News February 12, 2025

జనగామ: స్థానిక ఎన్నికలకు సిద్ధమవుతున్న అధికారులు

image

జనగామ జిల్లాలో త్వరలోనే స్థానిక సంస్థల ఎన్నికలు రానున్నాయన్న సంకేతాలతో అధికారులు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే ఉమ్మడి జిల్లాలో మూడు మండలాల చొప్పున గ్రామపంచాయతీ ఎన్నికలకు రిటర్నింగ్, అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులకు ట్రైనింగ్ నిర్వహిస్తున్నట్లు సమాచారం. నోటిఫికేషన్ విడుదలైన వెంటనే ఎన్నికలకు సంబంధించిన పూర్తి ఏర్పాట్లు చేసేలా సమాయత్తం అవుతున్నారు.

Similar News

News November 20, 2025

HYD: 3వేల మంది అతిథులు.. 2,500 మంది పోలీసులు

image

వచ్చేనెల 8, 9 తేదీల్లో ఫ్యూచర్ సిటీ ప్రాంతంలోని కందుకూర్ మీర్ఖాన్‌పేటలో జరిగే గ్లోబల్ సమ్మిట్‌కు పోలీసులు కట్టుదిట్టమైన భద్రత కల్పించనున్నారు. ఈ సమ్మిట్‌కు దాదాపు 3వేల మంది వీఐపీలు, వారి అసిస్టెంట్లు హాజరుకానున్నారు. ఈ నేపథ్యంలో ఆ ప్రాంతంలో పోలీసులు వెయ్యి సీసీ కెమెరాలను ఏర్పాటు చేయనున్నారు. అంతేకాక 2,500 మంది పోలీసులు భద్రతా చర్యల్లో పాల్గొంటున్నారు.

News November 20, 2025

ఈ ఉద్యమమే టెక్ శంకర్‌ను మావోయిస్టుగా మార్చింది

image

మావోయిస్ట్ జోగారావు అలియాస్ టెక్ శంకర్ నిన్న జరిగిన ఎన్‌కౌంటర్‌లో మృతి చెందిన విషయం తెలిసిందే. దీంతో స్వగ్రామం వజ్రపుకొత్తూరు(M)బాతుపురంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. 1988లోని పీపుల్స్ ఉద్యమంతో మావోయిస్టుల పార్టీలో చేరి 1995 DEC 1న ఒంగోలు మాజీ MP సుబ్బరామిరెడ్డిపై కాల్పుల కేసులో శంకర్‌ది కీలక పాత్రని సమాచారం. బాతుపురంలో స్తూపం ఆవిష్కరణకు గద్దర్‌ రాకతో రాష్ట్రంలో ఈయన పేరు మార్మోగింది.

News November 20, 2025

తిరుపతి: బ్లాక్ మనీని వైట్‌గా మార్చారు ఇలా..!

image

మద్యం స్కాం డబ్బులతోనే చెవిరెడ్డి కుటుంబం స్థలాలు కొనిందని.. వాటిని జప్తు చేయాలని ACB కోర్టులో సిట్ పిటిషన్ వేయనుంది. 2021 నుంచి 2023 వరకు చెవిరెడ్డి కుటుంబం రూ.63.72 కోట్ల విలువైన స్థిరాస్థులు కొనిందంట. రికార్డుల్లో రూ.8.85కోట్లుగానే చూపించి 54.87 కోట్లు వైట్ మనీగా మార్చారని సిట్ తన దర్యాప్తులో తేల్చిందంట. వడమాలపేట, తిరుపతి, తొట్టంబేడు, కేవీబీపురం, గూడూరు మండలాల్లో ఈ స్థలాలు కొనుగోలు చేశారు.