News April 11, 2025

జనగామ: వ్యక్తి బతికుండగానే చనిపోయాడని సృష్టించి భూమి పట్టా

image

వ్యక్తి బతికుండగానే చనిపోయాడని కాగితాలు సృష్టించి అక్రమంగా ఓ వ్యక్తికి చెందిన భూమిని పట్టా చేసుకున్న ఘటన జనగామ మండలం అడవి కేశవపూర్ గ్రామంలో చోటు చేసుకుంది. సీపీఎం గ్రామ కార్యదర్శి ప్రభాకర్ ప్రకారం.. గ్రామానికి చెందిన సోమయ్య అనే వ్యక్తికి చెందిన 4.25 గుంటల భూమిని అదే గ్రామానికి చెందిన ఎల్లమ్మ అక్రమంగా పట్టా చేయించుకుంది. న్యాయం చేయాలని కోరుతూ ఎమ్మార్వోకు గురువారం వినతిపత్రం అందజేశారు.

Similar News

News November 25, 2025

BJP నన్ను రాజకీయంగా ఓడించలేదు: మమత

image

బీజేపీ రాజకీయంగా పోరాడి తనను ఓడించలేదని బెంగాల్ CM మమతా బెనర్జీ అన్నారు. ఈసీ నిష్పాక్షిక సంస్థ కాదని, ‘BJP కమిషన్‌’గా మారిపోయిందని ఆరోపించారు. బొంగావ్‌లో యాంటీ SIR ర్యాలీలో ఆమె మాట్లాడారు. బిహార్‌లో NDA ఆటను ప్రతిపక్షాలు అంచనా వేయలేకపోయాయని చెప్పారు. ఇంత తొందరగా SIR నిర్వహించాల్సిన అవసరమేంటని ప్రశ్నించారు. ఓట్ల జాబితా నిజమైనది కాకపోతే, 2024లో బీజేపీ గెలుపు కూడా నిజమైనది కాదని ఆరోపించారు.

News November 25, 2025

సిరిసిల్ల: కలెక్టర్ హరిత సెలవుల పొడిగింపు

image

సిరిసిల్ల జిల్లా కలెక్టర్ హరిత తన లాంగ్ లీవ్‌ను పొడిగించారు. అక్టోబరు 22న సెలవుపై వెళ్లిన ఆమె ఈనెల 24న విధులకు హాజరుకావాల్సి ఉంది. కానీ, ఆమె తన సెలవులను డిసెంబరు 12 వరకు పొడిగించారు. ఈ మేరకు ప్రభుత్వ అనుమతి తీసుకున్నారు. ఇక సిరిసిల్లకు ఇన్‌ఛార్జ్ కలెక్టర్‌గా గరిమా అగర్వాల్ విధులు నిర్వర్తిస్తున్న విషయం తెలిసిందే.
.

News November 25, 2025

పెద్దపల్లి: ‘డిసెంబర్ 31లోపు దరఖాస్తులు సమర్పించాలి’

image

స్కాలర్షిప్ దరఖాస్తులు డిసెంబర్ 31లోపు సమర్పించాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష సంబంధిత అధికారులను ఆదేశించారు. మంగళవారం పెండింగ్ ఎస్సీ విద్యార్థుల ప్రీ మెట్రిక్ స్కాలర్షిప్ దరఖాస్తులపై సమీకృత జిల్లా కలెక్టరేట్‌లో హాస్టల్ వెల్ఫేర్ అధికారులతో జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష రివ్యూ నిర్వహించారు. ఈ సమావేశంలో జిల్లా ఎస్సీ అభివృద్ధి అధికారి రవీందర్, హెచ్‌డబ్ల్యూఓలు, సంబంధిత అధికారులు ఉన్నారు.