News April 17, 2025
జనగామ: స్కానింగ్, డయాగ్నొస్టిక్ సెంటర్లలో అధికారుల తనిఖీ

జనగామలో స్కానింగ్, డయాగ్నొస్టిక్ సెంటర్లపై జిల్లా వైద్యాధికారి డా.మల్లిఖార్జున్ రావు, ఆరోగ్యశాఖ అధికారులు తనిఖీలు చేశారు. ఈ సందర్భంగా న్యూ విజయ స్కానింగ్ సెంటర్ను మూడు రోజులు మూసివేసి, రూ.50 వేలకు పైగా జరిమానా విధించినట్లు చెప్పారు. అనుమతి లేని సిటీ ఐ కేర్ & సాయి స్కానింగ్ సెంటర్లను మూసివేశారు. నిబంధనలకు విరుద్ధంగా హాస్పిటల్ యాజమాన్యాలు వ్యవహరిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
Similar News
News April 20, 2025
క్రికెట్ ఆడుతుండగా గుండెపోటు.. యువకుడి మృతి

TG: మేడ్చల్(D) రాంపల్లి దాయరలో విషాదం చోటు చేసుకుంది. క్రికెట్ ఆడుతూ ప్రణీత్(32) గ్రౌండ్లోనే కుప్పకూలాడు. త్యాగి స్పోర్ట్స్ వెన్యూ గ్రౌండ్లో మ్యాచ్ ఆడుతుండగా అతనికి గుండెపోటు వచ్చింది. వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లినా ప్రయోజనం లేకపోయింది. ప్రణీత్ను బోయినపల్లి వాసిగా గుర్తించారు.
News April 20, 2025
బాలుడిని కిడ్నాప్ చేసి లైంగిక దాడి.. మహిళకు జైలు శిక్ష

రాజస్థాన్లో ఓ బాలుడిని(17) అపహరించి లైంగిక దాడికి పాల్పడిన మహిళ(30)కు బుండీ పోక్సో కోర్టు 20 ఏళ్ల జైలు శిక్ష విధించింది. 2023 నవంబరు 7న ఘటన జరగగా, బాధితుడి తల్లి అప్పట్లో పోలీసుల్ని ఆశ్రయించారు. నిందితురాలు తమ కుమారుడికి మద్యం పట్టించి లైంగిక దాడికి పాల్పడిందని వారికి తెలిపారు. దర్యాప్తులో ఫిర్యాదు నిజమని నిర్ధారణ కావడంతో పోక్సో కోర్టు నిందితురాలికి జైలు శిక్షతో పాటు రూ.45వేల జరిమానా విధించింది.
News April 20, 2025
వైవీయూ స్నాతకోత్సవం నోటిఫికేషన్ విడుదల

వైవీయూ11,12,13,14వ కాన్వకేషన్స్ జూన్/ జులై నెలల్లో నిర్వహించనున్నామని వైవీయూ పరీక్షల నిర్వహణ అధికారి ప్రొ. కేఎస్వీ కృష్ణారావు వెల్లడించారు. వీసీ ప్రొ. అల్లం శ్రీనివాస రావు స్నాతకోత్సవాలను నిర్వహించేందుకు తాజాగా నిర్ణయం తీసుకున్నారు. ఈ సందర్భంగా వైవీయూ స్నాతకోత్సవం నోటిఫికేషన్ను http://convocation.yvuexams.in వెబ్సైట్లో చూడాలని సూచించారు.