News April 11, 2025
జనగామ: వ్యక్తి బతికుండగానే చనిపోయాడని సృష్టించి భూమి పట్టా

వ్యక్తి బతికుండగానే చనిపోయాడని కాగితాలు సృష్టించి అక్రమంగా ఓ వ్యక్తికి చెందిన భూమిని పట్టా చేసుకున్న ఘటన జనగామ మండలం అడవి కేశవపూర్ గ్రామంలో చోటు చేసుకుంది. సీపీఎం గ్రామ కార్యదర్శి ప్రభాకర్ ప్రకారం.. గ్రామానికి చెందిన సోమయ్య అనే వ్యక్తికి చెందిన 4.25 గుంటల భూమిని అదే గ్రామానికి చెందిన ఎల్లమ్మ అక్రమంగా పట్టా చేయించుకుంది. న్యాయం చేయాలని కోరుతూ ఎమ్మార్వోకు గురువారం వినతిపత్రం అందజేశారు.
Similar News
News November 7, 2025
బట్టతల రాబోతోందని గుర్తించడం ఎలాగంటే..

– హెడ్ టెంపుల్స్ (M షేప్) కన్పించడం (పై ఫొటో చూడండి)
– తల పైభాగం, పరిసరాల్లో జుట్టు పలుచబడటం
– కటింగ్/గుండు చేయించాక రీగ్రోత్ స్లో కావడం
– దువ్వినా/తలస్నానం చేసినా సాధారణం కంటే ఎక్కువగా హెయిర్ ఫాల్
> కొన్ని మెడిసిన్స్ వాడకం, ఫ్యామిలీ హిస్టరీ, స్మోకింగ్, ఒత్తిడి, నిద్రలేమి, చర్మ సమస్యలు, పోషకాహార లోపంతో బట్టతల అవకాశాలు పెరుగుతాయి.
> సరైన చికిత్సతో కొంత ఫలితం ఉంటుంది.
Share It
News November 7, 2025
ప్రతీకా రావల్కు ప్రపంచకప్ మెడల్!

గాయం కారణంగా మహిళల ప్రపంచకప్ చివరి 2 మ్యాచ్లకు ప్రతీకా రావల్ <<18122584>>దూరమైన<<>> విషయం తెలిసిందే. ఆమె స్థానంలో స్క్వాడ్లోకి షెఫాలీ వర్మ రావడంతో ప్రతీకకు మెడల్ దక్కలేదు. ఈ నేపథ్యంలో ICC ఛైర్మన్ జైషా చొరవ తీసుకున్నారు. ‘మెడల్ అందజేసేందుకు ఏర్పాట్లు చేయాలనుకుంటున్నట్లు జైషా నా మేనేజర్కు మెసేజ్ చేశారు. తర్వాత మెడల్ వచ్చేసింది. తొలిసారి దాన్ని చూసి నాకు కన్నీళ్లు ఆగలేదు’ అని ప్రతీక చెప్పారు.
News November 7, 2025
పోలీస్ ట్రైనింగ్లో ‘భగవద్గీత’.. విమర్శలు

ట్రైనీలు భగవద్గీత చదవాలని MP పోలీస్ ట్రైనింగ్ వింగ్ చెప్పడం చర్చనీయాంశమైంది. 8 పోలీస్ ట్రైనింగ్ స్కూళ్లలో రాత్రి మెడిటేషన్ సెషన్కు ముందు భగవద్గీతలోని ఒక చాప్టర్ చదవాలని ADGP రాజా బాబూ సింగ్ ఆదేశాలిచ్చారు. ట్రైనీలు ధర్మబద్ధంగా నడుచుకునేలా గీత గైడ్ చేస్తుందని ఆయన చెప్పారు. ఇది కాషాయీకరణ ప్రయత్నమని, రాజ్యాంగ విరుద్ధమని కాంగ్రెస్ మండిపడింది. పోలీసింగ్ను మెరుగుపరిచే వ్యాయామమని BJP సమర్థించింది.


