News April 11, 2025
జనగామ: వ్యక్తి బతికుండగానే చనిపోయాడని సృష్టించి భూమి పట్టా

వ్యక్తి బతికుండగానే చనిపోయాడని కాగితాలు సృష్టించి అక్రమంగా ఓ వ్యక్తికి చెందిన భూమిని పట్టా చేసుకున్న ఘటన జనగామ మండలం అడవి కేశవపూర్ గ్రామంలో చోటు చేసుకుంది. సీపీఎం గ్రామ కార్యదర్శి ప్రభాకర్ ప్రకారం.. గ్రామానికి చెందిన సోమయ్య అనే వ్యక్తికి చెందిన 4.25 గుంటల భూమిని అదే గ్రామానికి చెందిన ఎల్లమ్మ అక్రమంగా పట్టా చేయించుకుంది. న్యాయం చేయాలని కోరుతూ ఎమ్మార్వోకు గురువారం వినతిపత్రం అందజేశారు.
Similar News
News October 15, 2025
త్వరలోనే సోయాబీన్ కొనుగోలు కేంద్రాలు: కలెక్టర్

త్వరలోనే జిల్లాలో సోయాబీన్ ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తామని కలెక్టర్ అభిలాష అభినవ్ తెలిపారు. రైతులు తమ పంట ధాన్యాన్ని తక్కువ ధరకు ప్రైవేట్ వ్యక్తులకు అమ్ముకోవద్దని ఆమె సూచించారు. రైతులు తప్పనిసరిగా తమ పంటను ప్రభుత్వానికే అమ్మాలని తెలిపారు. పంటల అమ్మకం విషయంలో రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆమె భరోసా ఇచ్చారు.
News October 15, 2025
కళాశాలల మధ్యే పొగాకు విక్రయాలు

తిరుపతి బాలాజీ కాలనీ సమీపంలోని విద్యాపీఠం ఆర్చ్ వద్ద నిషేధిత సిగురెట్లు, పొగాకు ఉత్పత్తుల విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. ఓ వైపు SV ఆర్ట్స్ కళాశాల వెనుక వైపు, మరో వైపు ఎమరాల్డ్స్ డిగ్రీ కళాశాల, ఇంకో వైపు విద్యాపీఠం, ఎస్వీ జూనియర్ కళాశాలలు ఉన్నాయి. విద్యార్థుల భవిష్యత్తు దృష్ట్యా ఇలాంటి వాటిపై అధికారులు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
News October 15, 2025
ICAR-IARIలో 18 ఉద్యోగాలు..

ICAR-IARI(ఇండియన్ అగ్రికల్చర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్) 18 కాంట్రాక్ట్ పోస్టులను భర్తీ చేయనుంది. వీటిలో యంగ్ ప్రొఫెషనల్(15), సీనియర్ రీసెర్చ్ ఫెలో(3) ఖాళీలు ఉన్నాయి. పోస్టును బట్టి సంబంధిత విభాగంలో డిగ్రీ, పీజీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. ఆసక్తిగల అభ్యర్థులు ఈనెల 31లోగా అప్లై చేసుకోవాలి. నవంబర్ 6, 7 తేదీల్లో ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్సైట్: https://iari.res.in/