News April 2, 2025
జనగామ: సన్నం బియ్యం పంపిణీకి విస్తృత చర్యలు: కలెక్టర్

జనగామ జిల్లాలో సన్నబియ్యం పంపిణీకి విస్తృత చర్యలు చేపట్టినట్లు జిల్లా కలెక్టర్ రిజ్వాన్ భాష షేక్ తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం సన్న బియ్యం పంపిణీ కార్యక్రమం శ్రీకారం చుట్టి ప్రారంభించడంతో జిల్లాలో పాలకుర్తి నియోజకవర్గంలో MLA యశస్విని రెడ్డి ప్రారంభించినట్లు తెలిపారు. జిల్లాలో 1,61,264 రేషన్ కార్డులకు గాను నిత్యవసర దుకాణాల ద్వారా 3151.228 మెట్టు టన్నుల సన్న బియ్యాన్ని పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు.
Similar News
News December 1, 2025
గంభీర్.. రోహిత్, కోహ్లీ మధ్య విభేదాలు?

టీమ్ఇండియా కోచ్ గంభీర్, స్టార్ క్రికెటర్లు రోహిత్, కోహ్లీ మధ్య విభేదాలున్నట్లుగా తెలుస్తోంది. ‘గంభీర్-రోహిత్, కోహ్లీ మధ్య బంధాలు అంత బాగా లేవు. ఇద్దరు ప్లేయర్ల భవిష్యత్తుపై విశాఖ లేదా రాయ్పూర్లో మీటింగ్ జరిగే ఛాన్స్ ఉంది’ అని జాతీయ మీడియా తెలిపింది. టెస్టులకు వీరు రిటైర్మెంట్ ప్రకటించినప్పటి నుంచే వివాదాలు మొదలైనట్లు పేర్కొంది. రోహిత్, సెలక్టర్ అగార్కర్ మధ్య కూడా సంబంధాలు సరిగా లేవని చెప్పింది.
News December 1, 2025
గూడూరులో దారుణం

భార్య, అత్త కలిసి భర్తపై వేడివేడి నూనె పోసిన ఘటన గూడూరు ఇందిరానగర్లో జరిగింది. భార్య వేరొకరితో అక్రమ సంబంధం పెట్టుకుందంటూ భర్త వారం నుంచి గొడవలు పడుతున్నాడు. ఈక్రమంలో భర్త తన బిడ్డలను చూడటానికి గూడూరులోని ఇందిరానగర్కు వెళ్లాడు. వేడి నూనె తనపై పోసి చంపడానికి ప్రయత్నం చేశారని బాధితుడు ఆరోపించారు. బంధువులు అతడిని ఆసుపత్రికి తరలించారు.
News December 1, 2025
భారీ జీతంతో ECGC లిమిటెడ్లో ఉద్యోగాలు.. అప్లైకి రేపే లాస్ట్ డేట్

ఎక్స్పోర్ట్ క్రెడిట్ గ్యారెంటీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్(ECGC)లో 30 ప్రొబేషనరీ ఆఫీసర్ పోస్టులకు అప్లై చేయడానికి రేపే ఆఖరు తేదీ. డిగ్రీ, MA(హిందీ/ఇంగ్లిష్) ఉత్తీర్ణులైన వారు అప్లై చేసుకోవచ్చు. రాత పరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. DEC 15నుంచి ప్రీ ఎగ్జామినేషన్ ట్రైనింగ్ ఇస్తారు. JAN 11న రాత పరీక్ష, FEB/MARలో ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. నెలకు జీతం రూ.88,635 -రూ.1,69,025 చెల్లిస్తారు.


