News March 28, 2025
జనగామ వ్యవసాయ మార్కెట్ యార్డుకు నాలుగు రోజుల సెలవు

ఈనెల 29 నుంచి ఏప్రిల్ 1వరకు నాలుగు రోజులపాటు జనగామ వ్యవసాయ మార్కెట్ యార్డుకు సెలవు ప్రకటిస్తున్నట్లు శుక్రవారం జనగామ వ్యవసాయ మార్కెట్ కమిటీ ఛైర్మన్ బనుక శివరాజ్ యాదవ్ ప్రకటన ఒక ద్వారా తెలిపారు. రైతులు ఈ 4 రోజులు మార్కెట్కు తమ ఉత్పత్తులను తీసుకురావద్దని, తిరిగి 2న మార్కెట్ పునః ప్రారంభమవుతుందన్నారు.
Similar News
News December 16, 2025
మంచిర్యాల జిల్లాలో 3వ విడత ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి

2వ సాధారణ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో జిల్లాలో జరగనున్న 3వ విడత ఎన్నికల కొరకు అవసరమైన ఏర్పాటు చేశామని మంచిర్యాల జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ కుమారు దీపక్ తెలిపారు. 3వ విడత ఎన్నికల్లో భాగంగా జిల్లాలోని చెన్నూరు మందమర్రి, కోటపల్లి, భీమారం, జైపూర్ మండలాలలో గ్రామ పంచాయతీ సర్పంచ్, వార్డు సభ్యుల ఎన్నికలు జరగనున్నాయని కలెక్టర్ పేర్కొన్నారు. ఎన్నికలకు అన్ని రకాల ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు.
News December 16, 2025
IPL-2026 మినీ వేలం అప్డేట్స్

*బంగ్లాదేశ్ బౌలర్ ముస్తాఫిజుర్ రెహమాన్ను రూ.9.2 కోట్లకు కొనుగోలు చేసిన కేకేఆర్
*రూ.7 కోట్లకు వెస్టిండీస్ ఆల్రౌండర్ జేసన్ హోల్డర్ను దక్కించుకున్న గుజరాత్ టైటాన్స్
*రాహుల్ త్రిపాఠిని రూ.75 లక్షలకు కొనుగోలు చేసిన కేకేఆర్
*నిస్సాంక- రూ.4 కోట్లు (ఢిల్లీ క్యాపిటల్స్)
*మాథ్యూ షార్ట్- రూ.1.50 కోట్లు (చెన్నై)
News December 16, 2025
నెల్లూరులో మరో లేడీ డాన్.. ఇకపై వివరాలు చెబితే ప్రైజ్ .!

నెల్లూరులో పదేళ్లుగా గంజాయి అమ్ముతున్న షేక్ ముంతాజ్ను అదుపులోకి తీసుకున్నట్లు DSP ఘట్టమనేని తెలిపారు. స్థానికుల సమాచారంతో దాడులు చేయగా నిందితురాలి ఇంటిలో 20.90కిలోల గంజాయి లభ్యం అయిందన్నారు. దీంతో ఆమెతోపాటు కుమారులు సిరాజ్, జమీర్, కోడలు సుభాషిణితోపాటు మరో ఐదుగురిని అదుపులోకి తీసుకున్నామన్నారు. యువత ఇలాగే సమాచారం ఇస్తే వారి వివరాలు గోప్యంగా ఉంచడంతోపాటూ నగదు రివార్డ్ ఇస్తామని DSP పేర్కొన్నారు.


