News March 13, 2025
జనగామ: సీఎం పర్యటన ఏర్పాట్లపై అధికారులతో కలెక్టర్ సమీక్ష

జనగామ జిల్లా సమీకృత కలెక్టర్ కార్యాలయంలోని ప్రధాన సమావేశ మందిరంలో సీఎం పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లపై అదనపు కలెక్టర్లు (స్థానిక సంస్థలు) పింకేష్ కుమార్, (రెవెన్యూ) రోహిత్ సింగ్, డీసీపీ రాజ మహేంద్ర నాయక్లతో కలిసి జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. సీఎం పర్యటన నేపథ్యంలో వివిధ శాఖల అధికారులకు కేటాయించిన విధులను బాధ్యతాయుతంగా నిర్వర్తించాలన్నారు.
Similar News
News February 11, 2026
న్యూజిలాండ్కు స్టార్ ఆల్రౌండర్ దూరం

T20 WCలో వరుస విజయాలతో జోరు మీదున్న న్యూజిలాండ్కు బిగ్ షాక్ తగిలింది. ఆ జట్టు స్టార్ ఆల్రౌండర్ మైకేల్ బ్రేస్వెల్ గాయం కారణంగా టోర్నీకి దూరమయ్యారు. ఆదివారం వార్మప్ సమయంలో అతను గాయపడినట్లు న్యూజిలాండ్ క్రికెట్(NZC) తెలిపింది. బ్రేస్వెల్ స్థానంలో కోల్ మెక్కాంచీ రిజర్వ్ బౌలర్ బెన్ సియర్స్తో కలిసి జట్టులో చేరనున్నట్లు పేర్కొంది. న్యూజిలాండ్ తన మూడో మ్యాచ్ ఈ నెల 14న దక్షిణాఫ్రికాతో ఆడనుంది.
News February 11, 2026
తిరుపతి : 12వ తేదీన కిసాన్ మేళా

తిరుపతి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం (RARS) నందు ఈ నెల 12వ తేదీ కిసాన్ మేళా జరుగుతుందని ఆ కార్యాలయం పేర్కొంది. ఈ కార్యక్రమానికి వ్యవసాయ శాఖ మంత్రి అచ్చన్నాయుడు, రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ ముఖ్య అతిథులుగా హాజరవుతారని తెలియజేశారు. సమగ్ర వ్యవసాయంపై రైతులకు అవగాహన సదస్సు ఉంటుందని పేర్కొన్నారు. రైతులు హాజరై కిసాన్ మేళాను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
News February 11, 2026
డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనాలు నడుపుతున్నారా?

TG: డ్రైవింగ్ లైసెన్స్ తీసుకోకుండా వాహనాలు నడిపితే చట్టపరమైన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరిస్తున్నారు. ఈ మేరకు మార్చి 1 నుంచి ప్రత్యేక తనిఖీలు నిర్వహించనున్నట్లు HYD పోలీసులు తెలిపారు. DL లేకుండా వాహనం నడిపి ప్రమాదానికి గురైతే ఇన్సూరెన్స్ క్లెయిమ్ వర్తించదని పేర్కొన్నారు. లైసెన్స్ లేనివారు RTA కార్యాలయం నుంచి తీసుకోవాలని సూచించారు.
* మైనర్లకు వాహనం ఇవ్వకపోవడం ఉత్తమం.


