News April 11, 2025
జనగామ: వ్యక్తి బతికుండగానే చనిపోయాడని సృష్టించి భూమి పట్టా

వ్యక్తి బతికుండగానే చనిపోయాడని కాగితాలు సృష్టించి అక్రమంగా ఓ వ్యక్తికి చెందిన భూమిని పట్టా చేసుకున్న ఘటన జనగామ మండలం అడవి కేశవపూర్ గ్రామంలో చోటు చేసుకుంది. సీపీఎం గ్రామ కార్యదర్శి ప్రభాకర్ ప్రకారం.. గ్రామానికి చెందిన సోమయ్య అనే వ్యక్తికి చెందిన 4.25 గుంటల భూమిని అదే గ్రామానికి చెందిన ఎల్లమ్మ అక్రమంగా పట్టా చేయించుకుంది. న్యాయం చేయాలని కోరుతూ ఎమ్మార్వోకు గురువారం వినతిపత్రం అందజేశారు.
Similar News
News January 2, 2026
ఖమ్మం: అవసరమే ఆసరా.. అడ్డగోలు వసూళ్లు.!

ఖమ్మం జిల్లాలో అక్రమ వడ్డీ వ్యాపారం యథేచ్ఛగా సాగుతోంది. నిబంధనలకు విరుద్ధంగా వ్యాపారులు చక్రవడ్డీలు, వడ్డీలతో సామాన్యుల రక్తాన్ని పీలుస్తున్నారు. అత్యవసర పరిస్థితుల్లో అవసరాలను ఆసరాగా చేసుకుని, రూ.10 నుంచి రూ.20 వరకు వడ్డీలు వసూలు చేస్తూ బాధితులను ఆర్థికంగా కుంగదీస్తున్నారు. పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదవుతున్నా, ఆగడాలకు అడ్డుకట్ట పడటం లేదు. అధికారులు అక్రమ వడ్డీ మాఫియాపై ఉక్కుపాదం మోపాలంటున్నారు.
News January 2, 2026
ఉదయగిరి: మళ్లీ పులి వచ్చింది..!

ఉదయగిరి మండలం కొండకింద గ్రామాల్లో పెద్దపులి సంచరిస్తోందని అక్కడి ప్రజలు చెబుతున్నారు. బండగానిపల్లి ఘాట్ రోడ్డు, దుర్గం, జి.చెరువుపల్లి అటవీ ప్రాంతాల్లో తిరగడాన్ని తాము చూశామని నాలుగైదు రోజులుగా ప్రజలు చెబుతున్నారు. తాజాగా గురువారం రాత్రి 7గంటల సమయంలో కుర్రపల్లి-కృష్ణాపురం మార్గంలో జువ్విమాను బాడవ వద్ద పులి రోడ్డు దాటడాన్ని కృష్ణారెడ్డిపల్లికి చెందిన దేవసాని శ్రీనివాస్ రెడ్డి చూశారు.
News January 2, 2026
215 పోస్టులు.. దరఖాస్తుల ఆహ్వానం

ఇండియన్ టెలిఫోన్ ఇండస్ట్రీస్(ITI) 215 యంగ్ ప్రొఫెషనల్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. పోస్టును బట్టి BE/B.Tech, MSc(ఎలక్ట్రానిక్స్/CS/IT), డిప్లొమా, ITI, MBA, MCA, BSc(IT), BCA, BBA, BBM, BMS ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం గల వారు జనవరి 12 వరకు అప్లై చేసుకోవచ్చు. షార్ట్ లిస్టింగ్, గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూ, స్కిల్ టెస్ట్ ద్వారా ఎంపిక చేస్తారు. *మరిన్ని ఉద్యోగాల కోసం జాబ్స్ కేటగిరీకి వెళ్లండి.


