News March 28, 2025
జనగామ వ్యవసాయ మార్కెట్ యార్డుకు నాలుగు రోజుల సెలవు

ఈనెల 29 నుంచి ఏప్రిల్ 1వరకు నాలుగు రోజులపాటు జనగామ వ్యవసాయ మార్కెట్ యార్డుకు సెలవు ప్రకటిస్తున్నట్లు శుక్రవారం జనగామ వ్యవసాయ మార్కెట్ కమిటీ ఛైర్మన్ బనుక శివరాజ్ యాదవ్ ప్రకటన ఒక ద్వారా తెలిపారు. రైతులు ఈ 4 రోజులు మార్కెట్కు తమ ఉత్పత్తులను తీసుకురావద్దని, తిరిగి 2న మార్కెట్ పునః ప్రారంభమవుతుందన్నారు.
Similar News
News December 23, 2025
గంజాయిపై సిరిసిల్ల పోలీసుల ఉక్కుపాదం

మాదకద్రవ్యాల కట్టడికి సిరిసిల్ల పోలీసులు చేపట్టిన చర్యలు ఫలితాలనిస్తున్నాయి. గంజాయి రవాణా, విక్రయాలపై ఉక్కుపాదం మోపడంతో గత ఏడాదితో పోలిస్తే ఈసారి కేసులు భారీగా తగ్గుముఖం పట్టాయి. జిల్లాలో 2024లో 98కేసుల్లో 265మందిని అరెస్టుచేసి 41.3 KGల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. 2025లో 49 కేసుల్లో 141మందిని అరెస్టుచేసి 4.740 KGల గంజాయిని సీజ్ చేశారు. గంజాయి అక్రమ రవాణాలో ఏకంగా 50శాతం తగ్గుదల నమోదైంది.
News December 23, 2025
పెనుమంట్ర: రోడ్డు ప్రమాదంపై త్రిసభ్య కమిటీ వేసిన కలెక్టర్

పెనుమంట్ర మండలం పొలమూరులో సోమవారం అర్ధరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదానికి సంబంధించి జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి స్పందించారు. ఈ ప్రమాదంలో ముగ్గురు యువకులు దుర్మరణం పాలైన విషయం తెలిసిందే. అయితే ఈ ఘటనకు సంబంధించి పోలీసు, రవాణా శాఖలతో పాటు ఆర్అండ్బీ శాఖ అధికారులతో త్రిసభ్య కమిటీ వేసి విచారణ చేయాలని ఆమె ఆదేశించారు.
News December 23, 2025
పరిశ్రమల స్థాపనకు మెండుగా అవకాశాలు: కలెక్టర్

అంబేద్కర్ కోనసీమ జిల్లాలో కొబ్బరి క్వాయర్ విలువ ఆధారిత పరిశ్రమల స్థాపనకు మెండుగా అవకాశాలు ఉన్నాయని కలెక్టర్ మహేష్ కుమార్ అన్నారు. ఆయన అమలాపురంలోని జిల్లా కలెక్టరేట్ వద్ద మంగళవారం రాష్ట్ర పేదరిక నిర్మూలన సంస్థల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అమరావతి నుంచి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్కు హాజరయ్యారు. జిల్లాలో ఎక్కడెక్కడ ఈ పరిశ్రమల స్థాపనకు అవకాశాలు ఉన్నాయో ఆయన వివరాలను తెలియజేశారు.


