్.
News November 26, 2025
పెద్దపల్లి: జిల్లా కలెక్టర్తో రాణి కుముదిని VC

పంచాయతీ ఎన్నికల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ ఐ.రాణి కుముదిని అన్నారు. పంచాయతీ ఎన్నికల నిర్వహణపై ఆమె జిల్లా కలెక్టర్లతో బుధవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. కలెక్టరేట్ నుంచి కలెక్టర్ కోయ శ్రీహర్ష ఇందులో పాల్గొన్నారు. అన్ని పోలింగ్ కేంద్రాల్లో ఏర్పాట్లు, నోటిఫికేషన్ ప్రకటన, టీపోల్ అప్డేట్లు, ఎన్నికల నియమావళి అమలు పటిష్ఠంగా ఉండాలని కమిషనర్ సూచించారు.


